ETV Bharat / bharat

'తుదిదశకు బలగాల ఉపసంహరణ ప్రక్రియ'

author img

By

Published : Feb 19, 2021, 11:04 AM IST

తూర్పు లద్దాఖ్​లో భారత్​-చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ చివరి దశలో ఉందని రక్షణ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు తెలిపారు. ఈ మేరకు పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటి ముందు నివేదించారు. బడ్జెట్​లో రక్షణశాఖలో ఏ విభాగానికి ఎంత కేటాయించాలో పరిశీలించేందుకు భాజపా నాయకుడు జువెల్​ ఓరమ్​ అధ్యక్షతన ఈ కమిటీ సమావేశమైంది.

Disengagement process in eastern Ladakh in final phase: Top defence officials to Par panel
'తూర్పు లద్దాఖ్​లో చివరిదశలో బలగాల ఉపసంహరణ'

తూర్పు లద్దాఖ్​లో భారత్​-చైనా చేపట్టిన బలగాల ఉపసంహరణ ప్రక్రియ.. తుది దశకు చేరిందని తెలుస్తోంది. భారత రక్షణ విభాగానికి చెందిన ఉన్నతస్థాయి అధికారులు.. పార్లమెంట్​ స్టాండింగ్​ కమిటీకి ఈ విషయాన్ని తెలిపినట్టు సమాచారం.

వాగ్వాదం..

బడ్జెట్​లో రక్షణశాఖలో ఏ విభాగానికి ఎంత నిధులు కేటాయించాలో పరిశీలించేందుకు గురువారం.. స్టాండింగ్​ కమిటీ సమావేశమైంది. త్రిదళాధిపతి బిపిన్​ రావత్​తో పాటు పలువులు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కమిటీకి.. భాజపా నాయకుడు జువెల్​ ఓరమ్​ అధ్యక్షత వహించగా.. కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ సభ్యుడిగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో రాహుల్​ గాంధీకి జువెల్ ఓరమ్​ మధ్య వాగ్వాదం జరిగింది. రాహుల్​.. సరిహద్దు వివాదంపై పలు ప్రశ్నలను సంధించేందుకు యత్నించారు. దీన్ని జువెల్​ ఖండించారు. సమావేశం అజెండా అది కాదన్నారు.

కొన్ని నెలల ప్రతిష్టంభన అనంతరం సరిహద్దులో ఇటీవలే బలగాల ఉపసంహరణ ప్రక్రియను చేపట్టాయి భారత్​-చైనా. దీనిపై పార్లమెంట్​ వేదికగా రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ కూడా ప్రసంగించారు.

ఇదీ చదవండి : 'జమ్ముకశ్మీర్​కు ఇప్పటికీ ఉగ్రముప్పు'

తూర్పు లద్దాఖ్​లో భారత్​-చైనా చేపట్టిన బలగాల ఉపసంహరణ ప్రక్రియ.. తుది దశకు చేరిందని తెలుస్తోంది. భారత రక్షణ విభాగానికి చెందిన ఉన్నతస్థాయి అధికారులు.. పార్లమెంట్​ స్టాండింగ్​ కమిటీకి ఈ విషయాన్ని తెలిపినట్టు సమాచారం.

వాగ్వాదం..

బడ్జెట్​లో రక్షణశాఖలో ఏ విభాగానికి ఎంత నిధులు కేటాయించాలో పరిశీలించేందుకు గురువారం.. స్టాండింగ్​ కమిటీ సమావేశమైంది. త్రిదళాధిపతి బిపిన్​ రావత్​తో పాటు పలువులు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కమిటీకి.. భాజపా నాయకుడు జువెల్​ ఓరమ్​ అధ్యక్షత వహించగా.. కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ సభ్యుడిగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో రాహుల్​ గాంధీకి జువెల్ ఓరమ్​ మధ్య వాగ్వాదం జరిగింది. రాహుల్​.. సరిహద్దు వివాదంపై పలు ప్రశ్నలను సంధించేందుకు యత్నించారు. దీన్ని జువెల్​ ఖండించారు. సమావేశం అజెండా అది కాదన్నారు.

కొన్ని నెలల ప్రతిష్టంభన అనంతరం సరిహద్దులో ఇటీవలే బలగాల ఉపసంహరణ ప్రక్రియను చేపట్టాయి భారత్​-చైనా. దీనిపై పార్లమెంట్​ వేదికగా రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ కూడా ప్రసంగించారు.

ఇదీ చదవండి : 'జమ్ముకశ్మీర్​కు ఇప్పటికీ ఉగ్రముప్పు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.