ETV Bharat / bharat

చంద్రబాబు బెయిల్ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు - ఇంతకీ ఏమని పేర్కొందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 7:08 AM IST

Chandrababu Bail Skill Development Case: స్కిల్‌ కేసులో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఖాతాలకు నిధులను మళ్లించారనేందుకు సీఐడీ ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ సమర్పించలేకపోయిందని హైకోర్టు తేల్చిచెప్పింది. బెయిల్ సందర్భంగా తీర్పులో అనేక కీలక విషయాలను పేర్కొంది. తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు చంద్రబాబుకు రిమాండ్‌ విధించాలని అభ్యర్థించక ముందే.. తగిన ఆధారాలను సేకరించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. నిధులు తెలుగుదేశం అకౌంట్​కి చేరాయనేందుకు సీఐడీ వద్ద ఆధారాల్లేవన్న హైకోర్టు.. దీనిని దర్యాప్తు లోపంగా భావిస్తున్నామని పేర్కొంది. చంద్రబాబుకు బెయిల్‌ ఇవ్వాల్సిన అవసరం లేదన్న సీఐడీ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

Chandrababu_Bail_Skill_Development_Case
Chandrababu_Bail_Skill_Development_Case
Chandrababu Bail Skill Development Case: చంద్రబాబు బెయిల్ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు - ఇంతకీ ఏమని పేర్కొందంటే?

Chandrababu Bail Skill Development Case: స్కిల్‌ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పూర్తిస్థాయి బెయిల్‌ ఇచ్చిన హైకోర్టు... తీర్పులో అనేక కీలక విషయాలను ప్రస్తావించింది. కేసులో (Skill Development Case) సీఐడీ వాదనకు ఆధారాలు లేవని స్పష్టంచేసింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకున్న సీమెన్స్, డిజైన్‌టెక్‌ సంస్థలు శిక్షణార్థులకు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞాన్ని అందించడంలో విఫలమయ్యాయని.... సీఐడీ కచ్చితంగా చెప్పలేకపోతోందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో ఓ నిందితుడికి బెయిల్‌ మంజూరు సందర్భంగా 2.13 లక్షల మంది యువత శిక్షణ పొందినట్లు, వారికి ధ్రువపత్రాలు అందజేసినట్లు, శిక్షణకు సొమ్ము ఖర్చు చేసినట్లు ఇదే హైకోర్టు గుర్తించిందన్నారు.

హవాలా మార్గంలో నిధుల మళ్లింపునకు సీమెన్స్‌ సంస్థ ఎండీ సుమన్‌ బోస్, డిజైన్‌టెక్‌ సీఎండీ ఖన్వేల్కర్‌ మధ్య 2014 డిసెంబరు 31వ తేదీ నుంచి 2016 జనవరి వరకు వాట్సప్‌ మెసేజ్​ల ద్వారా కరెన్సీ నోట్ల నంబర్లు బదిలీ చేసుకున్నట్లు అదనపు ఏజీ ఆరోపించారన్న హైకోర్టు... వాస్తవానికి స్కిల్‌ కేసులో ఒప్పందం 2017 జూన్‌ 30వ తేదీన జరిగిందని గుర్తుచేసింది. అలాంటప్పుడు 2014-16 మధ్య చోటు చేసుకున్న వాట్సప్‌ మెసేజ్‌లకు, ఈ కేసుకు ఎలాంటి సంబంధం ఉందనే దానికి ప్రాసిక్యూషన్‌ వద్ద సమాధానం లేదంది. అసలు వారిద్దరి మధ్య జరిగిన చాటింగ్‌లకు, చంద్రబాబుకు ఏం సంబంధమన్న న్యాయస్థానం... ఆ సొమ్ము ఏ విధంగా అందింది, ఎందుకోసం లావాదేవీలు జరిపారనే విషయాన్ని ఆ మెసేజ్‌ల ఆధారంగా నిర్ణయించలేమని సీఐడీయే చెబుతోందని స్పష్టం చేసింది.

