ETV Bharat / bharat

157 మంది అభ్యర్థులతో భాజపా 'బంగాల్'​ జాబితా

author img

By

Published : Mar 18, 2021, 5:49 PM IST

Updated : Mar 19, 2021, 1:43 AM IST

బంగాల్​ ఎన్నికల్లో పోటీ చేసే 157 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది భాజపా. ఇందులో పార్టీ ఉపాధ్యక్షుడు ముకుల్​రాయ్, రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు రాహుల్​ సిన్హా పేర్లు కూడా ఉన్నాయి.

BJP announces 148 candidates for West Bengal polls
148మంది అభ్యర్థులతో భాజపా 'బంగాల్'​ జాబితా

బంగాల్​ ఎన్నికల్లో బరిలో దిగబోయే 157 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది భారతీయ జనతా పార్టీ(భాజపా). ఈ మేరకు ఓ జాబితాను విడుదల చేసింది. పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ టీఎంసీ నేత ముకుల్​రాయ్​ ఉత్తర కృష్ణానగర్ నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన భాజపా.. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాహుల్​ సిన్హాకు హబ్రా అసెంబ్లీ సీటు కేటాయించింది.

వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు, సిట్టింగ్​ ఎంపీలకు ప్రాధాన్యమిచ్చే వ్యూహంతో ముందడుగేసింది భాజపా. హరింఘటా స్థానం నుంచి జానపద కళాకారుడు అశీమ్​ సర్కార్, పుర్బస్థలి ఉత్తర్​లో శాస్త్రవేత్త గోవర్ధన్​ దాస్​లను పోటీలో నిలుపుతున్నట్టు పేర్కొంది. ఐదుగురు సిట్టింగ్​ ఎంపీలను కూడా జాబితాలో చేర్చింది. అంతే కాకుండా కొత్తగా పార్టీలో చేరిన 22 మందిని తమ అభ్యర్థుల జాబితాలో చేర్చింది. మహిళలు సహా 17 మంది ముస్లిం అభర్యులకు అవకాశం కల్పించింది.

భాజపాలో చేరిన 'రామాయణ' సీరియల్​ నటుడు

ఈ జాబితా ప్రకటించడానికి ముందు.. ప్రముఖ రామాయణ సీరియల్​లో రాముని పాత్ర పోషించిన నటుడు అరుణ్​ గోవిల్​ భాజపాలో చేరారు. పార్టీ సీనియర్​ నాయకుల సమక్షంలో ఆయన కండువా కప్పుకున్నారు.

రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గానూ.. ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27న తొలి దశ పోలింగ్​ ప్రారంభం కానుంది. మే 2న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

ఇవీ చదవండి:

'డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేస్తున్న భాజపా'

మూడోసారి గెలిస్తే 'మోదీ'కి ప్రత్యామ్నాయంగా 'దీదీ'!

బంగాల్​ ఎన్నికల్లో బరిలో దిగబోయే 157 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది భారతీయ జనతా పార్టీ(భాజపా). ఈ మేరకు ఓ జాబితాను విడుదల చేసింది. పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ టీఎంసీ నేత ముకుల్​రాయ్​ ఉత్తర కృష్ణానగర్ నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన భాజపా.. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాహుల్​ సిన్హాకు హబ్రా అసెంబ్లీ సీటు కేటాయించింది.

వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు, సిట్టింగ్​ ఎంపీలకు ప్రాధాన్యమిచ్చే వ్యూహంతో ముందడుగేసింది భాజపా. హరింఘటా స్థానం నుంచి జానపద కళాకారుడు అశీమ్​ సర్కార్, పుర్బస్థలి ఉత్తర్​లో శాస్త్రవేత్త గోవర్ధన్​ దాస్​లను పోటీలో నిలుపుతున్నట్టు పేర్కొంది. ఐదుగురు సిట్టింగ్​ ఎంపీలను కూడా జాబితాలో చేర్చింది. అంతే కాకుండా కొత్తగా పార్టీలో చేరిన 22 మందిని తమ అభ్యర్థుల జాబితాలో చేర్చింది. మహిళలు సహా 17 మంది ముస్లిం అభర్యులకు అవకాశం కల్పించింది.

భాజపాలో చేరిన 'రామాయణ' సీరియల్​ నటుడు

ఈ జాబితా ప్రకటించడానికి ముందు.. ప్రముఖ రామాయణ సీరియల్​లో రాముని పాత్ర పోషించిన నటుడు అరుణ్​ గోవిల్​ భాజపాలో చేరారు. పార్టీ సీనియర్​ నాయకుల సమక్షంలో ఆయన కండువా కప్పుకున్నారు.

రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గానూ.. ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27న తొలి దశ పోలింగ్​ ప్రారంభం కానుంది. మే 2న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

ఇవీ చదవండి:

'డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేస్తున్న భాజపా'

మూడోసారి గెలిస్తే 'మోదీ'కి ప్రత్యామ్నాయంగా 'దీదీ'!

Last Updated : Mar 19, 2021, 1:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.