ETV Bharat / bharat

దిల్లీలో ఘోరం.. దివ్యాంగ మహిళపై పలుమార్లు అత్యాచారం

author img

By

Published : Dec 7, 2021, 8:48 AM IST

Delhi rape news: దివ్యాంగ మహిళపై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన దిల్లీలో వెలుగుచూసింది. నవంబర్ 21 నుంచి బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది.

Deaf mute woman raped in Delhi
Deaf mute woman raped in Delhi

Delhi rape news: దిల్లీలో దారుణ ఘటన జరిగింది. దివ్యాంగ మహిళపై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని మౌజ్​పుర్​కు చెందిన రెహాన్(34)గా గుర్తించారు.

నవంబర్ 21 నుంచి బాధితురాలిపై నిందితుడు అత్యాచారం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. రెహాన్​ను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించిందని వెల్లడించారు.

బాధిత మహిళ.. తన తల్లి, సోదరి సహాయంతో డిసెంబర్ 5న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే బాధితురాలు చెవిటి, మూగ కావడం వల్ల స్టేట్​మెంట్ రికార్డు చేయడం కష్టమైందని పోలీసులు తెలిపారు. దిల్లీ మహిళా కమిషన్ బాధితురాలికి న్యాయసహాయం అందించిందని, దివ్యాంగుల సంజ్ఞలను అర్థం చేసుకొనే ప్రైవేటు నిపుణుడిని పిలిపించి స్టేట్​మెంట్ నమోదు చేశామని వివరించారు.

Delhi crime news:

మరోవైపు, దేశరాజధానిలో మహిళలపై అకృత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే 20 శాతం అధికంగా నేరాలు నమోదయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి 1,725 మంది మహిళలపై అత్యాచార నేరాలు జరగ్గా... గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 1,429గా ఉంది.

Delhi crime increase:

మహిళలపై ఇతర నేరాలు 10 నెలల కాలంలో 45 శాతం మేర పెరిగాయి. 2020లో మహిళలపై నేరాల సంఖ్య (అక్టోబర్ నాటికి) 7,948గా ఉండగా.... ఈ ఏడాది అది 11,527కు పెరిగింది.

ఇదీ చదవండి: యువకుడి పొట్టలో 21 మేకులు- అవాక్కయిన వైద్యులు!

Delhi rape news: దిల్లీలో దారుణ ఘటన జరిగింది. దివ్యాంగ మహిళపై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని మౌజ్​పుర్​కు చెందిన రెహాన్(34)గా గుర్తించారు.

నవంబర్ 21 నుంచి బాధితురాలిపై నిందితుడు అత్యాచారం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. రెహాన్​ను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించిందని వెల్లడించారు.

బాధిత మహిళ.. తన తల్లి, సోదరి సహాయంతో డిసెంబర్ 5న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే బాధితురాలు చెవిటి, మూగ కావడం వల్ల స్టేట్​మెంట్ రికార్డు చేయడం కష్టమైందని పోలీసులు తెలిపారు. దిల్లీ మహిళా కమిషన్ బాధితురాలికి న్యాయసహాయం అందించిందని, దివ్యాంగుల సంజ్ఞలను అర్థం చేసుకొనే ప్రైవేటు నిపుణుడిని పిలిపించి స్టేట్​మెంట్ నమోదు చేశామని వివరించారు.

Delhi crime news:

మరోవైపు, దేశరాజధానిలో మహిళలపై అకృత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే 20 శాతం అధికంగా నేరాలు నమోదయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి 1,725 మంది మహిళలపై అత్యాచార నేరాలు జరగ్గా... గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 1,429గా ఉంది.

Delhi crime increase:

మహిళలపై ఇతర నేరాలు 10 నెలల కాలంలో 45 శాతం మేర పెరిగాయి. 2020లో మహిళలపై నేరాల సంఖ్య (అక్టోబర్ నాటికి) 7,948గా ఉండగా.... ఈ ఏడాది అది 11,527కు పెరిగింది.

ఇదీ చదవండి: యువకుడి పొట్టలో 21 మేకులు- అవాక్కయిన వైద్యులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.