స్కిల్‌ కేసులో చంద్రబాబుకు సాధారణ బెయిల్‌

భాగస్వామ్యం కాని చంద్రబాబుకు ఏం సంబంధమో: శరత్‌ అండ్‌ అసోసియేట్స్‌ ఇచ్చిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదికపై ఆధారపడి సీఐడీ వాదనలు వినిపిస్తోందన్న హైకోర్టు... తమ వద్ద దస్త్రాలు లేవని APSSDC (Andhra Pradesh State Skill Development Corporation) చెబుతున్నదానికి భిన్నంగా ఆ సంస్థ తమకు పలు దస్త్రాలు అందజేసిందని శరత్‌ అసోసియేట్స్‌ నివేదిక పేర్కొందని గుర్తుచేసింది. మరోవైపు MOU (Memorandum of Understanding) ఎక్కడ జరిగిందనే విషయంలోనూ సీమెన్స్, డిజైన్‌టెక్‌ సంస్థలు చెబుతున్నదానికి విరుద్ధంగా ఫొరెన్సిక్‌ ఆడిట్‌ నివేదిక ఉందని.. ఒప్పందంలో తేదీని ప్రస్తావించకపోవడానికి అందులో భాగస్వామ్యం కాని చంద్రబాబుకు ఏం సంబంధమో ప్రాసిక్యూషన్‌ వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి బెయిల్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒప్పందంలో బ్యాంక్‌ గ్యారంటీ క్లాజ్‌ను చంద్రబాబు సూచనతో తొలగించారని ఆడిట్‌ రిపోర్టులో పేర్కొన్నారే కానీ... ఏ సాక్షి ఆ విషయాన్ని చెప్పారో కోర్టు ముందు ఉంచలేదని తెలిపారు.

ముఖ్యమంత్రిది బాధ్యత కాదు: ఎంఓయూలో సీమెన్స్‌ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌ పేరును సుమన్‌ బోస్‌గా పేర్కొన్నారని, ఒప్పందంలో తేదీని ప్రస్తావించలేదని, సంతకాల్లో తేడా ఉందని.. సీఐడీ ఆడిట్‌ నివేదికలో పేర్కొందని హైకోర్టు తెలిపింది. ఈ వ్యత్యాసాలన్నింటికి అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎలా బాధ్యులవుతారనే విషయంపై సీఐడీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందంది. ఆయా సంతకాల్లో వచ్చిన తేడాలను పరిశీలించి, పోల్చి చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిది కాదన్న హైకోర్టు... ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో కనుగొన్న వ్యత్యాసాలకు చంద్రబాబుని బాధ్యుణ్ని చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.

అప్పటివరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దు - దీపావళి తర్వాత 'స్కిల్​ కేసు'పై తీర్పు : సుప్రీంకోర్టు

నిధుల మళ్లింపు నిజమనుకుంటే విద్యార్థులకు శిక్షణ ఎలా: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సీమెన్స్, డిజైన్‌టెక్‌ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాలను ఏపీ ఆర్థికశాఖ అప్పటి కార్యదర్శి కె.సునీత, అధికారుల బృందం పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అక్కడ ప్రాజెక్టు అమలు సంతృప్తికరంగా ఉందని, ఏపీలోనూ ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని, ప్రపంచస్థాయిలో ఉద్యోగ అవకాశాలు పొందుతారని అందులో తెలిపారని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ పీడీ ఖాతాలో ఉన్న 270 కోట్లను వెంటనే విడుదల చేయాలని నివేదిక ఇచ్చిన విషయంలో ఎలాంటి వివాదం లేదంది.

ఆర్థికశాఖ కార్యదర్శి సునీత, అధికారుల బృందం సరైన నివేదిక ఇవ్వలేదని సీఐడీ ఎలాంటి ఆరోపణ చేయడం లేదన్న హైకోర్టు.. 2 లక్షల మందికి పైగా శిక్షణ తీసుకొని, ధ్రువపత్రాలు పొందారనేది నిర్వివాదాంశమని స్పష్టం చేసింది. స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్ల కోసం ప్రభుత్వం విడుదల చేసిన 370 కోట్లలో 241 కోట్ల నిధులను సీమెన్స్, డిజైన్‌టెక్‌ షెల్‌ కంపెనీలకు మళ్లించినట్లు సీఐడీ వాదిస్తోందన్న హైకోర్టు.. నిధుల మళ్లింపు నిజమనుకుంటే 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం సాధ్యపడుతుందా అని పిటిషనర్‌ ప్రశ్నిస్తున్నారని పేర్కొంది. శిక్షణ కేంద్రాలు, క్లస్టర్లలో మౌలిక సదుపాయాలు లేవని ప్రాసిక్యూషన్‌ సైతం చెప్పడం లేదని గుర్తుచేసింది.

