ETV Bharat / bharat

17 ఏళ్లుగా మురికివాడ పిల్లలకు 'ఉచిత కబడ్డీ' శిక్షణ

author img

By

Published : Feb 27, 2021, 3:15 PM IST

మురికివాడ నుంచి వచ్చిన వారెందరో జాతీయస్థాయి టోర్నీల్లో మెరుస్తున్నారు. తినడానికి తిండిలేని స్థాయి నుంచి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిలో కొందరు కబడ్డీ క్రీడాకారులుగా రాణిస్తుంటే, మరికొందరు పోలీస్​ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల్లో స్థిరపడ్డారు. దీనంతటికీ కారణం ఇద్దరు అథ్లెట్లు. వారే ఛత్తీస్​గఢ్​కు చెందిన ప్రకాశ్​రావు దంపతులు. నిరుపేద కుటుంబం నుంచి జాతీయస్థాయి క్రీడాకారులను అందించిన ఈ  అథ్లెట్​ దంపతులపై ప్రత్యేక కథనం.

Chhattisgarh couple trains slum children for national-level kabaddi
మురికివాడ పిల్లలకు కబడ్డీలో శిక్షణినిస్తోన్న దంపతులు

ఛత్తీస్​గఢ్​లో నిరుపేద పిల్లలకు కబడ్డీలో శిక్షణనిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది ఓ జంట. ఆటపై మక్కువతో ఇలా మురికివాడల్లోని బాలబాలికలకు ఉచిత తర్ఫీదునిస్తూ.. జాతీయ స్థాయి ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ​ శిక్షకుల వద్ద ఆట నేర్చుకున్న క్రీడాకారులెందరో రాష్ట్ర, జాతీయస్థాయి వేదికలపై తళుక్కుమంటున్నారు.

మురికివాడ పిల్లలకు కబడ్డీలో శిక్షణినిస్తోన్న దంపతులు

భిలాయ్​కు చెందిన జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్​ ఏ.ప్రకాశ్​ రావు, బాస్కెట్​బాల్​ క్రీడాకారిణి ఏ.ఛాయ ప్రకాశ్​ రావు దంపతులు.. స్లమ్​ ప్రాంతాల్లోని పిల్లలను ఉత్తమ కబడ్డీ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కనీసం తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను ఎన్నుకుని వారిలోని ప్రతిభను వెలికితీస్తున్నారీ శిక్షకులు. వారి ప్రతిభకు మరిన్ని మెళకువలు నేర్పి.. అత్యుత్తమ ఆటతీరును బయటకు తీస్తున్నారు.

ఇదీ చదవండి: ఔరా! ఈ దివ్యాంగుల చేతులు అద్భుతాల్ని చేశాయి

17 ఏళ్లుగా ..

ఇలా మురికివాడల్లోని మాణిక్యాలను వెలికితీయడమే లక్ష్యంగా.. 2004 నుంచే శిక్షణ శిబరం ఆరంభించారీ దంపతులు. 2004 నుంచి 2009 వరకు భిలాయ్​లోని సెక్టార్-1లో ఆరేళ్లపాటు ఎంతో మందికి శిక్షణనిచ్చారు. 2009-2019 మధ్య కాలంలో ఖుర్సీపార్​ జోన్​-2 పాఠశాలలో మరికొందరిని తీర్చిదిద్దారు. 2019 నుంచి ఖుర్సిపార్​లోని బాల్​ మందిర్​ మైదానంలో తర్ఫీదు ఇస్తున్నారు. ఇలా 17 ఏళ్లలో 300 మందికిపైగా ఆటగాళ్లు శిక్షణపొంది.. జాతీయస్థాయి పోటీల్లో అనేక పతకాలు సాధించారు.

Chhattisgarh couple trains slum children for national-level kabaddi
కోచ్​ ప్రకాశ్​ రావు దంపతులు

కోచ్​లుగా ప్రకాశ్​ రావు దంపతుల ఘనతలు..

  1. 2018లో ఆరుగురు ఆటగాళ్లు ఖేలో ఇండియాకు ఎంపిక​.
  2. 2019లో మరో 8 మంది ఖేలో ఇండియాకు ఎంపిక.
  3. ముగ్గురు ప్లేయర్లకు 'షాహీద్​ పంకజ్​ విక్రమ్'​ అవార్డులు.
  4. ఐదుగురు క్రీడాకారులు జాతీయస్థాయికి ఎంపిక.
  5. మరో 25 మంది.. పోలీస్​ శాఖ, ఇతర విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందిస్తున్నారు.

ఇలా తమ కింద శిక్షణ పొందిన వారెందరో ఉన్నత స్థాయికి చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రకాశ్​ రావు దంపతులు. రానున్న కాలంలో మరికొందరు పేద పిల్లల్ని తీర్చిదిద్దేందుకు తమవంతు కృషి చేస్తామని తెలిపారు.

