ETV Bharat / bharat

ఇంటర్నెట్ లేకుండానే మీ మొబైల్​లో లైవ్ TV, OTT చూడొచ్చు- అదెలాగో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 4:52 PM IST

Updated : Jan 16, 2024, 5:06 PM IST

Direct To Mobile Technology In India : ఇంటర్నెట్​ లేకుండా మొబైల్​ ఫోన్​లో లైవ్​ టీవీ చూడొచ్చా? డేటా అవసరం లేకుండా ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్​ చేసుకోవచ్చా? అసలు ఇది సాధ్యమేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో ఇదంతా నిజమయ్యే అవకాశం ఉంది. అందుకోసం D2M అనే కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. దాని గురించి పూర్తి వివరాలు మీకోసం.

Direct To Mobile Technology In India
Direct To Mobile Technology In India

Direct To Mobile Technology In India : 'డైరెక్ట్​ టు మొబైల్ (D2M)' బ్రాడ్​కాస్టింగ్ సాంకేతికత వచ్చే ఏడాదికల్లా సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని భారత శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి అభయ్ కరాండికర్ తెలిపారు. ఇంటర్నెట్​తో పాటు ఈ కొత్త సాంకేతికత కూడా వినియోగంలో ఉంటుందని వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఈ సాంకేతికతపై ల్యాబ్​ ట్రయల్స్​ జరగుతున్నాయని చెప్పారు. ఆ తర్వాత నగరాల వారీగా ల్యాబ్​ ట్రయల్స్ చేయాల్సి ఉందన్నారు. దీంతో ఈ సాంకేతికత సామర్థ్యాన్ని ప్రదర్శించవచ్చని తెలిపారు.

"వచ్చే ఏడాదికల్లా ఈ D2M సాంకేతికతను సాధారణ ప్రజల కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యవస్థతో ప్రారంభిస్తాము. అయితే ఇది ఇంటర్నెట్​కు పోటీ కాదు. ఉదాహరణకు మీరు ఇంటర్నెట్​ ద్వారా ఓటీటీ వినియోగిస్తున్నారు. ఇక నుంచి D2M ద్వారా ఇంటర్నెట్​ లేకుండానే ఓటీటీ ఉపయోగించుకోవచ్చు. ఈ D2M, ఇంటర్నెట్​తో పాటు వాడకంలో ఉన్న వైఫై సాంకేతికతను పోలి ఉంటుంది. ఇది కూడా ఇంటర్నెట్​తో పాటు మనుగడ సాగించగలదు."
-- అభయ్ కరాండికర్, భారత శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సాంకేతికత ఎలా ఉపయోగపడుతుందో అభయ్ కరాండికర్ వివరించారు. 'గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది తక్కువ స్థాయి స్మార్ట్​ఫోన్​లు, 3జీ కనెక్షన్​లు వినియోగిస్తున్నారు. వారు ఇంకా హై- స్పీడ్ డేటాకు మారలేదు. అయితే D2M టెక్నాలజీ ద్వారా, హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే డేటాను వినియోగించుకోవచ్చు' అని తెలిపారు.

  • #WATCH | On 'direct-to-mobile' (D2M) broadcasting technology, Dr Abhay Karandikar, Secretary, Department of Science of Technology (DST) says, "It will be disruptive because the D2M has the potential to really revolutionize the broadcast industry. It will not be a competition to… pic.twitter.com/11ms7CEzgH

    — ANI (@ANI) January 16, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఏమిటీ D2M సాంకేతికత ?
D2M సాంకేతికతకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం ఉండదు. దీని ద్వారా నేరుగా మొబైల్ ఫోన్‌లకు వీడియో, ఇతర రకాల మల్టీమీడియా కంటెంట్‌ను ప్రసారం చేయొచ్చు. ఉదాహరణకు, మనం ఎఫ్​ఎమ్ రేడియోలో వివిధ ఛానళ్లలో వార్తలు, పాటలు వింటుంటాం. ఇందులో వివిధ రకాల ఫ్రీక్వెన్సీలతో వివిధ రేడియో సంస్థలు ఉంటాయి. అవి వాటి కంటెంట్​ను బ్రాడ్​కాస్ట్ చేస్తాయి. మన స్మార్ట్​ ఫోన్​లో ఉన్న ఎఫ్​ఎమ్​, ఆ రేడియో సిగ్నల్స్​ను ట్యూన్​ చేస్తుంది. దీంతో మనకు నచ్చిన ఎఫ్​ఎమ్​ను వినొచ్చు. అలాగే డీటీహెచ్​లో కూడా ఉపగ్రహాల నుంచి టీవీ సిగ్నల్స్​ను మన ఇళ్లపై ఉండే డిష్​ యాంటెనా రిసీవ్​ చేసుకుంటుంది. తర్వాత సెట్​ టాప్​ బాక్స్​ ఆ సిగ్నల్స్​ను ట్యూన్​ చేసి మనకు నచ్చిన ఛానల్ చూసేలా చేస్తుంది. అచ్చం D2M సాంకేతికత కూడా ఇలాగే పని చేస్తుంది. ఇంటర్నెట్ అవసరం లేకుండా మనకు నచ్చిన టీవీ ఛానల్, ఓటీటీ​ కంటెంట్​ను కూడా చూడొచ్చు.

అయితే ప్రస్తుతం ఉన్న మొబైళ్లు ఈ సాంకేతికతకు సపోర్ట్ చేయవు. దీని కోసం మొబైళ్లలో యాంటెనా, తక్కువ శబ్దం చేసే యాంప్లిఫైయర్​లు, బేస్​బ్యాండ్​ ఫిల్టర్​లు, రిసీవర్​, ప్రత్యేక బేస్​బ్యాండ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉండాలి.