'ఎన్నికల వేళ తప్పుడు కేసులు - రాజకీయ పెద్దలు చెప్పినట్లు సీఐడీ నడుస్తోంది'

ఎలాంటి ఆధారాలు లేవు: ఆర్థికశాఖ కార్యదర్శి నిధుల విడుదలపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు.. నిధులు విడుదల చేయాలని ఆదేశించే అధికారం ముఖ్యమంత్రికి లేదనేది.. సీఐడీ చెప్పడం లేదని తెలిపింది. చంద్రబాబుకు లేదా ఆయన పార్టీ ఖాతాకు నిధులు మళ్లించినట్లు ఎలాంటి ఆధారాలు లేకుండా, శిక్షణ కేంద్రాల ఏర్పాటు విషయంలో నిధుల విడుదలకు ముఖ్యమంత్రి స్థాయిలో మొగ్గు చూపడాన్ని.. ఈ కేసులో ఆయన పాత్ర ఉన్నట్లుగా భావించలేమని తేల్చిచెప్పింది. ఉపగుత్తేదారుల స్థాయిలో జరిగే చిన్న తప్పులకు పిటిషనర్‌ను బాధ్యుడిగా చేయడానికి వీల్లేదన్న చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తున్నట్లు స్పష్టంచేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ వ్యవహారంలో చోటుచేసుకున్న తప్పులను అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్లు ఆధారాలు సైతం లేవని తీర్పులో వెల్లడించింది.

సీఐడీ వాదనకు ఆధారాలు లేవు: అక్రమ లావాదేవీల్లో పిటిషనర్‌ పాత్ర ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ తేల్చిందని సీఐడీ వాదిస్తున్నప్పటికి.. ఆ వాదనను బలపరిచేందుకు ఎలాంటి ఆధారాల్లేవని పేర్కొంది. సహ నిందితులను, సాక్షులు, టీడీపీ సభ్యులను పిటిషనర్‌ పరోక్షంగా ప్రభావితం చేశారన్న సీఐడీ వాదనకు సైతం ఆధారాలు లేవంది. పిటిషనర్‌ పూర్వ పీఏ పెండ్యాల శ్రీనివాస్‌ సీఐడీ ముందు హాజరుకాకపోవడానికి, కిలారు రాజేష్‌ జూబ్లీహిల్స్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడానికి పిటిషనర్‌కు బెయిల్‌ మంజూరు చేసే విషయానికి సంబంధమే లేదంది. పిటిషనర్‌ మధ్యంతర బెయిల్‌ షరతులు ఉల్లంఘించినట్లు బేగంపేట పోలీసులు నమోదు చేసిన కేసులో కనిపించడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ - తీవ్ర ఉత్కంఠ

సాక్ష్యాల తారుమారు ప్రస్తావనే రాదు: మంగళగిరి CID డీఎస్పీకి.. సుజయత్‌ ఖాన్, ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌కు సీమెన్స్‌ ఇండియా ఎండీ మాథ్యు థామస్‌లు ఇచ్చిన వాంగ్మూలాలను పరిశీలిస్తే.. చంద్రబాబుకు నేర ఘటనలో భాగస్వామ్యం ఉన్నట్లు ప్రాథమికంగా కనిపించడం లేదని హైకోర్టు పేర్కొంది. రికార్డులను పరిశీలిస్తే.. కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత పిటిషనర్‌ పేరును నిందితుడిగా చేర్చినట్లు స్పష్టమవుతోందని... అంతేకాక పిటిషనర్‌ను అరెస్టు చేయడానికి ముందు మాత్రమే నమోదు చేసినట్లు తేటతెల్లమవుతోందని తెలిపింది. ఈ 22 నెలల్లో పిటిషనర్‌ దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయమూర్తి బెయిల్‌ ఉత్తర్వుల్లో తెలిపారు.