"నేను తొలుత బాస్కెట్​బాల్​ ప్లేయర్​ను. మా కోచ్​ రాజేశ్​ పటేల్(లేట్​​) ఎంతోమందిని ఉత్తమ ఆటగాళ్లుగా తీర్చిదిద్దారు. నేను మంచి కోచ్​ అవుతానని ఆయనెప్పుడూ అంటుండేవారు. ఇదే విషయం నా భర్తతోనూ చెప్పారు. ఆ స్ఫూర్తితోనే మేం పేద పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు పూనుకున్నాం. 2004లో మొదలైన మా శిక్షణా ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతోంది. ధనవంతులైన పిల్లలు వారి స్థాయికి తగినట్టు పరికరాలు కొని, సాధన చేస్తారు. అయితే.. వీరికి ఆ అవకాశముండదు. దేవుడు మనకిచ్చిన దాంట్లో.. కాస్తంత వీరికి తోడ్పాటునందిస్తే.. వీరు కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారనేదే మా ఉద్దేశం."

- ఛాయ ప్రకాశ్​ రావు, శిక్షకురాలు

తొలుత.. ఇక్కడ తర్ఫీదు పొందేందుకు చేరిన పిల్లలు.. కనీసం ట్రాక్​సూట్స్​, షూ కూడా కొనలేని పరిస్థితుల్లో ఉండేవారన్నారు కోచ్​ ప్రకాశ్​ రావు. ఆ తర్వాత క్రీడల్లో రాణించి పతకాలు సాధించి.. పేదరికం నుంచి బయటపడుతున్నారని చెప్పారు.

ఇదీ చదవండి: మూడేళ్లకే 163 దేశాల పేర్లు ఇట్టే చెప్పేస్తోంది

కూలీ కూతురు.. జాతీయ స్థాయిలో 25సార్లు

ఈ కోచ్​ల వద్ద శిక్షణ పొందిన రిజ్వానా ఖతూన్​ అనే కబడ్డీ ప్లేయర్​ ఏకంగా.. 25 సార్లు జాతీయ స్థాయిలో ​ ఆడి అనేక పతకాలు కైవసం చేసుకుంది. నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఓ అమ్మాయి జాతీయ స్థాయికి ఎదిగిందంటే అందుకు కారణం తమ కోచ్​లేనని, ఈ ఘనత వారికే దక్కుతుందని రిజ్వానా అన్నారు.

అంతేకాదు.. బెలూన్ల వ్యాపారి కుమార్తె కుమారి సంజన కూడా ప్రకాశ్​ రావు దంపతుల వద్ద శిక్షణ పొంది.. ఖేలో ఇండియా పోటీలకు ఎంపికైంది. నిరుపేద కుటుంబం కావడం వల్ల.. సంజనను శిక్షణకు పంపేందుకు నిరాకరించిన తల్లిదండ్రులు.. ఇప్పుడామె ఆట తీరుపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా.. ఏటా 15 నుంచి 20 మందిని ఉత్తమ స్థాయి ఆటగాళ్లుగా తీర్చిదిద్ది జాతీయ స్థాయికి పంపిస్తున్న ఈ దంపతులకు.. ప్రభుత్వ సాయం అందితే మరింత మందిని వెలికితీస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు స్థానికులు.

ఇదీ చదవండి: ఔరా అనామిక: ఎనిమిదో తరగతిలోనే టీచర్​ అయిన బాలిక!

ఛత్తీస్​గఢ్​లో నిరుపేద పిల్లలకు కబడ్డీలో శిక్షణనిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది ఓ జంట. ఆటపై మక్కువతో ఇలా మురికివాడల్లోని బాలబాలికలకు ఉచిత తర్ఫీదునిస్తూ.. జాతీయ స్థాయి ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ​ శిక్షకుల వద్ద ఆట నేర్చుకున్న క్రీడాకారులెందరో రాష్ట్ర, జాతీయస్థాయి వేదికలపై తళుక్కుమంటున్నారు.

మురికివాడ పిల్లలకు కబడ్డీలో శిక్షణినిస్తోన్న దంపతులు

భిలాయ్​కు చెందిన జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్​ ఏ.ప్రకాశ్​ రావు, బాస్కెట్​బాల్​ క్రీడాకారిణి ఏ.ఛాయ ప్రకాశ్​ రావు దంపతులు.. స్లమ్​ ప్రాంతాల్లోని పిల్లలను ఉత్తమ కబడ్డీ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కనీసం తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను ఎన్నుకుని వారిలోని ప్రతిభను వెలికితీస్తున్నారీ శిక్షకులు. వారి ప్రతిభకు మరిన్ని మెళకువలు నేర్పి.. అత్యుత్తమ ఆటతీరును బయటకు తీస్తున్నారు.

ఇదీ చదవండి: ఔరా! ఈ దివ్యాంగుల చేతులు అద్భుతాల్ని చేశాయి

17 ఏళ్లుగా ..

