ETV Bharat / bharat

గణతంత్ర దినోత్సవానికి హస్తిన ముస్తాబు - republic day latest update

రిపబ్లిక్ డే ఉత్సవాలకు దేశరాజధాని సిద్ధమైంది. వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రాజ్​పథ్ వద్ద నిర్వహించే పరేడ్​లో భారత్ తన సైనిక శక్తిని ప్రదర్శించనుంది.

delhi
గణతంత్ర దినోత్సవానికి హస్తిన ముస్తాబు
author img

By

Published : Jan 26, 2021, 5:18 AM IST

గణతంత్ర దినోత్సవానికి దేశరాజధాని దిల్లీ పరిసరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఉత్సవాలు జరిగే రాజ్​పథ్​తో పాటు రాష్ట్రపతి భవన్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు త్రివర్ణకాంతులను వెదజల్లుతున్నాయి.

delhi-republic-day-2021
త్రివర్ణంలో వెలిగిపోతున్న పార్లమెంట్

రాజ్​పథ్​లో జరిగే పరేడ్​లో కీలక సైనిక సంపత్తిని భారత్ ప్రదర్శించనుంది. అత్యాధునిక టీ-90 యుద్ధ ట్యాంకులు, బ్రహ్మోస్‌ క్షిపణులను సైనిక బలగాలు ప్రదర్శించనున్నాయి. వీటితో పాటు బీఎంపీ-2, పినాక బహుళ ప్రయోగ రాకెట్‌ వ్యవస్థ, ఎలక్ట్రానిక్‌ యుద్ధ పరికరాలు గణతంత్ర వేడుకల్లో ఆకట్టుకోనున్నాయి. తొలిసారి రఫేల్ యుద్ధ విమానాలు పరేడ్​లో భాగస్వామ్యం కానున్నాయి.

delhi-republic-day-2021
వెలుగులు జిమ్ముతున్న రాష్ట్రపతి భవన్

బంగ్లాదేశ్‌కు చెందిన సాయుధ దళాల కవాతు, బ్యాండ్‌ బృందం తొలిసారి భారత గణతంత్ర వేడుకల్లో భాగం కానున్నాయి. ఇరుదేశాల మధ్య ఉన్న దృఢమైన బంధానికి ప్రతీకగా బంగ్లాదేశ్‌ బలగాలు ప్రదర్శన చేయనున్నాయి. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా ఈ సారి మోటార్‌ సైకిల్‌ ప్రదర్శన నిర్వహించం లేదు.

delhi-republic-day-2021
పార్లమెంట్ సమీపంలోని ఫౌంటెయిన్​

గణతంత్ర దినోత్సవానికి దేశరాజధాని దిల్లీ పరిసరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఉత్సవాలు జరిగే రాజ్​పథ్​తో పాటు రాష్ట్రపతి భవన్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు త్రివర్ణకాంతులను వెదజల్లుతున్నాయి.

delhi-republic-day-2021
త్రివర్ణంలో వెలిగిపోతున్న పార్లమెంట్

రాజ్​పథ్​లో జరిగే పరేడ్​లో కీలక సైనిక సంపత్తిని భారత్ ప్రదర్శించనుంది. అత్యాధునిక టీ-90 యుద్ధ ట్యాంకులు, బ్రహ్మోస్‌ క్షిపణులను సైనిక బలగాలు ప్రదర్శించనున్నాయి. వీటితో పాటు బీఎంపీ-2, పినాక బహుళ ప్రయోగ రాకెట్‌ వ్యవస్థ, ఎలక్ట్రానిక్‌ యుద్ధ పరికరాలు గణతంత్ర వేడుకల్లో ఆకట్టుకోనున్నాయి. తొలిసారి రఫేల్ యుద్ధ విమానాలు పరేడ్​లో భాగస్వామ్యం కానున్నాయి.

delhi-republic-day-2021
వెలుగులు జిమ్ముతున్న రాష్ట్రపతి భవన్

బంగ్లాదేశ్‌కు చెందిన సాయుధ దళాల కవాతు, బ్యాండ్‌ బృందం తొలిసారి భారత గణతంత్ర వేడుకల్లో భాగం కానున్నాయి. ఇరుదేశాల మధ్య ఉన్న దృఢమైన బంధానికి ప్రతీకగా బంగ్లాదేశ్‌ బలగాలు ప్రదర్శన చేయనున్నాయి. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా ఈ సారి మోటార్‌ సైకిల్‌ ప్రదర్శన నిర్వహించం లేదు.

delhi-republic-day-2021
పార్లమెంట్ సమీపంలోని ఫౌంటెయిన్​
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.