చంద్రబాబు తప్ప ఈ కేసులో నిందితులందరూ బెయిల్‌ లేదా ముందస్తు బెయిల్‌పై రిలీజ్‌ అయ్యారని న్యాయమూర్తి గుర్తుచేశారు. 2021లో కేసు నమోదు అయిన తర్వాత 140 మందికి పైగా సాక్షులను సీఐడీ విచారించిందని.. 4 వేలకు పైగా దస్త్రాలను సేకరించిందన్నారు. దర్యాప్తు తుది దశలో ఉందన్న న్యాయమూర్తి.. జడ్‌ ప్లస్‌ క్యాటగిరీ భద్రతలో ఉన్న పిటిషనర్‌ విదేశాలకు తప్పించుకుపోయే ప్రమాదమే లేదని.. సాక్ష్యాల తారుమారు ప్రస్తావనే రాదన్నారు. 73 ఏళ్ల వయసున్న చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్నారని... ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ ఇప్పటికే మంజూరు చేశామని గుర్తుచేశారు.

CBN Quash Petition Arguments in Supreme Court: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై.. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు

షరతులు సడలింపు: అక్టోబరు 31వ తేదీన మధ్యంతర బెయిల్‌ మంజూరు సమయంలో సీఐడీ అభ్యర్థన మేరకు.. కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని, రాజకీయ సమావేశాల్లో పొల్గొనవద్దని, ర్యాలీలు నిర్వహించవద్దని షరతు విధించామన్న జడ్జి.. ప్రధాన బెయిల్‌ పిటిషన్‌ను పరిష్కరిస్తున్న ఈ టైమ్​లో అలాంటి షరతులు విధించడం చంద్రబాబు నాయుడుకి చెందిన రాజకీయ పార్టీ ఎన్నికల ప్రణాళికపై ప్రభావం చూపుతుందన్నారు. కనుక ఆ షరతులను ఈ నెల 29వ తేదీ నుంచి సడలిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఈ ఏడాది అక్టోబరు 31న మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను పూర్తిస్థాయిలో బెయిల్‌ ఉత్తర్వులుగా ఖరారు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైద్యం చేయించుకున్న వివరాలను ఈ నెల 28 లోపు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేయాలని చంద్రబాబును ఆదేశించారు. ప్రస్తుతం కేసులో దర్యాప్తు జరుగుతున్నందున.. రాజకీయ ప్రతీకారంతో తనపై కేసు నమోదు చేశారన్న పిటిషనర్‌ వాదనతో న్యాయస్థానం అంగీకరించడం లేదని తీర్పులో పేర్కొన్నారు.

AP HC on Amaravati Inner Ring Road Case ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Chandrababu Bail Skill Development Case: చంద్రబాబు బెయిల్ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు - ఇంతకీ ఏమని పేర్కొందంటే?

Chandrababu Bail Skill Development Case: స్కిల్‌ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పూర్తిస్థాయి బెయిల్‌ ఇచ్చిన హైకోర్టు... తీర్పులో అనేక కీలక విషయాలను ప్రస్తావించింది. కేసులో (Skill Development Case) సీఐడీ వాదనకు ఆధారాలు లేవని స్పష్టంచేసింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకున్న సీమెన్స్, డిజైన్‌టెక్‌ సంస్థలు శిక్షణార్థులకు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞాన్ని అందించడంలో విఫలమయ్యాయని.... సీఐడీ కచ్చితంగా చెప్పలేకపోతోందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో ఓ నిందితుడికి బెయిల్‌ మంజూరు సందర్భంగా 2.13 లక్షల మంది యువత శిక్షణ పొందినట్లు, వారికి ధ్రువపత్రాలు అందజేసినట్లు, శిక్షణకు సొమ్ము ఖర్చు చేసినట్లు ఇదే హైకోర్టు గుర్తించిందన్నారు.