గూగుల్​ మ్యాప్స్​లోనూ లైవ్​ లొకేషన్​ షేరింగ్​- ఎలాగో తెలుసా?

అమెరికా ల్యాండర్ ప్రయోగం విఫలం- చంద్రుడిపైకి మనుషుల్ని పంపే మిషన్ వాయిదా

Direct To Mobile Technology In India : 'డైరెక్ట్​ టు మొబైల్ (D2M)' బ్రాడ్​కాస్టింగ్ సాంకేతికత వచ్చే ఏడాదికల్లా సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని భారత శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి అభయ్ కరాండికర్ తెలిపారు. ఇంటర్నెట్​తో పాటు ఈ కొత్త సాంకేతికత కూడా వినియోగంలో ఉంటుందని వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఈ సాంకేతికతపై ల్యాబ్​ ట్రయల్స్​ జరగుతున్నాయని చెప్పారు. ఆ తర్వాత నగరాల వారీగా ల్యాబ్​ ట్రయల్స్ చేయాల్సి ఉందన్నారు. దీంతో ఈ సాంకేతికత సామర్థ్యాన్ని ప్రదర్శించవచ్చని తెలిపారు.

"వచ్చే ఏడాదికల్లా ఈ D2M సాంకేతికతను సాధారణ ప్రజల కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యవస్థతో ప్రారంభిస్తాము. అయితే ఇది ఇంటర్నెట్​కు పోటీ కాదు. ఉదాహరణకు మీరు ఇంటర్నెట్​ ద్వారా ఓటీటీ వినియోగిస్తున్నారు. ఇక నుంచి D2M ద్వారా ఇంటర్నెట్​ లేకుండానే ఓటీటీ ఉపయోగించుకోవచ్చు. ఈ D2M, ఇంటర్నెట్​తో పాటు వాడకంలో ఉన్న వైఫై సాంకేతికతను పోలి ఉంటుంది. ఇది కూడా ఇంటర్నెట్​తో పాటు మనుగడ సాగించగలదు."
-- అభయ్ కరాండికర్, భారత శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సాంకేతికత ఎలా ఉపయోగపడుతుందో అభయ్ కరాండికర్ వివరించారు. 'గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది తక్కువ స్థాయి స్మార్ట్​ఫోన్​లు, 3జీ కనెక్షన్​లు వినియోగిస్తున్నారు. వారు ఇంకా హై- స్పీడ్ డేటాకు మారలేదు. అయితే D2M టెక్నాలజీ ద్వారా, హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే డేటాను వినియోగించుకోవచ్చు' అని తెలిపారు.

  • #WATCH | On 'direct-to-mobile' (D2M) broadcasting technology, Dr Abhay Karandikar, Secretary, Department of Science of Technology (DST) says, "It will be disruptive because the D2M has the potential to really revolutionize the broadcast industry. It will not be a competition to… pic.twitter.com/11ms7CEzgH

    — ANI (@ANI) January 16, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఏమిటీ D2M సాంకేతికత ?
D2M సాంకేతికతకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం ఉండదు. దీని ద్వారా నేరుగా మొబైల్ ఫోన్‌లకు వీడియో, ఇతర రకాల మల్టీమీడియా కంటెంట్‌ను ప్రసారం చేయొచ్చు. ఉదాహరణకు, మనం ఎఫ్​ఎమ్ రేడియోలో వివిధ ఛానళ్లలో వార్తలు, పాటలు వింటుంటాం. ఇందులో వివిధ రకాల ఫ్రీక్వెన్సీలతో వివిధ రేడియో సంస్థలు ఉంటాయి. అవి వాటి కంటెంట్​ను బ్రాడ్​కాస్ట్ చేస్తాయి. మన స్మార్ట్​ ఫోన్​లో ఉన్న ఎఫ్​ఎమ్​, ఆ రేడియో సిగ్నల్స్​ను ట్యూన్​ చేస్తుంది. దీంతో మనకు నచ్చిన ఎఫ్​ఎమ్​ను వినొచ్చు. అలాగే డీటీహెచ్​లో కూడా ఉపగ్రహాల నుంచి టీవీ సిగ్నల్స్​ను మన ఇళ్లపై ఉండే డిష్​ యాంటెనా రిసీవ్​ చేసుకుంటుంది. తర్వాత సెట్​ టాప్​ బాక్స్​ ఆ సిగ్నల్స్​ను ట్యూన్​ చేసి మనకు నచ్చిన ఛానల్ చూసేలా చేస్తుంది. అచ్చం D2M సాంకేతికత కూడా ఇలాగే పని చేస్తుంది. ఇంటర్నెట్ అవసరం లేకుండా మనకు నచ్చిన టీవీ ఛానల్, ఓటీటీ​ కంటెంట్​ను కూడా చూడొచ్చు.

అయితే ప్రస్తుతం ఉన్న మొబైళ్లు ఈ సాంకేతికతకు సపోర్ట్ చేయవు. దీని కోసం మొబైళ్లలో యాంటెనా, తక్కువ శబ్దం చేసే యాంప్లిఫైయర్​లు, బేస్​బ్యాండ్​ ఫిల్టర్​లు, రిసీవర్​, ప్రత్యేక బేస్​బ్యాండ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉండాలి.

గూగుల్​ మ్యాప్స్​లోనూ లైవ్​ లొకేషన్​ షేరింగ్​- ఎలాగో తెలుసా?

అమెరికా ల్యాండర్ ప్రయోగం విఫలం- చంద్రుడిపైకి మనుషుల్ని పంపే మిషన్ వాయిదా

Last Updated : Jan 16, 2024, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.