ETV Bharat / bharat

ఎమ్మెల్యేగా ఓడినా సీఎం ఆయనే.. పుష్కర్​ సింగ్​కే ఉత్తరాఖండ్​ పగ్గాలు

author img

By

Published : Mar 21, 2022, 5:37 PM IST

Updated : Mar 21, 2022, 6:35 PM IST

Uttarakhand Chief minister: ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రిగా మళ్లీ పుష్కర్​ సింగ్​ ధామి బాధ్యతలు చేపట్టనున్నారు. దెహ్రాదూన్​లో జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు.

Uttarakhand Chief minister
పుష్కర్​ సింగ్​ ధామి

Uttarakhand Chief minister: ఉత్తరాఖండ్​ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే 11 రోజుల ఉత్కంఠకు తెరపడింది. పుష్కర్​ సింగ్​ ధామి మరోమారు పగ్గాలు అందుకోనున్నారు. సోమవారం సాయంత్రం దెహ్రాదూన్​లో జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా కలిసి ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి భాజపా కేంద్ర పరిశీలకులు రాజ్​నాథ్​ సింగ్​, మీనాక్షి లేఖీ, రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి ప్రహ్లాద్​ జోషి హాజరయ్యారు.

పుష్కర్​ సింగ్​ ధామి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఖటిమా నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ముఖ్యమంత్రి ఎంపికపై భాజపా అధిష్ఠానం సందిగ్ధంలో పడిపోయింది. పార్టీ విజయానికి ధామినే కారణమని, ఆయనకే పగ్గాలు అప్పగించాలని కొందరు నేతలు సూచించారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రి రేసులో పుష్కర్​ సింగ్ సహా ఎమ్మెల్యేలు సత్పాల్​ మహరాజ్​, ధన్​ సింగ్​ రావత్​, రాజ్యసభ ఎంపీ అనిల్​ బలుని, కేంద్ర మాజీ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​ నిశాంక, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్​ భట్​ పేర్లు తెరపైకి వచ్చాయి. చివరకు ధామికే జై కొట్టారు ఎమ్మెల్యేలు.

ఫిబ్రవరి 14న జరిగిన అసెంబ్లీ ఎన్నికలో 70 స్థానాలకు గానూ 47 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది భాజపా. వరుసగా రెండోసారి అధికారాన్ని ఛేజిక్కించుకుంది.

ఆ సెంటిమెంట్ మాత్రం మారలేదు..

  • ఉత్తరాఖండ్​లో ఐదేళ్లకోసారి పార్టీ మారిపోయే సంప్రదాయానికి భాజపా చెక్ పెట్టింది. వరుసగా రెండో దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అయితే, ముఖ్యమంత్రులు ఓటమిపాలయ్యే సంప్రదాయం మాత్రం మారలేదు. ప్రస్తుతం సీఎం పీఠంపై కూర్చున్న భాజపా నేత పుష్కర్ సింగ్ ధామి.. తన నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. పూర్తి కథన కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

ఇదీ చూడండి: మణిపుర్​ సీఎంగా బీరెన్​ సింగ్​ ప్రమాణ స్వీకారం

Uttarakhand Chief minister: ఉత్తరాఖండ్​ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే 11 రోజుల ఉత్కంఠకు తెరపడింది. పుష్కర్​ సింగ్​ ధామి మరోమారు పగ్గాలు అందుకోనున్నారు. సోమవారం సాయంత్రం దెహ్రాదూన్​లో జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా కలిసి ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి భాజపా కేంద్ర పరిశీలకులు రాజ్​నాథ్​ సింగ్​, మీనాక్షి లేఖీ, రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి ప్రహ్లాద్​ జోషి హాజరయ్యారు.

పుష్కర్​ సింగ్​ ధామి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఖటిమా నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ముఖ్యమంత్రి ఎంపికపై భాజపా అధిష్ఠానం సందిగ్ధంలో పడిపోయింది. పార్టీ విజయానికి ధామినే కారణమని, ఆయనకే పగ్గాలు అప్పగించాలని కొందరు నేతలు సూచించారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రి రేసులో పుష్కర్​ సింగ్ సహా ఎమ్మెల్యేలు సత్పాల్​ మహరాజ్​, ధన్​ సింగ్​ రావత్​, రాజ్యసభ ఎంపీ అనిల్​ బలుని, కేంద్ర మాజీ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​ నిశాంక, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్​ భట్​ పేర్లు తెరపైకి వచ్చాయి. చివరకు ధామికే జై కొట్టారు ఎమ్మెల్యేలు.

ఫిబ్రవరి 14న జరిగిన అసెంబ్లీ ఎన్నికలో 70 స్థానాలకు గానూ 47 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది భాజపా. వరుసగా రెండోసారి అధికారాన్ని ఛేజిక్కించుకుంది.

ఆ సెంటిమెంట్ మాత్రం మారలేదు..

  • ఉత్తరాఖండ్​లో ఐదేళ్లకోసారి పార్టీ మారిపోయే సంప్రదాయానికి భాజపా చెక్ పెట్టింది. వరుసగా రెండో దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అయితే, ముఖ్యమంత్రులు ఓటమిపాలయ్యే సంప్రదాయం మాత్రం మారలేదు. ప్రస్తుతం సీఎం పీఠంపై కూర్చున్న భాజపా నేత పుష్కర్ సింగ్ ధామి.. తన నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. పూర్తి కథన కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

ఇదీ చూడండి: మణిపుర్​ సీఎంగా బీరెన్​ సింగ్​ ప్రమాణ స్వీకారం

Last Updated : Mar 21, 2022, 6:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.