ETV Bharat / bharat

ప్రొఫెసర్ 'గాంధీగిరి'​.. రూ.24లక్షల జీతం వాపస్.. అదే కారణం!

author img

By

Published : Jul 7, 2022, 3:43 PM IST

ఓ ప్రొఫెసర్​ గాంధీగిరితో అందరి దృష్టిని ఆకర్షించారు. 33 నెలలకు జీతంగా తీసుకున్న రూ.24 లక్షలను యూనివర్సిటీకి తిరిగిచ్చేశారు. ఎవరాయన? ఎందుకిలా?

bihar professor news
bihar professor news

"కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఆన్‌లైన్‌ క్లాసులు జరిగినప్పటికీ హాజరైంది అరకొరా విద్యార్థులే. పాఠాలేమీ చెప్పలేకపోయాను" అంటూ తన 33 నెలల వేతనాన్ని తిరిగిచ్చేశారు ఓ కాలేజీ ప్రొఫెసర్‌. విద్యార్థులకు పాఠాలు బోధించకుండా జీతం తీసుకొనేందుకు తన మనస్సాక్షి అంగీకరించలేదంటూ దాదాపు రూ.24లక్షలను వెనక్కి ఇచ్చేశారు ప్రొఫెసర్​ లలన్‌ కుమార్‌. అయితే, తాజాగా జరిగిన బదిలీల్లో ఆయన కోరిన విధంగా చేయలేదనే కారణంతోనే ఇలా చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

బిహార్‌కు చెందిన 33 ఏళ్ల లలన్‌ కుమార్ ముజఫర్‌పుర్‌లోని ఓ ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్​గా పనిచేస్తున్నారు. ఈయన దిల్లీలోని జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ నుంచి హిందీలో మాస్టర్స్, దిల్లీ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ, ఎంఫిల్‌ చేశారు. చదువు పూర్తయిన తర్వాత ముజఫర్‌పుర్‌లోని నితీశ్వర్‌ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేశారు. ఇది బీఆర్‌ అంబేడ్కర్‌ బిహార్‌ యూనివర్శిటీ (బీఆర్‌ఏబీయూ) అనుబంధ కళాశాల. 2019 సెప్టెంబరులో లలన్‌ ఉద్యోగంలో చేరగా.. ఆ తర్వాత కొన్నాళ్లకే కరోనా వ్యాప్తి దృష్ట్యా లాక్‌డౌన్‌ రావడం వల్ల కాలేజీ మూతబడింది. ఆన్‌లైన్‌ క్లాసులు జరిగినప్పటికీ విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో లలన్‌ తన రెండేళ్ల తొమ్మిది నెలల వేతనాన్ని బీఆర్‌ఏబీయూ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌కు మంగళవారం తిరిగిచ్చేశారు.

ఈ సందర్భంగా లలన్‌ మాట్లాడుతూ.. "ఈ కాలేజీలో చేరినప్పటి నుంచి ఒక్కరోజు కూడా పూర్తిగా పాఠాలు బోధించలేకపోయాను. పాఠాలు చెప్పనప్పుడు జీతం తీసుకొనేందుకు నా అంతరాత్మ అంగీకరించలేదు. అందుకే వేతనాన్ని తిరిగిచ్చేశా" అని తెలిపారు. ఈ 33 నెలలకు రూ.23,82,228 వేతనాన్ని తీసుకోగా.. ఆ మొత్తాన్ని లలన్‌ చెక్కు రూపంలో తిరిగిచ్చారు. అతడి చర్యను బీఆర్‌ఏబీయూ రిజిస్ట్రార్‌ అభినందించారు.

అయితే లలన్‌పై విమర్శలు కూడా వస్తున్నాయి. ఆయన ఇటీవల పీజీ డిపార్ట్‌మెంట్‌లో బదిలీకి అభ్యర్థన పెట్టుకున్నారని, దీనిలో భాగంగానే యూనివర్శిటీపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ చర్యకు పాల్పడ్డాడని నితీశ్వర్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ ఆరోపించారు. అయితే, లలన్‌ క్లాసులకు విద్యార్థులు హాజరుకాకపోవడం వల్ల బీఆర్‌ఏబీయూ యూనివర్శిటీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రిన్సిపల్‌ను ఆదేశించినట్లు సమాచారం.

నితీశ్వర్‌ కాలేజీలో దాదాపు 3వేల మంది చదువుతుండగా.. ఇందులో 1100 మంది అండర్‌గ్రాడ్యుయేట్‌ విద్యార్థులున్నారు. లలన్‌ ఒక్కరే ఈ కాలేజీలో రెగ్యులర్‌ హిందీ టీచర్‌. ఆయనతో పాటు మరో గెస్ట్‌ లెక్చరర్‌ అప్పుడప్పుడు కళాశాలకు వస్తుంటారు.

