ETV Bharat / bharat

అన్​లాక్​కు గ్రీన్​ సిగ్నల్​- మాల్స్​, మార్కెట్లు ఓపెన్​

author img

By

Published : Jun 13, 2021, 1:26 PM IST

Updated : Jun 13, 2021, 1:45 PM IST

సోమవారం నుంచి మార్కెట్లు, మాల్స్​ నిర్వహణకు దిల్లీ ప్రభుత్వం అనుమతించింది. 50శాతం సామర్థ్యంతో రెస్టారెంట్లు తెరుచుకోవచ్చని చెప్పింది. ఈ సడలింపులను వారంపాటు గమనించి తదుపరి చర్యలు చేపడతామని పేర్కొంది.

delhi unlock
దిల్లీలో అన్​లాక్​

కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. లాక్​డౌన్ ఎత్తివేత ప్రక్రియను ముమ్మరం చేసింది దిల్లీ​ ప్రభుత్వం. తాజాగా మరిన్ని సడలింపును ప్రకటించింది. సోమవారం నుంచి రెస్టారెంట్లను 50శాతం సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతించింది. ఈ మేరకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ఆదివారం వెల్లడించారు.

సడలింపులు ఇలా..

  • మార్కెట్లు, మాల్స్‌ నిర్వహణకు ఉ.10 నుంచి రా.8 వరకు అనుమతి.
  • జోన్‌లో ఒక మార్కెట్‌ తెరవచ్చు. అది కూడా వారాంతంలోనే.
  • దిల్లీ మెట్రో, బస్సులు 50శాతం సామర్థ్యంతో నడుస్తాయి.
  • ఆటోలు, ఈ-రిక్షాలు, ట్యాక్సీల్లో ఇద్దరికి మాత్రమే అనుమతి.
  • స్పాలు, జిమ్ములు, యోగా కేంద్రాలు, పార్కులు, గార్డెన్లు తెరుచుకోవు.
  • ప్రార్థనా మందిరాలు తెరిచినా భక్తులకు అనుమతి లేదు.
  • ఇంటి వద్ద 20మందితో వివాహా వేడుకలు జరుపుకోవచ్చు, హోటళ్లు, బ్యాంకెట్‌ హాళ్లలో వివాహాలకు అనుమతి లేదు.
  • అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి.

ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం గ్రూప్‌-ఏ సిబ్బందికి, ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందికి అనుమతి ఇచ్చినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఈ సడలింపులను వారంపాటు గమనించి తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. కరోనా కేసులు పెరిగితే ఆంక్షలు మరింత కఠినం చేస్తామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: Third wave: 'కరోనా మూడో దశ అనివార్యం'

ఇదీ చూడండి: Unlock: 'క్రమంగా లాక్​డౌన్​ ఎత్తివేత'

కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. లాక్​డౌన్ ఎత్తివేత ప్రక్రియను ముమ్మరం చేసింది దిల్లీ​ ప్రభుత్వం. తాజాగా మరిన్ని సడలింపును ప్రకటించింది. సోమవారం నుంచి రెస్టారెంట్లను 50శాతం సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతించింది. ఈ మేరకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ఆదివారం వెల్లడించారు.

సడలింపులు ఇలా..

  • మార్కెట్లు, మాల్స్‌ నిర్వహణకు ఉ.10 నుంచి రా.8 వరకు అనుమతి.
  • జోన్‌లో ఒక మార్కెట్‌ తెరవచ్చు. అది కూడా వారాంతంలోనే.
  • దిల్లీ మెట్రో, బస్సులు 50శాతం సామర్థ్యంతో నడుస్తాయి.
  • ఆటోలు, ఈ-రిక్షాలు, ట్యాక్సీల్లో ఇద్దరికి మాత్రమే అనుమతి.
  • స్పాలు, జిమ్ములు, యోగా కేంద్రాలు, పార్కులు, గార్డెన్లు తెరుచుకోవు.
  • ప్రార్థనా మందిరాలు తెరిచినా భక్తులకు అనుమతి లేదు.
  • ఇంటి వద్ద 20మందితో వివాహా వేడుకలు జరుపుకోవచ్చు, హోటళ్లు, బ్యాంకెట్‌ హాళ్లలో వివాహాలకు అనుమతి లేదు.
  • అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి.

ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం గ్రూప్‌-ఏ సిబ్బందికి, ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందికి అనుమతి ఇచ్చినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఈ సడలింపులను వారంపాటు గమనించి తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. కరోనా కేసులు పెరిగితే ఆంక్షలు మరింత కఠినం చేస్తామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: Third wave: 'కరోనా మూడో దశ అనివార్యం'

ఇదీ చూడండి: Unlock: 'క్రమంగా లాక్​డౌన్​ ఎత్తివేత'

Last Updated : Jun 13, 2021, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.