ETV Bharat / bharat

తల్లిదండ్రులకు తలకొరివి పెట్టిన కుమార్తెలు - రాజస్థాన్​లో కొవిడ్​ మరణాలు

రాజస్థాన్​లో ఒకే రోజు జరిగిన రెండు వేర్వేరు ఘటనలు.. కన్నీరు పెట్టిస్తున్నాయి. గంట వ్యవధిలో తల్లిదండ్రులు మరణిస్తే వారికి కుమార్తెలు తలకొరివి పెట్టారు. మరో ఘటనలో భార్య అంతిమ సంస్కారాలకు హాజరు కాలేకపోయిన భర్తకు కుమార్తెలు వీడియోకాల్​ చేసి చూపించారు. ఈ ఘటనలు స్థానికుల హృదయాలను కలిచి వేశాయి.

Daughter, covid
కడసారి వీడ్కోలుకు కుమార్తెల సాయం
author img

By

Published : May 5, 2021, 9:31 PM IST

Updated : May 5, 2021, 11:06 PM IST

రాజస్థాన్​ అల్వార్​లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. కొవిడ్​తో గంటల వ్యవధిలో చనిపోయిన తల్లిదండ్రులకు ఇద్దరు కూతుళ్లు దహన సంస్కారాలు నిర్వహించారు. వారి సోదరుడు ఉద్యోగరీత్యా అమెరికాలో ఉండటం వల్ల అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడు. చుట్టుపక్కల ఉండే వారిని సాయం కోరినా ఎవరూ స్పందించలేదు. ఇక చేసేదేమీ లేక వారిద్దరే అమ్మానాన్నలకు కడసారి వీడ్కోలు పలికారు.

తల్లిదండ్రులకు తలకొరివి పెట్టిన కుమార్తెలు

మరో ఘటన...

రాజస్థాన్​ జోధ్​​పుర్​లో తల్లి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కుమార్తెలు ఎంతో కష్టపడ్డారు. కరోనాతో మరణించిన విషయం తెలిసి మృతదేహాన్ని శ్మశానానికి తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఎంతో మంది అంబులెన్స్​ డ్రైవర్లను వేడుకున్నా.. వారు జాలి చూపించలేదు. చివరకు బయట ఉండే టాక్సీ డ్రైవర్ సాయం చేసేందుకు ముందుకువచ్చాడు. స్థానిక శ్మశానవాటికకు తరలించాడు.

Daughter, covid
ట్రక్ ​నుంచి తల్లి మృతదేహాన్ని దించుతూ..
Daughter, covid
తల్లిని అంతిమ ఘట్టాని చేర్చిన కుమార్తెలు
Daughter, covid
కడసారి వీడ్కోలుకు కుమార్తెల సాయం

కడసారి చూపు వీడియో కాల్​లో..

ఉత్తర్​ప్రదేశ్​ అక్బాపూర్​కు చెందిన సంతోశ్.. విశ్రాంత ​ సుబేదార్​. అతని భార్య లత చాలా కాలంగా జోధ్​పుర్​ ఆస్పత్రిలో ఉండి చివరకు చనిపోయారు. ఈ సమయంలో ఆయన అక్కడ లేరు. దీంతో మృతదేహాన్ని కుమార్తెలకు అప్పగించారు. పెద్దకుమార్తె దీపిక తల్లికి దహన సంస్కారాలు చేసింది. కట్టుకున్న భార్య చివరి గడియలకు హాజరు కాలేకపోయిన సంతోశ్​కు..​ కుమార్తెలు వీడియో కాల్​ ద్వారా భార్య అంత్యక్రియలను చూపించారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచి వేసింది.

Daughter, covid
అంత్యక్రియలను వీడియోకాల్​లో చూపిస్తున్న కుమార్తె
Daughter, covid
అంత్యక్రియలను వీడియోకాల్​లో చూపిస్తున్న కుమార్తె
Daughter, covid
ట్రక్కులో తల్లి మృతదేహాంతో దీపిక

ఇదీ చూడండి: తల్లి చనిపోయినా.. తండ్రి కోసం తనయుడి ఆరాటం!

రాజస్థాన్​ అల్వార్​లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. కొవిడ్​తో గంటల వ్యవధిలో చనిపోయిన తల్లిదండ్రులకు ఇద్దరు కూతుళ్లు దహన సంస్కారాలు నిర్వహించారు. వారి సోదరుడు ఉద్యోగరీత్యా అమెరికాలో ఉండటం వల్ల అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడు. చుట్టుపక్కల ఉండే వారిని సాయం కోరినా ఎవరూ స్పందించలేదు. ఇక చేసేదేమీ లేక వారిద్దరే అమ్మానాన్నలకు కడసారి వీడ్కోలు పలికారు.

తల్లిదండ్రులకు తలకొరివి పెట్టిన కుమార్తెలు

మరో ఘటన...

రాజస్థాన్​ జోధ్​​పుర్​లో తల్లి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కుమార్తెలు ఎంతో కష్టపడ్డారు. కరోనాతో మరణించిన విషయం తెలిసి మృతదేహాన్ని శ్మశానానికి తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఎంతో మంది అంబులెన్స్​ డ్రైవర్లను వేడుకున్నా.. వారు జాలి చూపించలేదు. చివరకు బయట ఉండే టాక్సీ డ్రైవర్ సాయం చేసేందుకు ముందుకువచ్చాడు. స్థానిక శ్మశానవాటికకు తరలించాడు.

Daughter, covid
ట్రక్ ​నుంచి తల్లి మృతదేహాన్ని దించుతూ..
Daughter, covid
తల్లిని అంతిమ ఘట్టాని చేర్చిన కుమార్తెలు
Daughter, covid
కడసారి వీడ్కోలుకు కుమార్తెల సాయం

కడసారి చూపు వీడియో కాల్​లో..

ఉత్తర్​ప్రదేశ్​ అక్బాపూర్​కు చెందిన సంతోశ్.. విశ్రాంత ​ సుబేదార్​. అతని భార్య లత చాలా కాలంగా జోధ్​పుర్​ ఆస్పత్రిలో ఉండి చివరకు చనిపోయారు. ఈ సమయంలో ఆయన అక్కడ లేరు. దీంతో మృతదేహాన్ని కుమార్తెలకు అప్పగించారు. పెద్దకుమార్తె దీపిక తల్లికి దహన సంస్కారాలు చేసింది. కట్టుకున్న భార్య చివరి గడియలకు హాజరు కాలేకపోయిన సంతోశ్​కు..​ కుమార్తెలు వీడియో కాల్​ ద్వారా భార్య అంత్యక్రియలను చూపించారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచి వేసింది.

Daughter, covid
అంత్యక్రియలను వీడియోకాల్​లో చూపిస్తున్న కుమార్తె
Daughter, covid
అంత్యక్రియలను వీడియోకాల్​లో చూపిస్తున్న కుమార్తె
Daughter, covid
ట్రక్కులో తల్లి మృతదేహాంతో దీపిక

ఇదీ చూడండి: తల్లి చనిపోయినా.. తండ్రి కోసం తనయుడి ఆరాటం!

Last Updated : May 5, 2021, 11:06 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.