CBI books GAIL director: పెట్రో కెమికల్ ఉత్పత్తులను డిస్కౌంట్కు విక్రయించేందుకు ప్రైవేటు కంపెనీల నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ మార్కెటింగ్ డైరెక్టర్ ఈఎస్ రంగనాథన్పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసింది.
GAIL marketing director bribe
శుక్రవారం కేసు నమోదు చేసుకున్న సీబీఐ.. దిల్లీ-ఎన్సీఆర్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. రంగనాథన్ నివాసాల్లోనూ సోదాలు నిర్వహించింది. ఆయన ఇళ్లలో నుంచి ఇప్పటివరకు రూ.1.3 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది.
రంగనాథన్తో పాటు పవన్ గౌర్, రాజేశ్ కుమార్, ఎన్ రామకృష్ణన్ నాయర్ అనే ముగ్గురు మధ్యవర్తులపై కేసు నమోదు చేసింది. వ్యాపారవేత్త సౌరభ్ గుప్తా, ఆయన కంపెనీ యునైటెడ్ పాలీమర్స్ ఇండస్ట్రీస్... ఆదిత్య బన్సల్, అతడి కంపెనీ అయిన బన్సల్ ఏజెన్సీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
"ఉత్పత్తులను డిస్కౌంట్కు విక్రయించాలని ప్రైవేటు కంపెనీ ప్రతినిధి తరఫున ఓ మధ్యవర్తి ... గెయిల్ మార్కెటింగ్ డైరెక్టర్ను ఆశ్రయించాడు. బదులుగా లంచం ఇస్తానని మధ్యవర్తి చెప్పాడు. గెయిల్ మార్కెటింగ్ మేనేజర్ తరఫున మధ్యవర్తి రూ.10 లక్షలు లంచం తీసుకున్నాడు. ఈ వ్యవహారంలో ఆ మధ్యవర్తి, ప్రైవేటు కంపెనీ డైరెక్టరేట్ను అదుపులోకి తీసుకున్నాం. అనంతరం దిల్లీ, నోయిడా, గురుగ్రామ్, పంచకులా, కర్నాల్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాం. అనంతరం రూ.84 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. రంగనాథన్ నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి."
-సీబీఐ
పవన్, రాజేశ్లతో కలిసి రంగనాథన్.. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డాడని సీబీఐ ఆరోపించింది. వీరిద్దరూ రంగనాథన్కు మధ్యవర్తులుగా వ్యవహరించారని పేర్కొంది. ప్రైవేటు కంపెనీల నుంచి లంచం తీసుకొని రంగనాథన్కు ఇచ్చేవారని ఎఫ్ఐఆర్లో వివరించింది. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.
ఇదీ చదవండి: పార్లమెంట్లో కరోనా కలకలం- 850కిపైగా కేసులు