ETV Bharat / bharat

లోదుస్తుల్లో బంగారం అక్రమ రవాణా- మహిళ అరెస్ట్​

author img

By

Published : Sep 28, 2020, 6:38 PM IST

అధికారుల కళ్లుగప్పి విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చిన ఓ మహిళను కేరళలోని కన్నూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్​ అధికారులు అరెస్టు చేశారు. ఆమె లోదుస్తుల్లో దాచి తరలిస్తున్న 949 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

Woman arrested for smuggling gold through Kannur airport
లోదుస్తుల్లో బంగారం అక్రమ రవాణా- ఓ మహిళ అరెస్ట్​

కేరళలో బంగారం స్మగ్లింగ్​ కేసులు అధికమయ్యాయి. ఈ రోజు విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తోన్న ఓ మహిళను కన్నూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు కస్టమ్స్​ అధికారులు. ఆమె నుంచి రూ. 47.63 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కన్నూరు జిల్లాలోని చొక్లీ​కి చెందిన ఓ మహిళ... గో ఎయిర్​ విమానంలో దుబాయ్​ నుంచి కన్నూరు​కు చేరుకుంది. ఆమెపై అనుమానం వచ్చి, అధికారులు తనిఖీ చేయగా... లోదుస్తుల్లో మిశ్రమ రూపంలో 1170 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. దానిని స్వాధీనం చేసుకొని, వేరు చేయగా 949 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉన్నట్లు తేలిందని చెప్పారు.

ఇస్త్రీ పెట్టెలో 250 గ్రాములు

జెడ్డా నుంచి కేరళకు చేరుకున్న మరో ప్రయాణికుడి నుంచి రూ.12 లక్షల విలువైన 250 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కొచ్చి కస్టమ్స్​ అధికారులు తెలిపారు. ఇస్త్రీ పెట్టెలో ఉంచి బంగారం తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: బిహార్​ బరి: సం'కుల' సమరంలో గెలుపు ఎవరిది?

కేరళలో బంగారం స్మగ్లింగ్​ కేసులు అధికమయ్యాయి. ఈ రోజు విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తోన్న ఓ మహిళను కన్నూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు కస్టమ్స్​ అధికారులు. ఆమె నుంచి రూ. 47.63 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కన్నూరు జిల్లాలోని చొక్లీ​కి చెందిన ఓ మహిళ... గో ఎయిర్​ విమానంలో దుబాయ్​ నుంచి కన్నూరు​కు చేరుకుంది. ఆమెపై అనుమానం వచ్చి, అధికారులు తనిఖీ చేయగా... లోదుస్తుల్లో మిశ్రమ రూపంలో 1170 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. దానిని స్వాధీనం చేసుకొని, వేరు చేయగా 949 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉన్నట్లు తేలిందని చెప్పారు.

ఇస్త్రీ పెట్టెలో 250 గ్రాములు

జెడ్డా నుంచి కేరళకు చేరుకున్న మరో ప్రయాణికుడి నుంచి రూ.12 లక్షల విలువైన 250 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కొచ్చి కస్టమ్స్​ అధికారులు తెలిపారు. ఇస్త్రీ పెట్టెలో ఉంచి బంగారం తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: బిహార్​ బరి: సం'కుల' సమరంలో గెలుపు ఎవరిది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.