ETV Bharat / bharat

బీర్భుమ్​లో భారీగా నాటు​ బాంబులు.. భయంతో పారిపోతున్న జనం - Explosives recovered in Bengal

Birbhum killings: బంగాల్ బీర్భుమ్​లోని బోగ్​తుయ్ గ్రామంలో భారీగా నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. దీంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

Birbhum killings
Birbhum killings
author img

By

Published : Mar 27, 2022, 5:26 AM IST

Updated : Mar 27, 2022, 7:14 AM IST

Birbhum killings: బంగాల్ బీర్భుమ్​​ ఘటనను మరవకముందే బోగ్​తుయ్​ గ్రామంలో 40 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నాలుగు బకెట్లలో ఓ నిర్మాణంలో ఉన్న ఇంట్లో నాటు బాంబులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్లు బీర్భుమ్ ఎస్పీ నాగేంద్ర నాథ్ త్రిపాటి తెలిపారు.

40 crude bombs recovered
పోలీసులు స్వాధీనం చేసుకున్న బాంబులు

అంతకుముందు.. బంగాల్​లో బీర్భుమ్​ సజీవ దహనాల కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు చేపట్టింది. మార్చి 26నుంచి విచారణ ప్రారంభించింది. బీర్భుమ్​ హింసపై సీబీఐ విచారణ జరపాలని కోల్​కతా హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 7లోగా సీబీఐ నివేదిక సమర్పించాలని జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, జస్టిస్ ఆర్ భరద్వాజతో కూడిన ధర్మాసనం తెలిపింది.

బీర్భుమ్ ఘటన తర్వాత బోగ్​తుయ్ గ్రామంలోని ప్రజలు.. చుట్టుపక్కల గ్రామాలకు పారిపోతున్నారు. మళ్లీ ఇలాంటి హింసాత్మక ఘటనలు జరుగుతాయన్న భయంతో ఉన్నారు గ్రామస్థులు.

ఇదీ జరిగింది

బంగాల్​, రాంపుర్​హట్​ ప్రాంతంలో కొందరు దుండగులు ఇళ్లకు నిప్పుపెట్టగా ఇద్దరు చిన్నారులు సహా 8 మంది సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. "తృణమూల్​ కాంగ్రెస్​ నేత, బర్షాల్​ గ్రామ పంచాయతీ డిప్యూటీ చీఫ్​ బహదూర్​ షేక్​ను ఎవరో హత్యచేశారు. దీంతో రెచ్చిపోయిన ఆయన అనుచరులు.. రాంపుర్​హట్​లోని 5 ఇళ్లకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు" అని పోలీసులు తెలిపారు. హత్యకు ముందు బాధితులను తీవ్రంగా కొట్టి అనంతరం సజీవ దహనం చేసినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 20 మందిని అరెస్టు చేయగా.. నిర్లక్ష్యం వ్యవహరించిన పలువురు పోలీసులను సస్పెండ్‌ చేశారు.

ఇదీ చూడండి: సీబీఐ చేతికి బీర్భుమ్​ కేసు.. విచారణ షురూ

Birbhum killings: బంగాల్ బీర్భుమ్​​ ఘటనను మరవకముందే బోగ్​తుయ్​ గ్రామంలో 40 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నాలుగు బకెట్లలో ఓ నిర్మాణంలో ఉన్న ఇంట్లో నాటు బాంబులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్లు బీర్భుమ్ ఎస్పీ నాగేంద్ర నాథ్ త్రిపాటి తెలిపారు.

40 crude bombs recovered
పోలీసులు స్వాధీనం చేసుకున్న బాంబులు

అంతకుముందు.. బంగాల్​లో బీర్భుమ్​ సజీవ దహనాల కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు చేపట్టింది. మార్చి 26నుంచి విచారణ ప్రారంభించింది. బీర్భుమ్​ హింసపై సీబీఐ విచారణ జరపాలని కోల్​కతా హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 7లోగా సీబీఐ నివేదిక సమర్పించాలని జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, జస్టిస్ ఆర్ భరద్వాజతో కూడిన ధర్మాసనం తెలిపింది.

బీర్భుమ్ ఘటన తర్వాత బోగ్​తుయ్ గ్రామంలోని ప్రజలు.. చుట్టుపక్కల గ్రామాలకు పారిపోతున్నారు. మళ్లీ ఇలాంటి హింసాత్మక ఘటనలు జరుగుతాయన్న భయంతో ఉన్నారు గ్రామస్థులు.

ఇదీ జరిగింది

బంగాల్​, రాంపుర్​హట్​ ప్రాంతంలో కొందరు దుండగులు ఇళ్లకు నిప్పుపెట్టగా ఇద్దరు చిన్నారులు సహా 8 మంది సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. "తృణమూల్​ కాంగ్రెస్​ నేత, బర్షాల్​ గ్రామ పంచాయతీ డిప్యూటీ చీఫ్​ బహదూర్​ షేక్​ను ఎవరో హత్యచేశారు. దీంతో రెచ్చిపోయిన ఆయన అనుచరులు.. రాంపుర్​హట్​లోని 5 ఇళ్లకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు" అని పోలీసులు తెలిపారు. హత్యకు ముందు బాధితులను తీవ్రంగా కొట్టి అనంతరం సజీవ దహనం చేసినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 20 మందిని అరెస్టు చేయగా.. నిర్లక్ష్యం వ్యవహరించిన పలువురు పోలీసులను సస్పెండ్‌ చేశారు.

ఇదీ చూడండి: సీబీఐ చేతికి బీర్భుమ్​ కేసు.. విచారణ షురూ

Last Updated : Mar 27, 2022, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.