ETV Bharat / bharat

కశ్మీర్​: 11 గంటల వరకు 37.17 శాతం పోలింగ్

author img

By

Published : Dec 4, 2020, 8:06 AM IST

Updated : Dec 4, 2020, 12:20 PM IST

DDC polls 3rd phase
కశ్మీర్​ ఎన్నికలు

12:18 December 04

polling
పోలింగ్​ శాతం

కశ్మీర్​లో ముడో దశ పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 37.17 శాతం పోలింగ్​ నమోదైంది.

07:54 December 04

కశ్మీర్​ ఎన్నికలు: మూడో దశ పోలింగ్​ ప్రారంభం

కశ్మీర్​కు గతేడాది స్వయంప్రతిపత్తి తొలగించి.. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత మొదటిసారిగా అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల మూడోదశ పోలింగ్​ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 8 దశల్లో పోలింగ్​ నిర్వహణ చేపట్టనున్నారు ఎన్నికల అధికారులు.

కట్టుదిట్టమైన భద్రత నడుమ.. ప్రతిష్ఠాత్మకంగా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే మూడో దశలో.. డీడీసీ, సర్పంచ్​ ఎన్నికల్లో మొత్తం 305 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 

ఉగ్ర ముప్పు..!

డీడీసీ ఎన్నికలను అడ్డుకునేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా దళాలు.. పటిష్ఠమైన రక్షణ వలయాలు ఏర్పాటు చేశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో గస్తీ నిర్వహిస్తున్నారు.

జమ్ముకశ్మీర్​లోని 20 జిల్లాల్లో మొత్తం 280 స్థానాలకు 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్​ 28 నుంచి డిసెంబర్​ 19 వరకు ఎన్నికలు పూర్తి కానున్నాయి. డిసెంబర్​ 22న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

12:18 December 04

polling
పోలింగ్​ శాతం

కశ్మీర్​లో ముడో దశ పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 37.17 శాతం పోలింగ్​ నమోదైంది.

07:54 December 04

కశ్మీర్​ ఎన్నికలు: మూడో దశ పోలింగ్​ ప్రారంభం

కశ్మీర్​కు గతేడాది స్వయంప్రతిపత్తి తొలగించి.. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత మొదటిసారిగా అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల మూడోదశ పోలింగ్​ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 8 దశల్లో పోలింగ్​ నిర్వహణ చేపట్టనున్నారు ఎన్నికల అధికారులు.

కట్టుదిట్టమైన భద్రత నడుమ.. ప్రతిష్ఠాత్మకంగా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే మూడో దశలో.. డీడీసీ, సర్పంచ్​ ఎన్నికల్లో మొత్తం 305 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 

ఉగ్ర ముప్పు..!

డీడీసీ ఎన్నికలను అడ్డుకునేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా దళాలు.. పటిష్ఠమైన రక్షణ వలయాలు ఏర్పాటు చేశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో గస్తీ నిర్వహిస్తున్నారు.

జమ్ముకశ్మీర్​లోని 20 జిల్లాల్లో మొత్తం 280 స్థానాలకు 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్​ 28 నుంచి డిసెంబర్​ 19 వరకు ఎన్నికలు పూర్తి కానున్నాయి. డిసెంబర్​ 22న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Last Updated : Dec 4, 2020, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.