ETV Bharat / bharat

అపార్ట్​మెంట్​ కూలిన ఘటన.. ఎస్పీ నేత తల్లి, భార్య మృతి.. పెళ్లి ఎలా చేయాలంటూ మహిళ ఆవేదన! - uttarpradesh apartment collapede

యూపీ.. లఖ్​నవూలో అపార్ట్​మెంట్​ కుప్పకూలిన ప్రాంతంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో సమాజ్​వాదీ పార్టీ నేత అబ్బాస్.. తన తల్లి, భార్యను కోల్పోయారు. మరికొద్దిరోజుల్లో తన కుమార్తెకు వివాహం చేయాలనుకున్నఓ మహిళ.. తాను సర్వస్వం కోల్పోయానని, వివాహం చేసేదేలా అని కన్నీరుమున్నీరవుతోంది. మరోవైపు, అపార్ట్​మెంట్​ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Etv Bharatbuilding-collapsed-in-lucknow-incident-of-people-of-alaya-apartment
Etv Bharatbuilding-collapsed-in-lucknow-incident-of-people-of-alaya-apartment
author img

By

Published : Jan 25, 2023, 5:40 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలోని హజ్రత్​గంజ్​ ప్రాంతంలో అలయా అపార్ట్​మెంట్​ కుప్పకూలిన ప్రాంతంలో 18 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్​ జరుగుతోంది. ఇప్పటివరకు 16 మందిని సురక్షితంగా కాపాడారు అధికారులు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు చనిపోయినట్లు సమాచారం. అయితే లఖ్​నవూ డెవలప్​మెంట్​ అథారిటీ నిర్లాక్ష్యానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోందని స్థానికులు అంటున్నారు. నాలుగు అంతస్తుల ఈ అపార్ట్​మెంట్​ పిల్లర్లను చాలా సన్నగా, నాసిరకంగా నిర్మించారని ఆరోపిస్తున్నారు. భవనం కూడా సరైన ప్రణాళిక లేకుండానే నిర్మించినట్లు చెబుతున్నారు.

సహాయక చర్యల దృశ్యాలు
సహాయక చర్యల దృశ్యాలు

తల్లి, భార్యను కోల్పోయిన ఎస్పీ నేత..
బుధవారం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్​లో శిథిలాల కింద చిక్కుకున్న సమాజ్​వాదీ పార్టీ నేత అబ్బాస్​ హైదర్​ భార్య బేగం హైదర్​, ఉజ్మాను అధికారులు బయటకు తీశారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. దీంతో అబ్బాస్​ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

'మొత్తం పోయింది.. కూతురికి పెళ్లి చేసదెలా?'
అపార్ట్​మెంట్​ కుప్పకూలిన ఘటనలో విద్యుత్​ శాఖ ఉద్యోగి రంజనా అవస్థి.. ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. ఈటీవీ భారత్​తో మాట్లాడారు. "నేను విద్యుత్​ శాఖలో ఉద్యోగం చేస్తున్నాను. ఈ ఏడాదే పదవీ విరమణ పొందుతున్నాను. మొత్తం సంపాదించినదంతా పోయింది. మరికొద్ది నెలల్లో కుమార్తె పెళ్లి చేద్దామనుకున్నాను. ఇప్పుడు ఇల్లు లేదు. డబ్బు లేదు. ఏం చేయాలో అర్ధం కావట్లేదు" అని రంజన వాపోయింది.

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17579122_wwww.jpg
సహాయక చర్యల దృశ్యాలు

శిథిలాల కింద తల్లిదండ్రులు.. ఆస్పత్రిలో ఆరేళ్ల చిన్నారి
రెస్క్యూ ఆపరేషన్​లో ఓ ఆరేళ్ల చిన్నారి సురక్షితంగా బయటపడింది. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం.. శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే చిన్నారి కోలుకున్నాక తల్లిదండ్రుల కోసం అడిగితే ఏం చెప్పాలో తెలియట్లేదని ఆమె మామయ్య.. ఈటీవీ భారత్​తో తెలిపాడు.

