ETV Bharat / bharat

'నారీ శక్తి' అవార్డు గ్రహీతలతో నేడు మోదీ భేటీ

author img

By

Published : Mar 8, 2020, 5:29 AM IST

వివిధ రంగాల్లో ఎనలేని కృషి చేసి 'నారీ శక్తి' అవార్డు అందుకోబోతున్న మహిళలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మాటామంతి నిర్వహించనున్నారు. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని సామాజిక మాధ్యమాల ఖాతాల నిర్వహణను మహిళలకే అప్పగించనున్నట్లు వెల్లడించింది పీఎంఓ.

PM to interact with Nari Shakti awardees
'నారీ శక్తి' అవార్డు గ్రహీతలతో నేడు మోదీ భేటీ
'నారీ శక్తి' అవార్డు గ్రహీతలతో నేడు మోదీ భేటీ

'నారీ శక్తి' అవార్డు గ్రహీతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు భేటీ కానున్నారు. అలాగే.. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని ట్విట్టర్​ ఖాతాను వివిధ రంగాల్లో విజయవంతమైన మహిళలు నిర్వహిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది.

రాష్ట్రపతి భవన్​లో..

ఈరోజు ఉదయం రాష్ట్రపతి భవన్​లో నారీశక్తి అవార్డులను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రదానం చేస్తారు. ఆ కార్యక్రమం అనంతరం అవార్డు పొందిన మహిళలతో మోదీ మాటామంతి ఉంటుంది. మహిళా సాధికారత, వివిధ రంగాల్లో వారు సాధించిన విజయాలపై చర్చించనున్నారు ప్రధాని.

నారీ శక్తి అవార్డులను ప్రతి ఏటా వ్యక్తిగతంగా, బృందాలకు, మహిళా సాధికారత కోసం కృషి చేసే సంస్థలకు అందిస్తున్నారు.

నిర్వహణ మహిళలకే..

తన సామాజిక మాధ్యమాల ఖాతాలను నిర్వహించే పనిని మహిళలకు అప్పగిస్తానని గత మంగళవారం ప్రకటించారు ప్రధాని.

" ఈ మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా.. స్ఫూర్తిమంతమైన మహిళలకు నా సామాజిక మాధ్యమాల ఖాతాల నిర్వహణ బాధ్యతలు ఇవ్వనున్నా. అది లక్షలాది మందిలో ప్రేరణను కలిగించడానికి వారికి సహాయపడుతుంది "

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ప్రపంచ నాయకుల్లో ఒకరు..

ప్రధాని మోదీకి ఫేస్​బుక్​, ట్విట్టర్​, ఇన్​స్టాగ్రామ్​, యూట్యూబ్​ ఖాతాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్న నాయకుల్లో మోదీ ఒకరు. ఆయనను ట్విట్టర్​లో 53.5 మిలియన్లు, ఫేస్​బుక్​లో 44 మిలియన్లు, ఇన్​స్టాగ్రామ్​లో 35.2 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. దీంతో పాటు ప్రధాని కార్యాలయం నిర్వహించే ట్విట్టర్​ను 32 మిలియన్ల మంది ఫాలోఅవుతున్నారు.

'నారీ శక్తి' అవార్డు గ్రహీతలతో నేడు మోదీ భేటీ

'నారీ శక్తి' అవార్డు గ్రహీతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు భేటీ కానున్నారు. అలాగే.. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని ట్విట్టర్​ ఖాతాను వివిధ రంగాల్లో విజయవంతమైన మహిళలు నిర్వహిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది.

రాష్ట్రపతి భవన్​లో..

ఈరోజు ఉదయం రాష్ట్రపతి భవన్​లో నారీశక్తి అవార్డులను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రదానం చేస్తారు. ఆ కార్యక్రమం అనంతరం అవార్డు పొందిన మహిళలతో మోదీ మాటామంతి ఉంటుంది. మహిళా సాధికారత, వివిధ రంగాల్లో వారు సాధించిన విజయాలపై చర్చించనున్నారు ప్రధాని.

నారీ శక్తి అవార్డులను ప్రతి ఏటా వ్యక్తిగతంగా, బృందాలకు, మహిళా సాధికారత కోసం కృషి చేసే సంస్థలకు అందిస్తున్నారు.

నిర్వహణ మహిళలకే..

తన సామాజిక మాధ్యమాల ఖాతాలను నిర్వహించే పనిని మహిళలకు అప్పగిస్తానని గత మంగళవారం ప్రకటించారు ప్రధాని.

" ఈ మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా.. స్ఫూర్తిమంతమైన మహిళలకు నా సామాజిక మాధ్యమాల ఖాతాల నిర్వహణ బాధ్యతలు ఇవ్వనున్నా. అది లక్షలాది మందిలో ప్రేరణను కలిగించడానికి వారికి సహాయపడుతుంది "

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ప్రపంచ నాయకుల్లో ఒకరు..

ప్రధాని మోదీకి ఫేస్​బుక్​, ట్విట్టర్​, ఇన్​స్టాగ్రామ్​, యూట్యూబ్​ ఖాతాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్న నాయకుల్లో మోదీ ఒకరు. ఆయనను ట్విట్టర్​లో 53.5 మిలియన్లు, ఫేస్​బుక్​లో 44 మిలియన్లు, ఇన్​స్టాగ్రామ్​లో 35.2 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. దీంతో పాటు ప్రధాని కార్యాలయం నిర్వహించే ట్విట్టర్​ను 32 మిలియన్ల మంది ఫాలోఅవుతున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.