ETV Bharat / bharat

యోగా డే: ఈసారి సందడంతా నెట్టింట్లోనే!

author img

By

Published : Jun 20, 2020, 6:08 PM IST

అంతర్జాతీయ యోగా డే(జూన్​ 21) వేడుకలను ఈసారి పూర్తిగా డిజిటల్​ ప్లాట్​ఫాంలలోనే నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో సమూహాలుగా ఏర్పడకూడదని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. యోగా డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఇచ్చే సందేశం హైలైట్​ కానుంది.

Yoga Day to be marked on digital platforms amid COVID-19 pandemic
డిజిటల్​ ప్లాట్​ఫామ్​లలో యోగా డే వేడుకలు

కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ సారి అంతర్జాతీయ యోగా డే వేడుకలను పూర్తిగా డిజిటల్​ ప్లాట్​ఫాంలలోనే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. 2015 జూన్​ 21 నుంచి ఏటా ఘనంగా నిర్వహిస్తున్న యోగా దినోత్సవాన్ని ఈసారి ఇంట్లో కుటుంబ సభ్యులతోనే జరుపుకోవాలని ఇప్పటికే స్పష్టం చేసింది ఆయూష్​ మంత్రిత్వ శాఖ. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే 'యోగా ఎట్ హోం అండ్ యోగా విత్​ ఫ్యామిలీ' వేడుకల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది.

యోగా డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం హైలైట్​ కానుంది. ఇంట్లోనే వేడుకలు జరుపుకోవాలని ఆయన ఇప్పటికే సందేశమిచ్చారు.

యోగా డే ముఖ్యాంశాలు..

  • ప్రధాని మోదీ ఆదివారం ఉదయం 6:30 గంటలకు ప్రసంగిస్తారు.
  • ప్రసంగం అనంతరం 45 నిమిషాల పాటు యోగా సాధన కార్యక్రమంలో పాల్గొంటారు.
  • 2015 నుంచి ఏటా జూన్​ 21న ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
  • లేహ్​లో ఈసారి ఘనంగా వేడుకలు నిర్వహించాలని కేంద్రం భావించినప్పటికీ కరోనా కారణంగా రద్దయింది.
  • విదేశాల్లోని భారతీయ సంఘాలు యోగా డేను డిజిటల్, ఎలక్ట్రానిక్​ మీడియా వేదికగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
  • 2014 డిసెంబరు 11న యోగా డేను అధికారికంగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి జనరల్​ అసెంబ్లీ. మోదీ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది

యోగాపై అవగాహన పెంచేందుకు పోటీలు..

శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడే యోగాపై అవగాహన పెంచేందుకు 'మై లైఫ్​- మై యోగా' వీడియో బ్లాగింగ్ పోటీలను మోదీ చేతుల మీదుగా మే 31న ప్రారంభించింది భారత సాంస్కృతిక సంబంధాల సమాఖ్య. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాపై పోరాడేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని యోగా ద్వారా పెంచుకోవచ్చని తెలిపింది.

ఈ పోటీలను భారత్​లో, అంతర్జాతీయంగా నిర్వహిస్తున్నారు. ఒక్కో దేశంలో నిర్వహించిన పోటీ నుంచి ఒక్కో విజేతను ఎంపిక చేస్తారు. వారంతా అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొనాలి.

3 నిమిషాలు 3 ఆసనాలు

పోటీలో పాల్గొనేవారు 3 యోగాసనాలతో 3 నిమిషాల నిడివి గల వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలి. #MyLifeMyYogaINDIA హ్యాష్​ట్యాగ్ జత చేయాలి. యోగా ద్వారా తమ జీవితంలో వచ్చిన మార్పుపై సందేశమివ్వాలి.

యువత, పెద్దలు, యోగా వృత్తిలో ఉన్నవారికి మూడు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గెలుపొందిన మొదటి ముగ్గురు విజేతలకు 2500డాలర్లు, 1500డాలర్లు, 1000డాలర్లతో పాటు ట్రోఫీని బహుమతిగా ఇస్తారు.