ఇదీ చదవండి: అమ్మ, ఇద్దరు కూతుళ్లు.. ఒకేసారి బోర్డ్​ ఎగ్జామ్స్​ పాస్​

"కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఆన్‌లైన్‌ క్లాసులు జరిగినప్పటికీ హాజరైంది అరకొరా విద్యార్థులే. పాఠాలేమీ చెప్పలేకపోయాను" అంటూ తన 33 నెలల వేతనాన్ని తిరిగిచ్చేశారు ఓ కాలేజీ ప్రొఫెసర్‌. విద్యార్థులకు పాఠాలు బోధించకుండా జీతం తీసుకొనేందుకు తన మనస్సాక్షి అంగీకరించలేదంటూ దాదాపు రూ.24లక్షలను వెనక్కి ఇచ్చేశారు ప్రొఫెసర్​ లలన్‌ కుమార్‌. అయితే, తాజాగా జరిగిన బదిలీల్లో ఆయన కోరిన విధంగా చేయలేదనే కారణంతోనే ఇలా చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

బిహార్‌కు చెందిన 33 ఏళ్ల లలన్‌ కుమార్ ముజఫర్‌పుర్‌లోని ఓ ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్​గా పనిచేస్తున్నారు. ఈయన దిల్లీలోని జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ నుంచి హిందీలో మాస్టర్స్, దిల్లీ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ, ఎంఫిల్‌ చేశారు. చదువు పూర్తయిన తర్వాత ముజఫర్‌పుర్‌లోని నితీశ్వర్‌ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేశారు. ఇది బీఆర్‌ అంబేడ్కర్‌ బిహార్‌ యూనివర్శిటీ (బీఆర్‌ఏబీయూ) అనుబంధ కళాశాల. 2019 సెప్టెంబరులో లలన్‌ ఉద్యోగంలో చేరగా.. ఆ తర్వాత కొన్నాళ్లకే కరోనా వ్యాప్తి దృష్ట్యా లాక్‌డౌన్‌ రావడం వల్ల కాలేజీ మూతబడింది. ఆన్‌లైన్‌ క్లాసులు జరిగినప్పటికీ విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో లలన్‌ తన రెండేళ్ల తొమ్మిది నెలల వేతనాన్ని బీఆర్‌ఏబీయూ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌కు మంగళవారం తిరిగిచ్చేశారు.

ఈ సందర్భంగా లలన్‌ మాట్లాడుతూ.. "ఈ కాలేజీలో చేరినప్పటి నుంచి ఒక్కరోజు కూడా పూర్తిగా పాఠాలు బోధించలేకపోయాను. పాఠాలు చెప్పనప్పుడు జీతం తీసుకొనేందుకు నా అంతరాత్మ అంగీకరించలేదు. అందుకే వేతనాన్ని తిరిగిచ్చేశా" అని తెలిపారు. ఈ 33 నెలలకు రూ.23,82,228 వేతనాన్ని తీసుకోగా.. ఆ మొత్తాన్ని లలన్‌ చెక్కు రూపంలో తిరిగిచ్చారు. అతడి చర్యను బీఆర్‌ఏబీయూ రిజిస్ట్రార్‌ అభినందించారు.

అయితే లలన్‌పై విమర్శలు కూడా వస్తున్నాయి. ఆయన ఇటీవల పీజీ డిపార్ట్‌మెంట్‌లో బదిలీకి అభ్యర్థన పెట్టుకున్నారని, దీనిలో భాగంగానే యూనివర్శిటీపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ చర్యకు పాల్పడ్డాడని నితీశ్వర్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ ఆరోపించారు. అయితే, లలన్‌ క్లాసులకు విద్యార్థులు హాజరుకాకపోవడం వల్ల బీఆర్‌ఏబీయూ యూనివర్శిటీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రిన్సిపల్‌ను ఆదేశించినట్లు సమాచారం.

నితీశ్వర్‌ కాలేజీలో దాదాపు 3వేల మంది చదువుతుండగా.. ఇందులో 1100 మంది అండర్‌గ్రాడ్యుయేట్‌ విద్యార్థులున్నారు. లలన్‌ ఒక్కరే ఈ కాలేజీలో రెగ్యులర్‌ హిందీ టీచర్‌. ఆయనతో పాటు మరో గెస్ట్‌ లెక్చరర్‌ అప్పుడప్పుడు కళాశాలకు వస్తుంటారు.

ఇదీ చదవండి: అమ్మ, ఇద్దరు కూతుళ్లు.. ఒకేసారి బోర్డ్​ ఎగ్జామ్స్​ పాస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.