కరోనా మరోమారు విజృంభిస్తున్న రాష్ట్రాలకు కేంద్రం ఉన్నత స్థాయి బృందాలను పంపింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, జమ్ముకశ్మీర్లో కొవిడ్ను కట్టడి చేయడంలో స్థానిక ప్రభుత్వాలకు ఈ బృందాలు అండగా నిలవనున్నాయి.
ముగ్గురు సభ్యులుండే ఈ బృందాలకు ఆరోగ్య శాఖలోని జాయింట్ సెక్రటరీ లెవల్ అధికారి అధ్యక్షత వహిస్తారని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
"రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్ ఉద్ధృతికి కారణాలేంటనే అంశంపై ఈ బృందాలు ఆరాతీయనున్నాయి. కొవిడ్ కట్టడికై పలు ప్రాంతాల్లోని ఆరోగ్య సిబ్బందికి సహాయం చేయనున్నాయి" అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇదీ చదవండి:భారత్లో కరోనా కేసుల పెరుగుదలకు అవే కారణమా?