ETV Bharat / bharat

అలా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి!

పంచాయతీ ఎన్నికల్లో కొవిడ్​ బారిన పడి మృతి చెందిన పోలింగ్​ అధికారుల కుటుంబాలకు అందించే పరిహారంపై పునరాలోచన చేయాలని యూపీ​ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది అలహాబాద్​ హైకోర్టు. బాధితుల కుటుంబాలకు ఇచ్చే పరిహారం కనీసం రూ. కోటి ఉండాలని స్పష్టం చేసింది.

author img

By

Published : May 12, 2021, 1:51 PM IST

high court
అలహాబాద్​ హైకోర్టు

ఉత్తర్​ప్రదేశ్​ పంచాయతీ ఎన్నికల్లో కొవిడ్​ బారినపడి ప్రాణాలు కోల్పోయిన పోలింగ్​ అధికారుల కుటుంబాలకు పరిహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది అలహాబాద్​ హైకోర్టు. బాధితుల కుటుంబాలకు చెల్లించే పరిహారంపై పునరాలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. వారికి ఇచ్చే పరిహారం కనీసం రూ.కోటి ఉండాలని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, క్వారంటైన్​ నిబంధనలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది జస్టిస్​ సిద్ధార్థ వర్మ, జస్టిస్​ అజిత్​ కుమార్​తో కూడిన ధర్మాసనం. తమ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఎన్నికల సంఘం పరిశీలిస్తుందనే నమ్మకం ఉందని పేర్కొంది. అలాగే తదుపరి విచారణ రోజున పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశించింది.

మేరఠ్​ ఘటనపై..

మేరఠ్​​లోని ఆసుపత్రిలో 20 మంది రోగులు మరణించటంపైనా విచారణ చేపట్టింది కోర్టు. అందరినీ కొవిడ్​ మృతులుగానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఆసుపత్రుల్లో కొవిడ్​ మృతుల సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో ఈ మరణాలను కొవిడ్​యేతర మృతులుగా పేర్కొనేందుకు అనుమతి లేదని పేర్కొంది. 20 మరణాలతో పాటు కొవిడ్​ పరీక్షలు, ఆక్సిజన్​ వంటి వాటిపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని వైద్య కళాశాల ప్రిన్సిపల్​ను ఆదేశించింది. ఈ సందర్భంగా.. 20 మందిలో ముగ్గురు మాత్రమే కరోనా బారిన పడ్డారని కోర్టుకు తెలిపారు ప్రిన్సిపల్​. మిగిలిన వారు అనుమానిత కేసులు మాత్రమేనని చెప్పారు.

ఇదీ చూడండి: కొవిడ్​ కేంద్రం నుంచి 25 మంది రోగులు పరార్​!

ఉత్తర్​ప్రదేశ్​ పంచాయతీ ఎన్నికల్లో కొవిడ్​ బారినపడి ప్రాణాలు కోల్పోయిన పోలింగ్​ అధికారుల కుటుంబాలకు పరిహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది అలహాబాద్​ హైకోర్టు. బాధితుల కుటుంబాలకు చెల్లించే పరిహారంపై పునరాలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. వారికి ఇచ్చే పరిహారం కనీసం రూ.కోటి ఉండాలని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, క్వారంటైన్​ నిబంధనలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది జస్టిస్​ సిద్ధార్థ వర్మ, జస్టిస్​ అజిత్​ కుమార్​తో కూడిన ధర్మాసనం. తమ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఎన్నికల సంఘం పరిశీలిస్తుందనే నమ్మకం ఉందని పేర్కొంది. అలాగే తదుపరి విచారణ రోజున పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశించింది.

మేరఠ్​ ఘటనపై..

మేరఠ్​​లోని ఆసుపత్రిలో 20 మంది రోగులు మరణించటంపైనా విచారణ చేపట్టింది కోర్టు. అందరినీ కొవిడ్​ మృతులుగానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఆసుపత్రుల్లో కొవిడ్​ మృతుల సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో ఈ మరణాలను కొవిడ్​యేతర మృతులుగా పేర్కొనేందుకు అనుమతి లేదని పేర్కొంది. 20 మరణాలతో పాటు కొవిడ్​ పరీక్షలు, ఆక్సిజన్​ వంటి వాటిపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని వైద్య కళాశాల ప్రిన్సిపల్​ను ఆదేశించింది. ఈ సందర్భంగా.. 20 మందిలో ముగ్గురు మాత్రమే కరోనా బారిన పడ్డారని కోర్టుకు తెలిపారు ప్రిన్సిపల్​. మిగిలిన వారు అనుమానిత కేసులు మాత్రమేనని చెప్పారు.

ఇదీ చూడండి: కొవిడ్​ కేంద్రం నుంచి 25 మంది రోగులు పరార్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.