భారత్​లో మొత్తం ఆరు విభాగాల్లో యోగా పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా రూ.లక్ష, రూ.50వేలు, రూ.25వేలు అందజేస్తారు . ఆదివారంతో పోటీదారులకు ఇచ్చిన గడువు ముగుస్తుంది. విజేతల పేర్లను జ్యూరీ ప్రకటిస్తుంది.

ఇదీ చూడండి:కరోనాకు డ్రగ్​ రిలీజ్​- ఒక్కో టాబ్లెట్ రూ.103

కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ సారి అంతర్జాతీయ యోగా డే వేడుకలను పూర్తిగా డిజిటల్​ ప్లాట్​ఫాంలలోనే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. 2015 జూన్​ 21 నుంచి ఏటా ఘనంగా నిర్వహిస్తున్న యోగా దినోత్సవాన్ని ఈసారి ఇంట్లో కుటుంబ సభ్యులతోనే జరుపుకోవాలని ఇప్పటికే స్పష్టం చేసింది ఆయూష్​ మంత్రిత్వ శాఖ. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే 'యోగా ఎట్ హోం అండ్ యోగా విత్​ ఫ్యామిలీ' వేడుకల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది.

యోగా డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం హైలైట్​ కానుంది. ఇంట్లోనే వేడుకలు జరుపుకోవాలని ఆయన ఇప్పటికే సందేశమిచ్చారు.

యోగా డే ముఖ్యాంశాలు..

  • ప్రధాని మోదీ ఆదివారం ఉదయం 6:30 గంటలకు ప్రసంగిస్తారు.
  • ప్రసంగం అనంతరం 45 నిమిషాల పాటు యోగా సాధన కార్యక్రమంలో పాల్గొంటారు.
  • 2015 నుంచి ఏటా జూన్​ 21న ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
  • లేహ్​లో ఈసారి ఘనంగా వేడుకలు నిర్వహించాలని కేంద్రం భావించినప్పటికీ కరోనా కారణంగా రద్దయింది.
  • విదేశాల్లోని భారతీయ సంఘాలు యోగా డేను డిజిటల్, ఎలక్ట్రానిక్​ మీడియా వేదికగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
  • 2014 డిసెంబరు 11న యోగా డేను అధికారికంగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి జనరల్​ అసెంబ్లీ. మోదీ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది

యోగాపై అవగాహన పెంచేందుకు పోటీలు..

శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడే యోగాపై అవగాహన పెంచేందుకు 'మై లైఫ్​- మై యోగా' వీడియో బ్లాగింగ్ పోటీలను మోదీ చేతుల మీదుగా మే 31న ప్రారంభించింది భారత సాంస్కృతిక సంబంధాల సమాఖ్య. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాపై పోరాడేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని యోగా ద్వారా పెంచుకోవచ్చని తెలిపింది.

ఈ పోటీలను భారత్​లో, అంతర్జాతీయంగా నిర్వహిస్తున్నారు. ఒక్కో దేశంలో నిర్వహించిన పోటీ నుంచి ఒక్కో విజేతను ఎంపిక చేస్తారు. వారంతా అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొనాలి.

3 నిమిషాలు 3 ఆసనాలు

పోటీలో పాల్గొనేవారు 3 యోగాసనాలతో 3 నిమిషాల నిడివి గల వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలి. #MyLifeMyYogaINDIA హ్యాష్​ట్యాగ్ జత చేయాలి. యోగా ద్వారా తమ జీవితంలో వచ్చిన మార్పుపై సందేశమివ్వాలి.

యువత, పెద్దలు, యోగా వృత్తిలో ఉన్నవారికి మూడు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గెలుపొందిన మొదటి ముగ్గురు విజేతలకు 2500డాలర్లు, 1500డాలర్లు, 1000డాలర్లతో పాటు ట్రోఫీని బహుమతిగా ఇస్తారు.

భారత్​లో మొత్తం ఆరు విభాగాల్లో యోగా పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా రూ.లక్ష, రూ.50వేలు, రూ.25వేలు అందజేస్తారు . ఆదివారంతో పోటీదారులకు ఇచ్చిన గడువు ముగుస్తుంది. విజేతల పేర్లను జ్యూరీ ప్రకటిస్తుంది.

ఇదీ చూడండి:కరోనాకు డ్రగ్​ రిలీజ్​- ఒక్కో టాబ్లెట్ రూ.103

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.