15 మంది ప్రాణాలు కాపాడిన సాంకేతికత..
అలయా అపార్ట్​మెంట్​ కుప్పకూలిన తర్వాత శిథిలాల్లో చిక్కుకున్న ప్రజలను గుర్తించడం అధికారులకు కష్టంగా మారింది. దీంతో రోబోటిక్స్​ నిపుణుడు మిలింద్​రాజ్​ను అధికారులు పిలిపించారు. వెంటనే అతడు ఘటనాస్థలికి వచ్చి పరిశీలించాడు. ఆ తర్వాత అతడు తన ల్యాబ్​కు వెళ్లిపోయాడు. సుమారు మూడు గంటలపాటు కష్టపడి అధిక సెన్సిటివ్​ ఆడియో రిసీవర్​ను తయారు చేశాడు. అది చిన్నపాటి ధ్వనిని కూడా గుర్తించగలదు. అనంతరం ఆ రిసీవర్​ను తీసుకుని మిలింద్​ రాజ్ ఘటనాస్థలికి వచ్చాడు. చిక్కుకున్న వ్యక్తులను గట్టిగా అరవమని చెప్పాడు. అలా లొకేషన్​ను గుర్తించి బాధితులు ఎక్కడున్నారో చెప్పింది ఆ రిసీవర్​. దీంతో 15 మందిని కాపాడారు అధికారులు.

building-collapsed-in-lucknow-incident-of-people-of-alaya-apartment
శిథిలాలు

బిల్డర్​పై కేసు నమోదు..
బుధవారం ఉదయం ఘటనాస్థలికి డివిజినల్​ కమిషనర్​ డా.రోషన్​ జాకబ్​ చేరుకుని పరిశీలించారు. భవన యజమాని మహ్మద్​ తారిఖ్​, నవాజీశ్​ షాహిద్​తో పాటు బిల్డర్​ యజ్దాన్​పై కేసు నమోదు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. లఖ్​నవూలో ఇతర భవనాలను గుర్తించి దర్యాప్తు చేయాలని, అక్రమ నిర్మాణాలు జరిగితే వాటిని కూల్చివేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. నవాజీశ్​ను మంగళవారం అర్థరాత్రి మీరట్‌లోని అతడి నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ జరిగింది..
మంగళవారం సాయంత్రం 06.30 గంటల ప్రాంతంలో హజ్రత్​గంజ్​లోని నాలుగు అంతస్తుల అలయా అపార్ట్​మెంట్​ ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే స్థానికులు.. అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. అపార్ట్​మెంట్​లో 12 ఫ్లాట్లు ఉండగా.. 10 కుటుంబాలు నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సహాయక చర్యల దృశ్యాలు
అలయా అపార్ట్​మెంట్​లో సన్నంగా ఉన్న పిల్లర్లు

ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలోని హజ్రత్​గంజ్​ ప్రాంతంలో అలయా అపార్ట్​మెంట్​ కుప్పకూలిన ప్రాంతంలో 18 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్​ జరుగుతోంది. ఇప్పటివరకు 16 మందిని సురక్షితంగా కాపాడారు అధికారులు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు చనిపోయినట్లు సమాచారం. అయితే లఖ్​నవూ డెవలప్​మెంట్​ అథారిటీ నిర్లాక్ష్యానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోందని స్థానికులు అంటున్నారు. నాలుగు అంతస్తుల ఈ అపార్ట్​మెంట్​ పిల్లర్లను చాలా సన్నగా, నాసిరకంగా నిర్మించారని ఆరోపిస్తున్నారు. భవనం కూడా సరైన ప్రణాళిక లేకుండానే నిర్మించినట్లు చెబుతున్నారు.

