ETV Bharat / bharat

హోం ఐసొలేషన్​లో ఉన్న వారికీ ఆక్సిజన్​ పంపిణీ

author img

By

Published : May 6, 2021, 3:19 PM IST

హోం ఐసొలేషన్​లో ఉన్న కరోనా రోగులకు ఆన్​లైన్​ ద్వారా ఆక్సిజన్​ సిలిండర్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది దిల్లీ ప్రభుత్వం. ఇందుకోసం గురువారం ప్రకటన విడుదల చేసింది. సిలిండర్​ పొందేందుకు అధికారిక వెబ్​సైట్లో వివరాలు నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకుంటే ఈ-పాస్​లు అందజేస్తామని స్పష్టం చేసింది.

oxygen cylinders online delhi, ఆన్​లైన్​లో ఆక్సిజన్​ సిలిండర్లు దిల్లీ
ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ

దిల్లీలో ఆక్సిజన్​కు డిమాండ్​ ఏర్పడిన నేపథ్యంలో హోం ఐసొలేషన్​లో ఉన్న కరోనా రోగులకు ఆన్​లైన్​ ద్వారా ఆక్సిజన్​ను పంపిణీ చేస్తామని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. అంబులెన్సులు, నర్సింగ్​ హోమ్స్​, కొవిడ్​ ఇతర ఆస్పత్రులకు కూడా పంపిణీ చేస్తామని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇందుకోసం లబ్ధిదారులు దిల్లీ అధికారిక వెబ్​సైట్లో ఫొటో ఐడీ, ఆధార్​ కార్డు వివరాలు, కొవిడ్​ పాజిటివ్​ రిపోర్ట్​ సహా సంబంధిత వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.

ఆక్సిజన్​ సిలిండర్ల సరఫరా బాధ్యత జిల్లా మెజిస్ట్రేట్లు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. సరిపడా సిబ్బందితో దరఖాస్తులను త్వరగా పరిశీలించి సిలిండర్లను అందించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపింది. డీలర్ల వద్ద ఉన్న స్టాక్​ ప్రకారం జిల్లా మెజిస్ట్రేట్​.. తేదీ, సమయం, పంపిణీ కేంద్రం చిరునామా మొదలైన వివరాలతో దరఖాస్తుదారులకు ఈ-పాస్​లను మంజూరు చేస్తారని ప్రకటనలో పేర్కొంది.

దిల్లీలో ఆక్సిజన్​కు డిమాండ్​ ఏర్పడిన నేపథ్యంలో హోం ఐసొలేషన్​లో ఉన్న కరోనా రోగులకు ఆన్​లైన్​ ద్వారా ఆక్సిజన్​ను పంపిణీ చేస్తామని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. అంబులెన్సులు, నర్సింగ్​ హోమ్స్​, కొవిడ్​ ఇతర ఆస్పత్రులకు కూడా పంపిణీ చేస్తామని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇందుకోసం లబ్ధిదారులు దిల్లీ అధికారిక వెబ్​సైట్లో ఫొటో ఐడీ, ఆధార్​ కార్డు వివరాలు, కొవిడ్​ పాజిటివ్​ రిపోర్ట్​ సహా సంబంధిత వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.

ఆక్సిజన్​ సిలిండర్ల సరఫరా బాధ్యత జిల్లా మెజిస్ట్రేట్లు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. సరిపడా సిబ్బందితో దరఖాస్తులను త్వరగా పరిశీలించి సిలిండర్లను అందించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపింది. డీలర్ల వద్ద ఉన్న స్టాక్​ ప్రకారం జిల్లా మెజిస్ట్రేట్​.. తేదీ, సమయం, పంపిణీ కేంద్రం చిరునామా మొదలైన వివరాలతో దరఖాస్తుదారులకు ఈ-పాస్​లను మంజూరు చేస్తారని ప్రకటనలో పేర్కొంది.

ఇదీ చదవండి : 'యూపీఏ పగ్గాలు మమతకు ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.