కరోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్న వేళ.. టీకా తీసుకోవాలని ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. అయితే వ్యాక్సన్పై నెలకొన్న భయం, ఆందోళనల కారణంగా ముందుకు రావడంలేదు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగులు. టీకా తీసుకోవాలని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఎంప్లాయిస్ యూనియన్(ఏఏఈయూ)కు చెందిన 18 వేల మంది ఉద్యోగులను ఎన్ని సార్లు కోరినా.. వారు అనుమానాలను వీడటం లేదని సంఘం ప్రధాన కార్యదర్శి బాల్రాజ్ సింగ్ తెలిపారు.
"దేశవ్యాప్తంగా ఏఏఈయూలో 18 వేల మంది ఉద్యోగులున్నారు. వారిలో 45 ఏళ్ల పైబడినవారు 12వేల మంది ఉన్నారు. టీకా తీసుకుంటే.. సైడ్ ఎఫెక్ట్స్, మరోసారి వైరస్ బారిన పడతామనే భయం, ఆందోళన వారిలో నెలకొంది. నా భార్యతో కలిసి ఇటీవల వ్యాక్సిన్ వేయించుకున్నా. మేము ఆరోగ్యంగానే ఉన్నాం. అందరూ సత్వరమే టీకాలు తీసుకోవాలి."
-బాల్రాజ్ సింగ్, ఏఏఈయూ ప్రధాన కార్యదర్శి
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పని ప్రదేశాల్లో 100 మందికి పైగా అర్హులతో టీకా కార్యక్రమం చేపట్టవచ్చని ఇటీవల కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కోసం కనీసం 100 మంది ఉద్యోగులు కూడా సిద్ధంగా లేకపోవడం వల్ల వ్యాక్సినేషన్ క్యాంపును ఏర్పాటు చేయలేకపోతున్నట్లు బాల్రాజ్ తెలిపారు. ప్రస్తుతం కోల్కతా, గువాహటిలో ఈ క్యాంపులు నడుస్తున్నా.. సిబ్బంది ఆసక్తి చూపడంలేదని చెప్పారు.
ఇదీ చూడండి: టీకా ఉత్సవ్: 3 రాష్ట్రాల్లో కోటి మందికి టీకాలు