ETV Bharat / bharat

'అందరూ కోర్టులను విమర్శిస్తున్నారు' - అందరూ కోర్టులను విమర్శిస్తున్నారు!

కోర్టులను విమర్శించే వారి సంఖ్య పెరుగుతోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. న్యాయ వ్యవస్థను విమర్శిస్తూ.. ఓ కార్టూనిస్ట్​ చేసిన ట్వీట్​పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది సుప్రీం ధర్మాసనం.

Comedian Kamra defends tweets in SC, decries growing intolerance in country
అందరూ కోర్టులను విమర్శిస్తున్నారు!
author img

By

Published : Jan 30, 2021, 7:47 AM IST

న్యాయ స్థానాలను విమర్శించడం పెరుగుతోందని, ఇప్పుడు అందరూ అదే పని చేస్తున్నారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. న్యాయ వ్యవస్థను విమర్శిస్తూ ట్వీట్​ చేసినందుకు కార్టూనిస్టు రచిత్​ తనేజాపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది. ఈ కేసుపై న్యాయమూర్తులు జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ ఆర్​.సుభాశ్​ రెడ్డి, జస్టిస్​ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. న్యాయస్థానాన్ని విమర్శించడం కోర్టు ధిక్కరణ కిందకు రాదని ఆమె తరఫు న్యాయవాది ముకుల్​ రోహత్గీ వాదించారు. ఒక జర్నలిస్టు కేసును సెలవుల్లో విచారణకు స్వీకరించడంపై ప్రజల్లో విమర్శలు వచ్చాయని చెప్పారు. ఆరోపణలపై సమాధానం ఇచ్చేందుకు నిందితురాలికి మూడు వారాల గడువునిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

మరో రెండు కేసుల్లోనూ..

  • ఇలాంటి ట్వీట్​నే చేసినందుకు హాస్యనటుడు కునాల్​ కమ్రాపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసు విచారణను కూడా రెండు వారాలకు వాయిదా వేస్తూ ఇదే ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
  • నగదు అక్రమ చలామణి నిరోధక అపిలేట్​ ట్రైబ్యునల్​లో ఛైర్​పర్సన్​ సహా.. ఇతర ఖాళీలను భర్తీచేసే విషయమై సమాధానం ఇవ్వాలంటూ కేంద్రానికి నోటీసులు ఇచ్చింది ఇదే ధర్మాసనం.

వారికి మరో అవకాశం ఎందుకివ్వరు?

కొవిడ్​-19 కారణంగా 2020లో సివిల్స్​ పరీక్షలకు హాజరుకాని వారికి మరో అవకాశం ఎందుకు ఇవ్వకూడదంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీం న్యాయస్థానం. "ఒకసారే అవకాశం ఇవ్వమంటున్నాం. గతంలో ఇచ్చినప్పుడు ఈసారి ఎందుకివ్వకూడదు?" అని జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్​ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. వయసు అర్హతలను పెంచమని అడగడం లేదని, కరోనా సమయంలో ఆఖరి అవకాశాన్ని కోల్పోయిన వారి వినతిని మాత్రమే పరిశీలించమంటున్నామని సుప్రీం కోర్టు తెలిపింది.

ఇదీ చదవండి: దిల్లీలో మరోసారి రైతుల నిరాహార దీక్ష

న్యాయ స్థానాలను విమర్శించడం పెరుగుతోందని, ఇప్పుడు అందరూ అదే పని చేస్తున్నారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. న్యాయ వ్యవస్థను విమర్శిస్తూ ట్వీట్​ చేసినందుకు కార్టూనిస్టు రచిత్​ తనేజాపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది. ఈ కేసుపై న్యాయమూర్తులు జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ ఆర్​.సుభాశ్​ రెడ్డి, జస్టిస్​ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. న్యాయస్థానాన్ని విమర్శించడం కోర్టు ధిక్కరణ కిందకు రాదని ఆమె తరఫు న్యాయవాది ముకుల్​ రోహత్గీ వాదించారు. ఒక జర్నలిస్టు కేసును సెలవుల్లో విచారణకు స్వీకరించడంపై ప్రజల్లో విమర్శలు వచ్చాయని చెప్పారు. ఆరోపణలపై సమాధానం ఇచ్చేందుకు నిందితురాలికి మూడు వారాల గడువునిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

మరో రెండు కేసుల్లోనూ..

  • ఇలాంటి ట్వీట్​నే చేసినందుకు హాస్యనటుడు కునాల్​ కమ్రాపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసు విచారణను కూడా రెండు వారాలకు వాయిదా వేస్తూ ఇదే ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
  • నగదు అక్రమ చలామణి నిరోధక అపిలేట్​ ట్రైబ్యునల్​లో ఛైర్​పర్సన్​ సహా.. ఇతర ఖాళీలను భర్తీచేసే విషయమై సమాధానం ఇవ్వాలంటూ కేంద్రానికి నోటీసులు ఇచ్చింది ఇదే ధర్మాసనం.

వారికి మరో అవకాశం ఎందుకివ్వరు?

కొవిడ్​-19 కారణంగా 2020లో సివిల్స్​ పరీక్షలకు హాజరుకాని వారికి మరో అవకాశం ఎందుకు ఇవ్వకూడదంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీం న్యాయస్థానం. "ఒకసారే అవకాశం ఇవ్వమంటున్నాం. గతంలో ఇచ్చినప్పుడు ఈసారి ఎందుకివ్వకూడదు?" అని జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్​ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. వయసు అర్హతలను పెంచమని అడగడం లేదని, కరోనా సమయంలో ఆఖరి అవకాశాన్ని కోల్పోయిన వారి వినతిని మాత్రమే పరిశీలించమంటున్నామని సుప్రీం కోర్టు తెలిపింది.

ఇదీ చదవండి: దిల్లీలో మరోసారి రైతుల నిరాహార దీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.