సహాయక చర్యల దృశ్యాలు
సహాయక చర్యల దృశ్యాలు

తల్లి, భార్యను కోల్పోయిన ఎస్పీ నేత..
బుధవారం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్​లో శిథిలాల కింద చిక్కుకున్న సమాజ్​వాదీ పార్టీ నేత అబ్బాస్​ హైదర్​ భార్య బేగం హైదర్​, ఉజ్మాను అధికారులు బయటకు తీశారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. దీంతో అబ్బాస్​ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

'మొత్తం పోయింది.. కూతురికి పెళ్లి చేసదెలా?'
అపార్ట్​మెంట్​ కుప్పకూలిన ఘటనలో విద్యుత్​ శాఖ ఉద్యోగి రంజనా అవస్థి.. ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. ఈటీవీ భారత్​తో మాట్లాడారు. "నేను విద్యుత్​ శాఖలో ఉద్యోగం చేస్తున్నాను. ఈ ఏడాదే పదవీ విరమణ పొందుతున్నాను. మొత్తం సంపాదించినదంతా పోయింది. మరికొద్ది నెలల్లో కుమార్తె పెళ్లి చేద్దామనుకున్నాను. ఇప్పుడు ఇల్లు లేదు. డబ్బు లేదు. ఏం చేయాలో అర్ధం కావట్లేదు" అని రంజన వాపోయింది.

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17579122_wwww.jpg
సహాయక చర్యల దృశ్యాలు

శిథిలాల కింద తల్లిదండ్రులు.. ఆస్పత్రిలో ఆరేళ్ల చిన్నారి
రెస్క్యూ ఆపరేషన్​లో ఓ ఆరేళ్ల చిన్నారి సురక్షితంగా బయటపడింది. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం.. శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే చిన్నారి కోలుకున్నాక తల్లిదండ్రుల కోసం అడిగితే ఏం చెప్పాలో తెలియట్లేదని ఆమె మామయ్య.. ఈటీవీ భారత్​తో తెలిపాడు.

15 మంది ప్రాణాలు కాపాడిన సాంకేతికత..
అలయా అపార్ట్​మెంట్​ కుప్పకూలిన తర్వాత శిథిలాల్లో చిక్కుకున్న ప్రజలను గుర్తించడం అధికారులకు కష్టంగా మారింది. దీంతో రోబోటిక్స్​ నిపుణుడు మిలింద్​రాజ్​ను అధికారులు పిలిపించారు. వెంటనే అతడు ఘటనాస్థలికి వచ్చి పరిశీలించాడు. ఆ తర్వాత అతడు తన ల్యాబ్​కు వెళ్లిపోయాడు. సుమారు మూడు గంటలపాటు కష్టపడి అధిక సెన్సిటివ్​ ఆడియో రిసీవర్​ను తయారు చేశాడు. అది చిన్నపాటి ధ్వనిని కూడా గుర్తించగలదు. అనంతరం ఆ రిసీవర్​ను తీసుకుని మిలింద్​ రాజ్ ఘటనాస్థలికి వచ్చాడు. చిక్కుకున్న వ్యక్తులను గట్టిగా అరవమని చెప్పాడు. అలా లొకేషన్​ను గుర్తించి బాధితులు ఎక్కడున్నారో చెప్పింది ఆ రిసీవర్​. దీంతో 15 మందిని కాపాడారు అధికారులు.

building-collapsed-in-lucknow-incident-of-people-of-alaya-apartment
శిథిలాలు

బిల్డర్​పై కేసు నమోదు..
బుధవారం ఉదయం ఘటనాస్థలికి డివిజినల్​ కమిషనర్​ డా.రోషన్​ జాకబ్​ చేరుకుని పరిశీలించారు. భవన యజమాని మహ్మద్​ తారిఖ్​, నవాజీశ్​ షాహిద్​తో పాటు బిల్డర్​ యజ్దాన్​పై కేసు నమోదు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. లఖ్​నవూలో ఇతర భవనాలను గుర్తించి దర్యాప్తు చేయాలని, అక్రమ నిర్మాణాలు జరిగితే వాటిని కూల్చివేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. నవాజీశ్​ను మంగళవారం అర్థరాత్రి మీరట్‌లోని అతడి నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ జరిగింది..
మంగళవారం సాయంత్రం 06.30 గంటల ప్రాంతంలో హజ్రత్​గంజ్​లోని నాలుగు అంతస్తుల అలయా అపార్ట్​మెంట్​ ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే స్థానికులు.. అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. అపార్ట్​మెంట్​లో 12 ఫ్లాట్లు ఉండగా.. 10 కుటుంబాలు నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సహాయక చర్యల దృశ్యాలు
అలయా అపార్ట్​మెంట్​లో సన్నంగా ఉన్న పిల్లర్లు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.