హవాలా మార్గంలో నిధుల మళ్లింపునకు సీమెన్స్‌ సంస్థ ఎండీ సుమన్‌ బోస్, డిజైన్‌టెక్‌ సీఎండీ ఖన్వేల్కర్‌ మధ్య 2014 డిసెంబరు 31వ తేదీ నుంచి 2016 జనవరి వరకు వాట్సప్‌ మెసేజ్​ల ద్వారా కరెన్సీ నోట్ల నంబర్లు బదిలీ చేసుకున్నట్లు అదనపు ఏజీ ఆరోపించారన్న హైకోర్టు... వాస్తవానికి స్కిల్‌ కేసులో ఒప్పందం 2017 జూన్‌ 30వ తేదీన జరిగిందని గుర్తుచేసింది. అలాంటప్పుడు 2014-16 మధ్య చోటు చేసుకున్న వాట్సప్‌ మెసేజ్‌లకు, ఈ కేసుకు ఎలాంటి సంబంధం ఉందనే దానికి ప్రాసిక్యూషన్‌ వద్ద సమాధానం లేదంది. అసలు వారిద్దరి మధ్య జరిగిన చాటింగ్‌లకు, చంద్రబాబుకు ఏం సంబంధమన్న న్యాయస్థానం... ఆ సొమ్ము ఏ విధంగా అందింది, ఎందుకోసం లావాదేవీలు జరిపారనే విషయాన్ని ఆ మెసేజ్‌ల ఆధారంగా నిర్ణయించలేమని సీఐడీయే చెబుతోందని స్పష్టం చేసింది.

స్కిల్‌ కేసులో చంద్రబాబుకు సాధారణ బెయిల్‌

భాగస్వామ్యం కాని చంద్రబాబుకు ఏం సంబంధమో: శరత్‌ అండ్‌ అసోసియేట్స్‌ ఇచ్చిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదికపై ఆధారపడి సీఐడీ వాదనలు వినిపిస్తోందన్న హైకోర్టు... తమ వద్ద దస్త్రాలు లేవని APSSDC (Andhra Pradesh State Skill Development Corporation) చెబుతున్నదానికి భిన్నంగా ఆ సంస్థ తమకు పలు దస్త్రాలు అందజేసిందని శరత్‌ అసోసియేట్స్‌ నివేదిక పేర్కొందని గుర్తుచేసింది. మరోవైపు MOU (Memorandum of Understanding) ఎక్కడ జరిగిందనే విషయంలోనూ సీమెన్స్, డిజైన్‌టెక్‌ సంస్థలు చెబుతున్నదానికి విరుద్ధంగా ఫొరెన్సిక్‌ ఆడిట్‌ నివేదిక ఉందని.. ఒప్పందంలో తేదీని ప్రస్తావించకపోవడానికి అందులో భాగస్వామ్యం కాని చంద్రబాబుకు ఏం సంబంధమో ప్రాసిక్యూషన్‌ వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి బెయిల్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒప్పందంలో బ్యాంక్‌ గ్యారంటీ క్లాజ్‌ను చంద్రబాబు సూచనతో తొలగించారని ఆడిట్‌ రిపోర్టులో పేర్కొన్నారే కానీ... ఏ సాక్షి ఆ విషయాన్ని చెప్పారో కోర్టు ముందు ఉంచలేదని తెలిపారు.

ముఖ్యమంత్రిది బాధ్యత కాదు: ఎంఓయూలో సీమెన్స్‌ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌ పేరును సుమన్‌ బోస్‌గా పేర్కొన్నారని, ఒప్పందంలో తేదీని ప్రస్తావించలేదని, సంతకాల్లో తేడా ఉందని.. సీఐడీ ఆడిట్‌ నివేదికలో పేర్కొందని హైకోర్టు తెలిపింది. ఈ వ్యత్యాసాలన్నింటికి అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎలా బాధ్యులవుతారనే విషయంపై సీఐడీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందంది. ఆయా సంతకాల్లో వచ్చిన తేడాలను పరిశీలించి, పోల్చి చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిది కాదన్న హైకోర్టు... ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో కనుగొన్న వ్యత్యాసాలకు చంద్రబాబుని బాధ్యుణ్ని చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.

