ETV Bharat / bharat

'బలగాల ఉపసంహరణ ఇరువర్గాలకూ ప్రయోజనకరమే' - Eastern Ladakh stand off news updates

సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఇరువర్గాలకూ ప్రయోజనకరంగా ఉందన్నారు సైన్యాధిపతి ఎంఎం నరవాణె. ప్రతిష్టంభనను తొలగించడానికి భారత్ మొదటినుంచీ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్నారు.

Disengagement win-win situation for both sides: Army chief
'బలగాల ఉపసంహరణ ఇరువర్గాలకూ ప్రయోజనమే'
author img

By

Published : Feb 24, 2021, 9:30 PM IST

Updated : Feb 24, 2021, 9:42 PM IST

వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ విజయవంతంగా సాగుతోందన్నారు భారత సైన్యాధిపతి ఎంఎం నరవాణె. ఈ విషయంలో ఇరువైపులా ప్రయోజనకరంగా ఉందన్నారు. పాంగాంగ్​లోని దక్షిణ, ఉత్తర ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ.. ప్రతిష్టంభనకు మంచి ముగింపును ఇచ్చిందన్నారు. వివేకానంద ఇంటర్నేషనల్​ ఫౌండేషన్​ నిర్వహించిన కార్యక్రమంలో తూర్పు లద్దాఖ్​ సరిహద్దుల్లో అనిశ్చితిపై ఆయన మాట్లాడారు.

మొదటినుంచీ వ్యూహాత్మకంగానే..

లద్దాఖ్​ ప్రతిష్టంభన సమయంలో భారత్​ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిదన్నారు నరవాణె. దేశ అంతర్గత భద్రత విషయంలోనూ అంతే వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. ప్రతిష్టంభనను తొలగించడానికి భారత్​ సమష్టి కృషి చేసిందన్నారు నరవాణె. రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, విదేశాంగ మంత్రి ఎస్​​ జైశంకర్.. చైనా అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని పేర్కొన్నారు.

"ప్రతిష్టంభనను తొలగించడానికి సమష్టి కృషి చేశాం. ఓ ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్లాం. దాని ఫలితాలు ఎలా ఉన్నా, ఏం జరిగినా. అయితే గొప్ప విజయాన్నే సాధించాం. ఇది మంచి పరిణామమే అని భావిస్తున్నా. ఇరుదేశాలు ఏదో సాధించాయన్న భావనలో ఉన్నాయి."

- ఎంఎం నరవాణె, సైన్యాధ్యక్షుడు

ఈ విషయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​.. ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడ్డాయన్నారు నరవాణె. వ్యూహాత్మక వ్యవహారాలపై డోభాల్​ దూర దృష్టి.. ప్రతిష్టంభన తగ్గించడంలో తోడ్పడిందన్నారు.

ఇదీ చూడండి: వ్యాపారం ప్రభుత్వ విధి కాదు: మోదీ

వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ విజయవంతంగా సాగుతోందన్నారు భారత సైన్యాధిపతి ఎంఎం నరవాణె. ఈ విషయంలో ఇరువైపులా ప్రయోజనకరంగా ఉందన్నారు. పాంగాంగ్​లోని దక్షిణ, ఉత్తర ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ.. ప్రతిష్టంభనకు మంచి ముగింపును ఇచ్చిందన్నారు. వివేకానంద ఇంటర్నేషనల్​ ఫౌండేషన్​ నిర్వహించిన కార్యక్రమంలో తూర్పు లద్దాఖ్​ సరిహద్దుల్లో అనిశ్చితిపై ఆయన మాట్లాడారు.

మొదటినుంచీ వ్యూహాత్మకంగానే..

లద్దాఖ్​ ప్రతిష్టంభన సమయంలో భారత్​ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిదన్నారు నరవాణె. దేశ అంతర్గత భద్రత విషయంలోనూ అంతే వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. ప్రతిష్టంభనను తొలగించడానికి భారత్​ సమష్టి కృషి చేసిందన్నారు నరవాణె. రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, విదేశాంగ మంత్రి ఎస్​​ జైశంకర్.. చైనా అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని పేర్కొన్నారు.

"ప్రతిష్టంభనను తొలగించడానికి సమష్టి కృషి చేశాం. ఓ ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్లాం. దాని ఫలితాలు ఎలా ఉన్నా, ఏం జరిగినా. అయితే గొప్ప విజయాన్నే సాధించాం. ఇది మంచి పరిణామమే అని భావిస్తున్నా. ఇరుదేశాలు ఏదో సాధించాయన్న భావనలో ఉన్నాయి."

- ఎంఎం నరవాణె, సైన్యాధ్యక్షుడు

ఈ విషయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​.. ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడ్డాయన్నారు నరవాణె. వ్యూహాత్మక వ్యవహారాలపై డోభాల్​ దూర దృష్టి.. ప్రతిష్టంభన తగ్గించడంలో తోడ్పడిందన్నారు.

ఇదీ చూడండి: వ్యాపారం ప్రభుత్వ విధి కాదు: మోదీ

Last Updated : Feb 24, 2021, 9:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.