ETV Bharat / bharat

సీఎంకు బాంబు బెదిరింపు.. ఆ రైల్వేస్టేషన్లలో కూడా పేలుళ్లు!

author img

By

Published : Apr 27, 2022, 9:51 PM IST

Bomb Threat to Bhagwant Mann: పంజాబ్​ ముఖ్యమంత్రి, అకాలీ దళ్​ నేతలు సహా పలు ప్రధాన ప్రాంతాల్లో బాంబు దాడులకు పాల్పడతామంటూ గుర్తుతెలియని వ్యక్తులు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ లేఖ సుల్తాన్​పుర్​ లోధీ రైల్వేస్టేషన్​ మాస్టర్​కు అందింది. ఇందుకు సంబంధించి దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు.

bomb threat
cm

Bomb Threat to Bhagwant Mann: పంజాబ్​ ముఖ్యమంత్రి భగవంత్​ మాన్​ సహా పలువురు అకాలీ దళ్​ నేతలపై బాంబు దాడికి పాల్పడతామంటూ ఓ లేఖ వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది. ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్​ ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. జలంధర్​ రైల్వేస్టేషన్​, సుల్తాన్​పుర్​ లోధీ రైల్వేస్టేషన్​తో పాటు మరికొన్ని ప్రధాన ప్రాంతాల్లో కూడా పేలుళ్లకు పాల్పడతామని లేఖలో పేర్కొన్నారు.

Bomb Threat to Bhagwant Mann
స్టేషన్​ మాస్టర్​కు అందిన లేఖ
Bomb Threat to Bhagwant Mann
అధికారులు స్వాధీనం చేసుకున్న లేఖ

ఈ లేఖ గురించి సుల్తాన్​పుర్​ లోధీ రైల్వే స్టేషన్​ మాస్టర్ రాజ్​వీర్​ సింగ్​ పోలీసులకు సమాచారం అందించారు. తనకు ఈ లేఖ పోస్ట్​ ద్వారా అందిందని.. దీనిని చదివిన తర్వాత వెంటనే అధికారులకు సమాచారం అందించానని పేర్కొన్నారు. ఈ లేఖలో మే 21 గురించి ప్రస్తావన రావడం వల్ల ఆ తేదీకి పేలుళ్లకు సంబంధం ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర దర్యాప్తును చేపడుతున్నామని వెల్లడించారు.

ఇదీ చూడండి : ముహుర్తం టైం దాటినా బరాత్​లో స్టెప్పులు.. వరుడ్ని చితకబాది, పెళ్లి క్యాన్సిల్!

Bomb Threat to Bhagwant Mann: పంజాబ్​ ముఖ్యమంత్రి భగవంత్​ మాన్​ సహా పలువురు అకాలీ దళ్​ నేతలపై బాంబు దాడికి పాల్పడతామంటూ ఓ లేఖ వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది. ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్​ ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. జలంధర్​ రైల్వేస్టేషన్​, సుల్తాన్​పుర్​ లోధీ రైల్వేస్టేషన్​తో పాటు మరికొన్ని ప్రధాన ప్రాంతాల్లో కూడా పేలుళ్లకు పాల్పడతామని లేఖలో పేర్కొన్నారు.

Bomb Threat to Bhagwant Mann
స్టేషన్​ మాస్టర్​కు అందిన లేఖ
Bomb Threat to Bhagwant Mann
అధికారులు స్వాధీనం చేసుకున్న లేఖ

ఈ లేఖ గురించి సుల్తాన్​పుర్​ లోధీ రైల్వే స్టేషన్​ మాస్టర్ రాజ్​వీర్​ సింగ్​ పోలీసులకు సమాచారం అందించారు. తనకు ఈ లేఖ పోస్ట్​ ద్వారా అందిందని.. దీనిని చదివిన తర్వాత వెంటనే అధికారులకు సమాచారం అందించానని పేర్కొన్నారు. ఈ లేఖలో మే 21 గురించి ప్రస్తావన రావడం వల్ల ఆ తేదీకి పేలుళ్లకు సంబంధం ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర దర్యాప్తును చేపడుతున్నామని వెల్లడించారు.

ఇదీ చూడండి : ముహుర్తం టైం దాటినా బరాత్​లో స్టెప్పులు.. వరుడ్ని చితకబాది, పెళ్లి క్యాన్సిల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.