అప్పటివరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దు - దీపావళి తర్వాత 'స్కిల్​ కేసు'పై తీర్పు : సుప్రీంకోర్టు

నిధుల మళ్లింపు నిజమనుకుంటే విద్యార్థులకు శిక్షణ ఎలా: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సీమెన్స్, డిజైన్‌టెక్‌ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాలను ఏపీ ఆర్థికశాఖ అప్పటి కార్యదర్శి కె.సునీత, అధికారుల బృందం పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అక్కడ ప్రాజెక్టు అమలు సంతృప్తికరంగా ఉందని, ఏపీలోనూ ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని, ప్రపంచస్థాయిలో ఉద్యోగ అవకాశాలు పొందుతారని అందులో తెలిపారని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ పీడీ ఖాతాలో ఉన్న 270 కోట్లను వెంటనే విడుదల చేయాలని నివేదిక ఇచ్చిన విషయంలో ఎలాంటి వివాదం లేదంది.

ఆర్థికశాఖ కార్యదర్శి సునీత, అధికారుల బృందం సరైన నివేదిక ఇవ్వలేదని సీఐడీ ఎలాంటి ఆరోపణ చేయడం లేదన్న హైకోర్టు.. 2 లక్షల మందికి పైగా శిక్షణ తీసుకొని, ధ్రువపత్రాలు పొందారనేది నిర్వివాదాంశమని స్పష్టం చేసింది. స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్ల కోసం ప్రభుత్వం విడుదల చేసిన 370 కోట్లలో 241 కోట్ల నిధులను సీమెన్స్, డిజైన్‌టెక్‌ షెల్‌ కంపెనీలకు మళ్లించినట్లు సీఐడీ వాదిస్తోందన్న హైకోర్టు.. నిధుల మళ్లింపు నిజమనుకుంటే 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం సాధ్యపడుతుందా అని పిటిషనర్‌ ప్రశ్నిస్తున్నారని పేర్కొంది. శిక్షణ కేంద్రాలు, క్లస్టర్లలో మౌలిక సదుపాయాలు లేవని ప్రాసిక్యూషన్‌ సైతం చెప్పడం లేదని గుర్తుచేసింది.

'ఎన్నికల వేళ తప్పుడు కేసులు - రాజకీయ పెద్దలు చెప్పినట్లు సీఐడీ నడుస్తోంది'

ఎలాంటి ఆధారాలు లేవు: ఆర్థికశాఖ కార్యదర్శి నిధుల విడుదలపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు.. నిధులు విడుదల చేయాలని ఆదేశించే అధికారం ముఖ్యమంత్రికి లేదనేది.. సీఐడీ చెప్పడం లేదని తెలిపింది. చంద్రబాబుకు లేదా ఆయన పార్టీ ఖాతాకు నిధులు మళ్లించినట్లు ఎలాంటి ఆధారాలు లేకుండా, శిక్షణ కేంద్రాల ఏర్పాటు విషయంలో నిధుల విడుదలకు ముఖ్యమంత్రి స్థాయిలో మొగ్గు చూపడాన్ని.. ఈ కేసులో ఆయన పాత్ర ఉన్నట్లుగా భావించలేమని తేల్చిచెప్పింది. ఉపగుత్తేదారుల స్థాయిలో జరిగే చిన్న తప్పులకు పిటిషనర్‌ను బాధ్యుడిగా చేయడానికి వీల్లేదన్న చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తున్నట్లు స్పష్టంచేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ వ్యవహారంలో చోటుచేసుకున్న తప్పులను అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్లు ఆధారాలు సైతం లేవని తీర్పులో వెల్లడించింది.

సీఐడీ వాదనకు ఆధారాలు లేవు: అక్రమ లావాదేవీల్లో పిటిషనర్‌ పాత్ర ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ తేల్చిందని సీఐడీ వాదిస్తున్నప్పటికి.. ఆ వాదనను బలపరిచేందుకు ఎలాంటి ఆధారాల్లేవని పేర్కొంది. సహ నిందితులను, సాక్షులు, టీడీపీ సభ్యులను పిటిషనర్‌ పరోక్షంగా ప్రభావితం చేశారన్న సీఐడీ వాదనకు సైతం ఆధారాలు లేవంది. పిటిషనర్‌ పూర్వ పీఏ పెండ్యాల శ్రీనివాస్‌ సీఐడీ ముందు హాజరుకాకపోవడానికి, కిలారు రాజేష్‌ జూబ్లీహిల్స్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడానికి పిటిషనర్‌కు బెయిల్‌ మంజూరు చేసే విషయానికి సంబంధమే లేదంది. పిటిషనర్‌ మధ్యంతర బెయిల్‌ షరతులు ఉల్లంఘించినట్లు బేగంపేట పోలీసులు నమోదు చేసిన కేసులో కనిపించడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ - తీవ్ర ఉత్కంఠ

