ETV Bharat / bharat

మావోయిస్టుల దుశ్చర్య- ఎస్సైని అపహరించి హత్య

author img

By

Published : Apr 24, 2021, 9:32 AM IST

Updated : Apr 24, 2021, 10:23 AM IST

ఛత్తీస్‌గఢ్​లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మూడ్రోజుల క్రితం అపహరించిన ఓ పోలీసు అధికారిని దారుణంగా చంపారు. మృతదేహం వద్ద బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో లేఖను వదిలి వెళ్లారు.

Chhattisgarh Naxals kill policeman after abducting him
అపహరించిన పోలీసును హతమార్చిన మావోలు

ఛత్తీస్‌గఢ్ బీజాపుర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మూడ్రోజుల క్రితం మురళి అనే ఎస్సైని అపహరించిన మావోయిస్టులు అతన్ని దారుణంగా చంపేశారు. గంగలూర్‌ పీఎస్​లో విధులు నిర్వహిస్తున్నారు మురళి.

kidnapped soldier murali tati brutally murdered by naxalites in bijapur
మరణించిన ఎస్సై
letter by maoists
మావోలు వదిలి వెళ్లిన లేఖ


ఎస్‌ఐ మృతదేహాన్ని పుల్సుమ్‌పారా వద్ద పడేసిన మావోయిస్టులు.. మృతదేహం వద్ద బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో లేఖ వదిలి వెళ్లారు.

పట్టాల పేల్చివేత..

ఛత్తీస్‌గఢ్​లోని మరో ప్రాంతంలో.. మావోలు రైలు పట్టాలను పేల్చేశారు. దీంతో భన్సీ-బచేలి ప్యాసింజర్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డట్లు పోలీసులు తెలిపారు.

"భన్సీ-భచేలి మధ్య ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనకు మావోయిస్టులే కారణం. ప్రయాణికులందరినీ జవాన్లు రక్షించారు. వారంతా సురక్షితంగా ఉన్నారు."

-అభిషేక్ పల్లవ్, దంతెవాడ ఎస్పీ

ఇవీ చదవండి: నక్సల్స్​ దుశ్చర్య- 12 వాహనాలకు నిప్పు

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్- ఓ మావోయిస్టు హతం

ఛత్తీస్‌గఢ్ బీజాపుర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మూడ్రోజుల క్రితం మురళి అనే ఎస్సైని అపహరించిన మావోయిస్టులు అతన్ని దారుణంగా చంపేశారు. గంగలూర్‌ పీఎస్​లో విధులు నిర్వహిస్తున్నారు మురళి.

kidnapped soldier murali tati brutally murdered by naxalites in bijapur
మరణించిన ఎస్సై
letter by maoists
మావోలు వదిలి వెళ్లిన లేఖ


ఎస్‌ఐ మృతదేహాన్ని పుల్సుమ్‌పారా వద్ద పడేసిన మావోయిస్టులు.. మృతదేహం వద్ద బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో లేఖ వదిలి వెళ్లారు.

పట్టాల పేల్చివేత..

ఛత్తీస్‌గఢ్​లోని మరో ప్రాంతంలో.. మావోలు రైలు పట్టాలను పేల్చేశారు. దీంతో భన్సీ-బచేలి ప్యాసింజర్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డట్లు పోలీసులు తెలిపారు.

"భన్సీ-భచేలి మధ్య ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనకు మావోయిస్టులే కారణం. ప్రయాణికులందరినీ జవాన్లు రక్షించారు. వారంతా సురక్షితంగా ఉన్నారు."

-అభిషేక్ పల్లవ్, దంతెవాడ ఎస్పీ

ఇవీ చదవండి: నక్సల్స్​ దుశ్చర్య- 12 వాహనాలకు నిప్పు

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్- ఓ మావోయిస్టు హతం

Last Updated : Apr 24, 2021, 10:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.