ETV Bharat / bharat

అసోం అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు - Assam latest news

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్​ సునీల్​ అరోడా నేతృత్వంలోని బృందం అసోంలో పర్యటించనుంది. వచ్చే శాసనసభ ఎన్నికలకు సంబంధించి సమీక్ష నిర్వహించనుంది.

Central Election Commission team go to Assam to review of upcoming assembly poll
అసోంలో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘ బృందం
author img

By

Published : Jan 17, 2021, 7:16 PM IST

అసోం శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కసరత్తు ప్రారంభించింది. ఈసీ ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా సారథ్యంలోని అధికారుల బృందం సోమవారం నుంచి మూడు రోజులపాటు గువాహటిలో పర్యటించనుంది. 126 స్థానాలు కలిగిన అసోం శాసనసభకు మార్చి-ఏప్రిల్‌లో జరిగే ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష చేయనుంది.

ఈ పర్యటనలో వివిధ వర్గాలతో ఈసీ బృందం సమావేశం కానుంది. అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం కార్యదర్శి, డీజీపీ, ఎన్నికల ప్రధాన అధికారి, పోలీస్‌ నోడల్‌ అధికారి సహా ఉన్నత స్థాయి అధికారులతో భేటీ అవుతుంది. ఆ తర్వాత రాజకీయ పార్టీలు, ఎన్నికలతో సంబంధం ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానుంది. శాసనసభ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించి, అధికారులకు సూచనలు చేసే అవకాశం ఉంది.

అసోం శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కసరత్తు ప్రారంభించింది. ఈసీ ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా సారథ్యంలోని అధికారుల బృందం సోమవారం నుంచి మూడు రోజులపాటు గువాహటిలో పర్యటించనుంది. 126 స్థానాలు కలిగిన అసోం శాసనసభకు మార్చి-ఏప్రిల్‌లో జరిగే ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష చేయనుంది.

ఈ పర్యటనలో వివిధ వర్గాలతో ఈసీ బృందం సమావేశం కానుంది. అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం కార్యదర్శి, డీజీపీ, ఎన్నికల ప్రధాన అధికారి, పోలీస్‌ నోడల్‌ అధికారి సహా ఉన్నత స్థాయి అధికారులతో భేటీ అవుతుంది. ఆ తర్వాత రాజకీయ పార్టీలు, ఎన్నికలతో సంబంధం ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానుంది. శాసనసభ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించి, అధికారులకు సూచనలు చేసే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: 'రైతుల ఆదాయం రెట్టింపు చేయటమే ప్రభుత్వ లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.