ETV Bharat / bharat

'వినాశకాలే విపరీత బుద్ధి.. దీదీ పరిస్థితి ఇదే'

author img

By

Published : Apr 12, 2021, 4:39 PM IST

Updated : Apr 12, 2021, 5:02 PM IST

మమతా బెనర్జీ పరిస్థితి వినాశకాలే విపరీత బుద్ధి అన్న సామెతలా మారిందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. తనతో పాటు బడుగు బలహీనవర్గాలపై దీదీ బహిరంగ యుద్ధం ప్రకటించారని అన్నారు. ఎన్నికల్లో భాజపా విజయం ఖాయమైందని.. ఈ విషయంపై మమత కోపంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

modi campaign in bengal
మోదీ బంగాల్ ప్రచారం

బంగాల్​ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమె పార్టీ పరిస్థితి 'వినాశకాలే విపరీత బుద్ధి'లా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. అందువల్లే తనతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై బహిరంగ యుద్ధం ప్రకటించారని చెప్పారు. బారాసత్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. దీదీకి ప్రతి విషయంలో కోపం వస్తోందని ఎద్దేవా చేశారు.

"మీ(సభికులను ఉద్దేశించి) ఫోన్లలో ఫ్లాష్​లైట్లు ఆన్ చేసి ఈ ప్రాంతంలో వెలుగులు నింపడాన్ని చూస్తే మే రెండో తేదీ మీకు అప్పుడే వచ్చేసిందని తెలుస్తోంది. నాపై మీకున్న ప్రేమ.. దీదీని బాధపెడుతోంది. నాలుగు దశల ఎన్నికల తర్వాత భాజపా విజయం ఖాయమైన విషయంపై మమత కోపంగా ఉన్నారు."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

శాంతియుత ఎన్నికలను మమత ఎప్పుడూ కోరుకోలేదని అన్నారు మోదీ. భారీ సంఖ్యలో ప్రజలు భాజపాకు ఓటేస్తారని దీదీకి తెలుసని.. అందుకే అధిక ఓటింగ్ శాతాన్ని మమత వ్యతిరేకిస్తారని చెప్పారు. బంగాల్​లో హింసకు మమతా బెనర్జీనే బాధ్యురాలని ఆరోపించారు. 'హింసకు కారణం తన గూండాలేనని దీదీకి తెలుసు. కాబట్టి వాటి గురించి ఆమె మాట్లాడరు. ప్రతిదీ ఆమె కనుసన్నల్లోనే జరుగుతోంది' అని చెప్పారు మోదీ.

బంగాల్ ప్రజలు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు మోదీ. ఈ ప్రేమను వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: 'బంగాల్​​లో భాజపా సెంచరీ.. మమత క్లీన్ బౌల్డ్'

బంగాల్​ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమె పార్టీ పరిస్థితి 'వినాశకాలే విపరీత బుద్ధి'లా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. అందువల్లే తనతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై బహిరంగ యుద్ధం ప్రకటించారని చెప్పారు. బారాసత్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. దీదీకి ప్రతి విషయంలో కోపం వస్తోందని ఎద్దేవా చేశారు.

"మీ(సభికులను ఉద్దేశించి) ఫోన్లలో ఫ్లాష్​లైట్లు ఆన్ చేసి ఈ ప్రాంతంలో వెలుగులు నింపడాన్ని చూస్తే మే రెండో తేదీ మీకు అప్పుడే వచ్చేసిందని తెలుస్తోంది. నాపై మీకున్న ప్రేమ.. దీదీని బాధపెడుతోంది. నాలుగు దశల ఎన్నికల తర్వాత భాజపా విజయం ఖాయమైన విషయంపై మమత కోపంగా ఉన్నారు."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

శాంతియుత ఎన్నికలను మమత ఎప్పుడూ కోరుకోలేదని అన్నారు మోదీ. భారీ సంఖ్యలో ప్రజలు భాజపాకు ఓటేస్తారని దీదీకి తెలుసని.. అందుకే అధిక ఓటింగ్ శాతాన్ని మమత వ్యతిరేకిస్తారని చెప్పారు. బంగాల్​లో హింసకు మమతా బెనర్జీనే బాధ్యురాలని ఆరోపించారు. 'హింసకు కారణం తన గూండాలేనని దీదీకి తెలుసు. కాబట్టి వాటి గురించి ఆమె మాట్లాడరు. ప్రతిదీ ఆమె కనుసన్నల్లోనే జరుగుతోంది' అని చెప్పారు మోదీ.

బంగాల్ ప్రజలు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు మోదీ. ఈ ప్రేమను వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: 'బంగాల్​​లో భాజపా సెంచరీ.. మమత క్లీన్ బౌల్డ్'

Last Updated : Apr 12, 2021, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.