ETV Bharat / bharat

ముగ్గురు ఎమ్మెల్యేలను బలితీసుకున్న కరోనా - లఖ్​నవూ(పశ్చిమ) శాసనసభ్యుడు సురేశ్​కుమార్ శ్రీవాస్తవ కరోనాతో మృతి

కరోనాతో ముగ్గురు ఎమ్మెల్యేలు మృతి చెందారు. వీరిలో ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు కాగా.. మరొకరు మధ్యప్రదేశ్​కి చెందిన కాంగ్రెస్​ శాసనసభ్యులు. వీరి మృతిపై సీఎం యోగి ఆదిత్యనాథ్​ సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

3 mlas died of corona
కరోనాతో ముగ్గురు ఎమ్మెల్యేల మృతి
author img

By

Published : Apr 24, 2021, 10:14 AM IST

ఉత్తర్​ప్రదేశ్ భాజపా ఎమ్మెల్యేలు ఇద్దరు శుక్రవారం.. కరోనాతో మృతి చెందారు. లఖ్​నవూ(పశ్చిమ) శాసనసభ్యుడు సురేశ్​కుమార్ శ్రీవాస్తవ(76), ఔరైయ సదర్​ ఎమ్మెల్యే రమేశ్​ చంద్ర(56) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వీరి మృతి పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్​లో స్పందించారు. ఎమ్మెల్యేల మరణ వార్తతో ఆయా నియోజకవర్గాల్లో విషాదం నెలకొంది.

yogi adityanath tweet on mla death
ఎమ్మెల్యే మృతిపై యోగీ ఆదిత్యనాథ్​ సంతాప సందేశం

మధ్యప్రదేశ్​లో..

మధ్యప్రదేశ్​ కాంగ్రెస్​ నేత, జోబాట్​ నియోజకవర్గ శాసనసభ్యురాలు కళావతి భూరియా కరోనాతో మరణించారు. ఆమె కొద్దిరోజులుగా ఇందోర్​లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

యువ పోలీసు అధికారి..

దిల్లీ పోలీసులను కరోనా వణికిస్తోంది. ఇప్పటికే అనేక మంది సిబ్బంది మహమ్మారి బారిన పడగా.. అంకిత్ చౌదరి అనే 29 ఏళ్ల ఎస్సై శుక్రవారం కొవిడ్​ ధాటికి మరణించారు. ఆయన భరత్​ నగర్​ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఈ నెల 15న కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

ఇదీ చదవండి: కరోనాతో జేడీయూ ఎమ్మెల్యే మృతి

ఉత్తర్​ప్రదేశ్ భాజపా ఎమ్మెల్యేలు ఇద్దరు శుక్రవారం.. కరోనాతో మృతి చెందారు. లఖ్​నవూ(పశ్చిమ) శాసనసభ్యుడు సురేశ్​కుమార్ శ్రీవాస్తవ(76), ఔరైయ సదర్​ ఎమ్మెల్యే రమేశ్​ చంద్ర(56) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వీరి మృతి పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్​లో స్పందించారు. ఎమ్మెల్యేల మరణ వార్తతో ఆయా నియోజకవర్గాల్లో విషాదం నెలకొంది.

yogi adityanath tweet on mla death
ఎమ్మెల్యే మృతిపై యోగీ ఆదిత్యనాథ్​ సంతాప సందేశం

మధ్యప్రదేశ్​లో..

మధ్యప్రదేశ్​ కాంగ్రెస్​ నేత, జోబాట్​ నియోజకవర్గ శాసనసభ్యురాలు కళావతి భూరియా కరోనాతో మరణించారు. ఆమె కొద్దిరోజులుగా ఇందోర్​లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

యువ పోలీసు అధికారి..

దిల్లీ పోలీసులను కరోనా వణికిస్తోంది. ఇప్పటికే అనేక మంది సిబ్బంది మహమ్మారి బారిన పడగా.. అంకిత్ చౌదరి అనే 29 ఏళ్ల ఎస్సై శుక్రవారం కొవిడ్​ ధాటికి మరణించారు. ఆయన భరత్​ నగర్​ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఈ నెల 15న కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

ఇదీ చదవండి: కరోనాతో జేడీయూ ఎమ్మెల్యే మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.