సాక్ష్యాల తారుమారు ప్రస్తావనే రాదు: మంగళగిరి CID డీఎస్పీకి.. సుజయత్‌ ఖాన్, ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌కు సీమెన్స్‌ ఇండియా ఎండీ మాథ్యు థామస్‌లు ఇచ్చిన వాంగ్మూలాలను పరిశీలిస్తే.. చంద్రబాబుకు నేర ఘటనలో భాగస్వామ్యం ఉన్నట్లు ప్రాథమికంగా కనిపించడం లేదని హైకోర్టు పేర్కొంది. రికార్డులను పరిశీలిస్తే.. కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత పిటిషనర్‌ పేరును నిందితుడిగా చేర్చినట్లు స్పష్టమవుతోందని... అంతేకాక పిటిషనర్‌ను అరెస్టు చేయడానికి ముందు మాత్రమే నమోదు చేసినట్లు తేటతెల్లమవుతోందని తెలిపింది. ఈ 22 నెలల్లో పిటిషనర్‌ దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయమూర్తి బెయిల్‌ ఉత్తర్వుల్లో తెలిపారు.

చంద్రబాబు తప్ప ఈ కేసులో నిందితులందరూ బెయిల్‌ లేదా ముందస్తు బెయిల్‌పై రిలీజ్‌ అయ్యారని న్యాయమూర్తి గుర్తుచేశారు. 2021లో కేసు నమోదు అయిన తర్వాత 140 మందికి పైగా సాక్షులను సీఐడీ విచారించిందని.. 4 వేలకు పైగా దస్త్రాలను సేకరించిందన్నారు. దర్యాప్తు తుది దశలో ఉందన్న న్యాయమూర్తి.. జడ్‌ ప్లస్‌ క్యాటగిరీ భద్రతలో ఉన్న పిటిషనర్‌ విదేశాలకు తప్పించుకుపోయే ప్రమాదమే లేదని.. సాక్ష్యాల తారుమారు ప్రస్తావనే రాదన్నారు. 73 ఏళ్ల వయసున్న చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్నారని... ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ ఇప్పటికే మంజూరు చేశామని గుర్తుచేశారు.

CBN Quash Petition Arguments in Supreme Court: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై.. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు

షరతులు సడలింపు: అక్టోబరు 31వ తేదీన మధ్యంతర బెయిల్‌ మంజూరు సమయంలో సీఐడీ అభ్యర్థన మేరకు.. కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని, రాజకీయ సమావేశాల్లో పొల్గొనవద్దని, ర్యాలీలు నిర్వహించవద్దని షరతు విధించామన్న జడ్జి.. ప్రధాన బెయిల్‌ పిటిషన్‌ను పరిష్కరిస్తున్న ఈ టైమ్​లో అలాంటి షరతులు విధించడం చంద్రబాబు నాయుడుకి చెందిన రాజకీయ పార్టీ ఎన్నికల ప్రణాళికపై ప్రభావం చూపుతుందన్నారు. కనుక ఆ షరతులను ఈ నెల 29వ తేదీ నుంచి సడలిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఈ ఏడాది అక్టోబరు 31న మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను పూర్తిస్థాయిలో బెయిల్‌ ఉత్తర్వులుగా ఖరారు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైద్యం చేయించుకున్న వివరాలను ఈ నెల 28 లోపు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేయాలని చంద్రబాబును ఆదేశించారు. ప్రస్తుతం కేసులో దర్యాప్తు జరుగుతున్నందున.. రాజకీయ ప్రతీకారంతో తనపై కేసు నమోదు చేశారన్న పిటిషనర్‌ వాదనతో న్యాయస్థానం అంగీకరించడం లేదని తీర్పులో పేర్కొన్నారు.

AP HC on Amaravati Inner Ring Road Case ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.