ETV Bharat / bharat

అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం కీలక మార్గదర్శకాలు - rtpcr tests for international arrivals

భారత్​కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు వెల్లడించింది. నిర్ధరణ పరీక్షలైన ఆర్​టీపీసీఆర్​ పరీక్షను చేయించుకోకుండా భారత్​కు వచ్చేవారు 14 రోజుల స్వీయనిర్బంధంతో పాటు.. టెస్టు తప్పనిసరిగా చేయించుకోవాలని స్పష్టం చేసింది.

central government issued New covid guidelines for international arrivals
అంతర్జాతీయ ప్రయాణికులకు ఆర్​టీపీసీఆర్​ తప్పనిసరి
author img

By

Published : Nov 6, 2020, 5:51 AM IST

కరోనా నిర్ధరణ పరీక్షలు ఆర్​టీపీసీఆర్​ పరీక్షలు చేయించుకోకుండా భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు విమానాశ్రయాల్లో దిగిన తర్వాత తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాల్సిందేనని కేంద్రం తెలిపింది. ఒకవేళ విమానాశ్రయాల్లో ఆ మేరకు ఏర్పాట్లు లేకుంటే 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ 14 రోజుల్లో ఏడు రోజులు ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌ మరో 7 రోజులు ఇంట్లో ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగస్టు 2 నాటి మార్గదర్శకాల స్థానంలో కొత్త వాటిని కేంద్రం జారీ చేసింది.

అంతర్జాతీయ ప్రయాణికులు అందరూ.. తమ ప్రయాణానికి కచ్చితంగా 72 గంటల ముందు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ న్యూడిల్లీఎయిర్‌పోర్ట్‌ డాట్ ఇన్ పోర్టల్ ద్వారా స్వీయధ్రువీకరణ పత్రం సమర్పించాలని లేదంటే విమానాశ్రయాల్లో దిగిన తర్వాత అక్కడి కౌంటర్లలో వ్యక్తిగతంగా అందించాలని కేంద్రం తెలిపింది. 14 రోజుల పాటు క్వారంటైన్ నిబంధనలు పాటిస్తామన్న లేఖను కూడా ఇవ్వాలని పేర్కొంది.

గర్భిణులుకు, పిల్లలకు, వృద్ధులకు, కుటుంబసభ్యులు మరణించిన వారికి మాత్రమే 14రోజుల హోం క్వారంటైన్ అనుమతి ఉంటుందని తెలిపింది. ఆర్​టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారికే వ్యవస్థాగత క్వారంటైన్ ఉండబోదని తెలిపింది.

ఇదీ చూడండి: 'దీర్ఘకాల పెట్టుబడులకు భారత్​ ఉత్తమ స్థానం'

కరోనా నిర్ధరణ పరీక్షలు ఆర్​టీపీసీఆర్​ పరీక్షలు చేయించుకోకుండా భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు విమానాశ్రయాల్లో దిగిన తర్వాత తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాల్సిందేనని కేంద్రం తెలిపింది. ఒకవేళ విమానాశ్రయాల్లో ఆ మేరకు ఏర్పాట్లు లేకుంటే 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ 14 రోజుల్లో ఏడు రోజులు ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌ మరో 7 రోజులు ఇంట్లో ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగస్టు 2 నాటి మార్గదర్శకాల స్థానంలో కొత్త వాటిని కేంద్రం జారీ చేసింది.

అంతర్జాతీయ ప్రయాణికులు అందరూ.. తమ ప్రయాణానికి కచ్చితంగా 72 గంటల ముందు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ న్యూడిల్లీఎయిర్‌పోర్ట్‌ డాట్ ఇన్ పోర్టల్ ద్వారా స్వీయధ్రువీకరణ పత్రం సమర్పించాలని లేదంటే విమానాశ్రయాల్లో దిగిన తర్వాత అక్కడి కౌంటర్లలో వ్యక్తిగతంగా అందించాలని కేంద్రం తెలిపింది. 14 రోజుల పాటు క్వారంటైన్ నిబంధనలు పాటిస్తామన్న లేఖను కూడా ఇవ్వాలని పేర్కొంది.

గర్భిణులుకు, పిల్లలకు, వృద్ధులకు, కుటుంబసభ్యులు మరణించిన వారికి మాత్రమే 14రోజుల హోం క్వారంటైన్ అనుమతి ఉంటుందని తెలిపింది. ఆర్​టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారికే వ్యవస్థాగత క్వారంటైన్ ఉండబోదని తెలిపింది.

ఇదీ చూడండి: 'దీర్ఘకాల పెట్టుబడులకు భారత్​ ఉత్తమ స్థానం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.