ETV Bharat / bharat

దిల్లీలో మరోవారం పాటు లాక్​డౌన్ పొడిగింపు

author img

By

Published : May 9, 2021, 12:44 PM IST

Updated : May 9, 2021, 1:01 PM IST

దిల్లీలో లాక్​డౌన్​ను మరో వారం పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. మే 17 వరకు ప్రస్తుత ఆంక్షలే కొనసాగుతాయని చెప్పారు. లాక్​డౌన్ విధించడం వల్ల సత్ఫలితాలు వచ్చాయని చెప్పారు.

DELHI CM
దిల్లీలో లాక్​డౌన్ పొడగింపు

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​ను మరో వారం పాటు పొడిగిస్తున్నట్టు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ప్రకటించారు. మే 17 వరకు దిల్లీలో లాక్​డౌన్​ ఉంటుందని స్పష్టం చేశారు. ఆ సమయంలో మెట్రో సేవలు నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు.

కరోనా కట్టికి చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయని తెలిపారు కేజ్రీవాల్​. 35శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు.. గత 2-3రోజుల్లో 23శాతానికి దిగి వచ్చిందని వెల్లడించారు.

లాక్​డౌన్​ సమయాన్ని.. దిల్లీలో ఆరోగ్య వసతులను మెరుగుపరిచేందుకు వినియోగించినట్టు స్పష్టం చేశారు కేజ్రీవాల్​. వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్​ పడకలను పెంచినట్టు వివరించారు. దిల్లీలో ఆక్సిజన్​ కొరత తగ్గిందని, పరిస్థితులు మెరుగుపడ్డాయి అన్నారు.

ఇదీ చదవండి: కొవిడ్​ వార్డులో నర్సు స్టెప్పులు.. వీడియో వైరల్​

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​ను మరో వారం పాటు పొడిగిస్తున్నట్టు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ప్రకటించారు. మే 17 వరకు దిల్లీలో లాక్​డౌన్​ ఉంటుందని స్పష్టం చేశారు. ఆ సమయంలో మెట్రో సేవలు నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు.

కరోనా కట్టికి చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయని తెలిపారు కేజ్రీవాల్​. 35శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు.. గత 2-3రోజుల్లో 23శాతానికి దిగి వచ్చిందని వెల్లడించారు.

లాక్​డౌన్​ సమయాన్ని.. దిల్లీలో ఆరోగ్య వసతులను మెరుగుపరిచేందుకు వినియోగించినట్టు స్పష్టం చేశారు కేజ్రీవాల్​. వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్​ పడకలను పెంచినట్టు వివరించారు. దిల్లీలో ఆక్సిజన్​ కొరత తగ్గిందని, పరిస్థితులు మెరుగుపడ్డాయి అన్నారు.

ఇదీ చదవండి: కొవిడ్​ వార్డులో నర్సు స్టెప్పులు.. వీడియో వైరల్​

Last Updated : May 9, 2021, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.