ETV Bharat / bharat

రాజస్థాన్ స్థానిక పోరులో కమలం జోరు - రాజస్థాన్ స్థానిక ఎన్నికలు

రాజస్థాన్​లో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ చతికిలపడింది. 4,371 సీట్లలో 1852 స్థానాలకు పరిమితమైంది. కాగా.. భాజపా ఏకంగా 1,989 చోట్ల గెలుపొందింది. జిల్లా పరిషత్ ఫలితాల్లోనూ భాజపా జోరు చూపించింది. ఈ ఫలితాలు రైతులు మోదీ నాయకత్వంపై పెట్టుకున్న నమ్మకానికి చిహ్నమని భాజపా వ్యాఖ్యానించింది.

Cong suffers blow in Rajasthan panchayat polls, BJP says mandate for farm reforms
రాజస్థాన్ స్థానిక పోరులో కమలం జోరు
author img

By

Published : Dec 9, 2020, 5:42 PM IST

Updated : Dec 9, 2020, 5:49 PM IST

రాజస్థాన్​లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికల్లో పరాభవాన్ని మూటగట్టుకుంది. మొత్తం 4,371 పంచాయతీ సమితి సీట్లలో 1852 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. భాజపా ఏకంగా 1,989 సీట్లు కైవసం చేసుకుంది.

సీపీఎం 26, రాష్ట్రీయ లోక్​తాంత్రిక్ పార్టీ(ఆర్​ఎల్పీ) ఆరు, బహుజన్ సమాజ్ పార్టీ ఐదు స్థానాలు గెలుచుకోగా.. స్వతంత్రులు 439 స్థానాల్లో విజయం సాధించారు.

జిల్లా పరిషత్ స్థాయిలోనూ హస్తం పార్టీ చతికిలపడింది. 635 స్థానాలకు కాంగ్రెస్ 252 చోట్ల గెలుపొందగా.. భాజపా అభ్యర్థులు 353 స్థానాల్లో విజయం సాధించారు. 13 జిల్లా బోర్డుల్లో భాజపా మెజారిటీ సాధించింది ఉంది. ఆర్​ఎల్పీ మద్దతుతో మరో జిల్లా స్థానాన్ని గెలుచుకొనే అవకాశం ఉంది. కాంగ్రెస్​ను ఐదు జిల్లాల్లోనే విజయం వరించింది.

'రైతుల మద్దతుకు నిదర్శనం'

రాజస్థాన్​లో సాధించిన విజయం రైతుల నమ్మకానికి, కార్మికులు, పేదలు మోదీ నాయకత్వంపై ఉంచిన విశ్వాసానికి చిహ్నమని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఓట్లేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.

కోట్లాది మంది గ్రామీణ ప్రజలు వ్యవసాయ సంస్కరణలకు మద్దతు తెలుపుతున్నారని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ స్పష్టం చేశారు.

కేంద్రానికి వ్యతిరేకంగా రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. భాజపాకు ఈ ఫలితాలు జోష్ నింపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాజస్థాన్​లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికల్లో పరాభవాన్ని మూటగట్టుకుంది. మొత్తం 4,371 పంచాయతీ సమితి సీట్లలో 1852 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. భాజపా ఏకంగా 1,989 సీట్లు కైవసం చేసుకుంది.

సీపీఎం 26, రాష్ట్రీయ లోక్​తాంత్రిక్ పార్టీ(ఆర్​ఎల్పీ) ఆరు, బహుజన్ సమాజ్ పార్టీ ఐదు స్థానాలు గెలుచుకోగా.. స్వతంత్రులు 439 స్థానాల్లో విజయం సాధించారు.

జిల్లా పరిషత్ స్థాయిలోనూ హస్తం పార్టీ చతికిలపడింది. 635 స్థానాలకు కాంగ్రెస్ 252 చోట్ల గెలుపొందగా.. భాజపా అభ్యర్థులు 353 స్థానాల్లో విజయం సాధించారు. 13 జిల్లా బోర్డుల్లో భాజపా మెజారిటీ సాధించింది ఉంది. ఆర్​ఎల్పీ మద్దతుతో మరో జిల్లా స్థానాన్ని గెలుచుకొనే అవకాశం ఉంది. కాంగ్రెస్​ను ఐదు జిల్లాల్లోనే విజయం వరించింది.

'రైతుల మద్దతుకు నిదర్శనం'

రాజస్థాన్​లో సాధించిన విజయం రైతుల నమ్మకానికి, కార్మికులు, పేదలు మోదీ నాయకత్వంపై ఉంచిన విశ్వాసానికి చిహ్నమని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఓట్లేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.

కోట్లాది మంది గ్రామీణ ప్రజలు వ్యవసాయ సంస్కరణలకు మద్దతు తెలుపుతున్నారని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ స్పష్టం చేశారు.

కేంద్రానికి వ్యతిరేకంగా రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. భాజపాకు ఈ ఫలితాలు జోష్ నింపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Last Updated : Dec 9, 2020, 5:49 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.