ETV Bharat / bharat

'నిర్భయ దోషుల ఉరితో సాధించిందేమిటి?'

author img

By

Published : Mar 20, 2021, 3:58 PM IST

దేశంలో అత్యాచార ఘటనలు తగ్గకపోగా.. రోజురోజుకూ పెరిగిపోతున్నాయని నిర్భయ కేసులో దోషుల తరఫున వాదించిన న్యాయవాది ఏపీ సింగ్​ పేర్కొన్నారు. నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించి ఏడాది పూర్తయిన నేపథ్యంలో.. ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు. దేశంలో జైళ్లు ఉరితీసే గృహాలుగా కాకుండా.. సంస్కరణలు అమలు చేసేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో మరణశిక్షలను నిషేధించాలని డిమాండ్ చేశారు.

nirbhaya case accused advocate demands to finish hanging punishment
'నిర్భయ దోషుల ఉరితో.. సాధించిందేంటి?'

దేశంలో సంచలనం సృష్టించిన 2012నాటి నిర్భయ అత్యాచార కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించి సంవత్సరం గడిచింది. అయితే ఈ ఏడాది కాలంలో అత్యాచార ఘటనలు ఏమాత్రం తగ్గలేదని దోషుల తరఫున న్యాయవాదిగా వ్యవహరించిన ఏపీ సింగ్​ పేర్కొన్నారు. వారికి విధించిన ఉరిశిక్ష సమాజంపై ప్రభావం చూపలేదని తెలిపారు. ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు.

నిర్భయ నిందితుల ఉరితో.. సాధించిందేంటి?

''మహిళల పట్ల గౌరవంగా మెలగాలనే సందేశం ఇచ్చేందుకే నిర్భయ దోషులను ఉరి తీసినట్లు భావించాలి. కానీ ఈ సంవత్సరంలో అత్యాచార, హత్య ఘటనలు ఆగిపోయాయా? మహిళలపై నేరాలు జరగకుండా ఉన్న రోజంటూ ఉందా? వారిని ఉరి తీయడం కాదు.. జైళ్ల శాఖలో సంస్కరణలు రావాలి. 100కి పైగా దేశాల్లో మరణశిక్ష అమల్లో లేదు. భారత్​లోనూ రద్దు చేయాలి. ఈ ఉరిశిక్ష ద్వారా న్యాయ, పరిపాలన వ్యవస్థ సాధించిందేంటి? ఆ నలుగురు యువకులకు ఎటువంటి క్రిమినల్ రికార్డ్ లేదు.. వారి కుటుంబాల్లోనూ నేరస్థులు లేరు. కష్టాలు అనుభవిస్తూ కాలం వెళ్లదీసే ఆ యువకుల కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు.

పురుషుల బాధను ఎవరూ పట్టించుకోరు. పురుషుల కమిషన్​ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలారోజులుగా ఉంది. మహిళా పోలీస్‌స్టేషన్లు, కమీషన్లు, మంత్రిత్వ శాఖలు, కోర్టులు ఉన్నాయి.. కానీ పురుషులకు ఇలాంటివి ఏవీ లేవు.''

-ఏపీ సింగ్, నిర్భయ దోషుల న్యాయవాది.

దోషులు మంచివారుగా మారేందుకు(సంస్కరణ) అవకాశం ఇవ్వాలని ఏపీ సింగ్ అన్నారు. న్యాయకోవిదులు సైతం ఉరి శిక్షను అంగీకరించట్లేదని తెలిపారు. వీటివల్ల అభివృద్ధికి అవకాశం ఉండదని.. ప్రతీ ఏడాది నేరాలు పెరుగుతున్నాయని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు రుజువుచేస్తున్నాయని ఆయన వివరించారు.

ఇదీ చదవండి: నిర్భయ దోషుల 'ఉరి' అమలుకు నేటికి ఏడాది

దేశంలో సంచలనం సృష్టించిన 2012నాటి నిర్భయ అత్యాచార కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించి సంవత్సరం గడిచింది. అయితే ఈ ఏడాది కాలంలో అత్యాచార ఘటనలు ఏమాత్రం తగ్గలేదని దోషుల తరఫున న్యాయవాదిగా వ్యవహరించిన ఏపీ సింగ్​ పేర్కొన్నారు. వారికి విధించిన ఉరిశిక్ష సమాజంపై ప్రభావం చూపలేదని తెలిపారు. ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు.

నిర్భయ నిందితుల ఉరితో.. సాధించిందేంటి?

''మహిళల పట్ల గౌరవంగా మెలగాలనే సందేశం ఇచ్చేందుకే నిర్భయ దోషులను ఉరి తీసినట్లు భావించాలి. కానీ ఈ సంవత్సరంలో అత్యాచార, హత్య ఘటనలు ఆగిపోయాయా? మహిళలపై నేరాలు జరగకుండా ఉన్న రోజంటూ ఉందా? వారిని ఉరి తీయడం కాదు.. జైళ్ల శాఖలో సంస్కరణలు రావాలి. 100కి పైగా దేశాల్లో మరణశిక్ష అమల్లో లేదు. భారత్​లోనూ రద్దు చేయాలి. ఈ ఉరిశిక్ష ద్వారా న్యాయ, పరిపాలన వ్యవస్థ సాధించిందేంటి? ఆ నలుగురు యువకులకు ఎటువంటి క్రిమినల్ రికార్డ్ లేదు.. వారి కుటుంబాల్లోనూ నేరస్థులు లేరు. కష్టాలు అనుభవిస్తూ కాలం వెళ్లదీసే ఆ యువకుల కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు.

పురుషుల బాధను ఎవరూ పట్టించుకోరు. పురుషుల కమిషన్​ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలారోజులుగా ఉంది. మహిళా పోలీస్‌స్టేషన్లు, కమీషన్లు, మంత్రిత్వ శాఖలు, కోర్టులు ఉన్నాయి.. కానీ పురుషులకు ఇలాంటివి ఏవీ లేవు.''

-ఏపీ సింగ్, నిర్భయ దోషుల న్యాయవాది.

దోషులు మంచివారుగా మారేందుకు(సంస్కరణ) అవకాశం ఇవ్వాలని ఏపీ సింగ్ అన్నారు. న్యాయకోవిదులు సైతం ఉరి శిక్షను అంగీకరించట్లేదని తెలిపారు. వీటివల్ల అభివృద్ధికి అవకాశం ఉండదని.. ప్రతీ ఏడాది నేరాలు పెరుగుతున్నాయని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు రుజువుచేస్తున్నాయని ఆయన వివరించారు.

ఇదీ చదవండి: నిర్భయ దోషుల 'ఉరి' అమలుకు నేటికి ఏడాది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.