ఇలా మురికివాడల్లోని మాణిక్యాలను వెలికితీయడమే లక్ష్యంగా.. 2004 నుంచే శిక్షణ శిబరం ఆరంభించారీ దంపతులు. 2004 నుంచి 2009 వరకు భిలాయ్​లోని సెక్టార్-1లో ఆరేళ్లపాటు ఎంతో మందికి శిక్షణనిచ్చారు. 2009-2019 మధ్య కాలంలో ఖుర్సీపార్​ జోన్​-2 పాఠశాలలో మరికొందరిని తీర్చిదిద్దారు. 2019 నుంచి ఖుర్సిపార్​లోని బాల్​ మందిర్​ మైదానంలో తర్ఫీదు ఇస్తున్నారు. ఇలా 17 ఏళ్లలో 300 మందికిపైగా ఆటగాళ్లు శిక్షణపొంది.. జాతీయస్థాయి పోటీల్లో అనేక పతకాలు సాధించారు.

Chhattisgarh couple trains slum children for national-level kabaddi
కోచ్​ ప్రకాశ్​ రావు దంపతులు

కోచ్​లుగా ప్రకాశ్​ రావు దంపతుల ఘనతలు..

  1. 2018లో ఆరుగురు ఆటగాళ్లు ఖేలో ఇండియాకు ఎంపిక​.
  2. 2019లో మరో 8 మంది ఖేలో ఇండియాకు ఎంపిక.
  3. ముగ్గురు ప్లేయర్లకు 'షాహీద్​ పంకజ్​ విక్రమ్'​ అవార్డులు.
  4. ఐదుగురు క్రీడాకారులు జాతీయస్థాయికి ఎంపిక.
  5. మరో 25 మంది.. పోలీస్​ శాఖ, ఇతర విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందిస్తున్నారు.

ఇలా తమ కింద శిక్షణ పొందిన వారెందరో ఉన్నత స్థాయికి చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రకాశ్​ రావు దంపతులు. రానున్న కాలంలో మరికొందరు పేద పిల్లల్ని తీర్చిదిద్దేందుకు తమవంతు కృషి చేస్తామని తెలిపారు.

"నేను తొలుత బాస్కెట్​బాల్​ ప్లేయర్​ను. మా కోచ్​ రాజేశ్​ పటేల్(లేట్​​) ఎంతోమందిని ఉత్తమ ఆటగాళ్లుగా తీర్చిదిద్దారు. నేను మంచి కోచ్​ అవుతానని ఆయనెప్పుడూ అంటుండేవారు. ఇదే విషయం నా భర్తతోనూ చెప్పారు. ఆ స్ఫూర్తితోనే మేం పేద పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు పూనుకున్నాం. 2004లో మొదలైన మా శిక్షణా ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతోంది. ధనవంతులైన పిల్లలు వారి స్థాయికి తగినట్టు పరికరాలు కొని, సాధన చేస్తారు. అయితే.. వీరికి ఆ అవకాశముండదు. దేవుడు మనకిచ్చిన దాంట్లో.. కాస్తంత వీరికి తోడ్పాటునందిస్తే.. వీరు కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారనేదే మా ఉద్దేశం."

- ఛాయ ప్రకాశ్​ రావు, శిక్షకురాలు

తొలుత.. ఇక్కడ తర్ఫీదు పొందేందుకు చేరిన పిల్లలు.. కనీసం ట్రాక్​సూట్స్​, షూ కూడా కొనలేని పరిస్థితుల్లో ఉండేవారన్నారు కోచ్​ ప్రకాశ్​ రావు. ఆ తర్వాత క్రీడల్లో రాణించి పతకాలు సాధించి.. పేదరికం నుంచి బయటపడుతున్నారని చెప్పారు.

ఇదీ చదవండి: మూడేళ్లకే 163 దేశాల పేర్లు ఇట్టే చెప్పేస్తోంది

కూలీ కూతురు.. జాతీయ స్థాయిలో 25సార్లు

ఈ కోచ్​ల వద్ద శిక్షణ పొందిన రిజ్వానా ఖతూన్​ అనే కబడ్డీ ప్లేయర్​ ఏకంగా.. 25 సార్లు జాతీయ స్థాయిలో ​ ఆడి అనేక పతకాలు కైవసం చేసుకుంది. నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఓ అమ్మాయి జాతీయ స్థాయికి ఎదిగిందంటే అందుకు కారణం తమ కోచ్​లేనని, ఈ ఘనత వారికే దక్కుతుందని రిజ్వానా అన్నారు.

అంతేకాదు.. బెలూన్ల వ్యాపారి కుమార్తె కుమారి సంజన కూడా ప్రకాశ్​ రావు దంపతుల వద్ద శిక్షణ పొంది.. ఖేలో ఇండియా పోటీలకు ఎంపికైంది. నిరుపేద కుటుంబం కావడం వల్ల.. సంజనను శిక్షణకు పంపేందుకు నిరాకరించిన తల్లిదండ్రులు.. ఇప్పుడామె ఆట తీరుపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా.. ఏటా 15 నుంచి 20 మందిని ఉత్తమ స్థాయి ఆటగాళ్లుగా తీర్చిదిద్ది జాతీయ స్థాయికి పంపిస్తున్న ఈ దంపతులకు.. ప్రభుత్వ సాయం అందితే మరింత మందిని వెలికితీస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు స్థానికులు.

ఇదీ చదవండి: ఔరా అనామిక: ఎనిమిదో తరగతిలోనే టీచర్​ అయిన బాలిక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.