ETV Bharat / bharat

పిల్లలనే కనికరం లేకుండా మత్తుపదార్థాలిచ్చి.. - Woman arrested for molesting minor step daughter

తన భర్త మొదటి భార్య సంతానాలను వేధింపులకు గురిచేసింది ఓ మహిళ. అంతేకాకుండా వారందరికి మత్తు పదార్ధాలను అలవాటు చేసింది. పిల్లల ఫిర్యాదుతో ఈ విషయం బయటకు వచ్చింది. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఈ దారుణ ఘటనలో.. నిందితురాలిని అరెస్ట్​ చేశారు పోలీసులు.​

Woman arrested for molesting minor step daughter in Uttar Pradesh
కూతుర్ని వేధింపులకు గురిచేస్తన్న పినతల్లి అరెస్ట్​
author img

By

Published : Sep 7, 2020, 2:56 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. తన భర్త మొదటి భార్య సంతానాలను ప్రేమతో చూసుకోవాల్సింది పోయి.. వారికి మత్తు పదార్థాలు అలవాటు చేసింది ఓ మహిళ. పిల్లలనే జాలి కూడా లేకుండా కర్కశంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేసిన ఆమె.. ఇప్పుడు జైలు పాలైంది.

ఏం జరిగిందంటే...

అలీఘఢ్​​ జిల్లాకు చెందిన ఓ మహిళకు జితేంద్ర కుమార్​ శర్మ అనే వ్యక్తితో ఫేస్​బుక్​లో పరిచయం ఏర్పడింది. కొన్నేళ్ల కిందట తన భార్యను కోల్పోయిన అతడికి నలుగురు పిల్లలు(ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు) ఉన్నారు. తాను నర్సునని నమ్మించి జితేంద్రను పెళ్లి చేసుకుంది ఆ మహిళ. అలా అతడి కుటుంబంలోకి ప్రవేశించిన ఆమె.. పిల్లలను మత్తు పదార్థాలకు బానిస చేసింది. అనంతరం వారు అపస్మార స్థితిలోకి జారుకున్నాక.. పెద్దమ్మాయిని పలుమార్లు వేధింపులకు గురిచేసేది.

బాధితురాలు(పెద్ద కూతురు) పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల.. అసలు విషయం బయటపడింది. నిందితురాలిని అరెస్ట్​ చేసి పోలీసులు విచారణ చేపట్టగా.. ఆమెకు గతంలోనే ముగ్గురితో వివాహమైందని తేలింది. మైనర్​పై లైంగిక దాడులకు పాల్పడిన ఆ మహిళపై ఐపీసీ సెక్షన్​-354, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇదీ చదవండి: మురికి కాలువలో 25 ఆవుల మృతదేహాలు- ఏమైంది?

ఉత్తర్​ప్రదేశ్​లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. తన భర్త మొదటి భార్య సంతానాలను ప్రేమతో చూసుకోవాల్సింది పోయి.. వారికి మత్తు పదార్థాలు అలవాటు చేసింది ఓ మహిళ. పిల్లలనే జాలి కూడా లేకుండా కర్కశంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేసిన ఆమె.. ఇప్పుడు జైలు పాలైంది.

ఏం జరిగిందంటే...

అలీఘఢ్​​ జిల్లాకు చెందిన ఓ మహిళకు జితేంద్ర కుమార్​ శర్మ అనే వ్యక్తితో ఫేస్​బుక్​లో పరిచయం ఏర్పడింది. కొన్నేళ్ల కిందట తన భార్యను కోల్పోయిన అతడికి నలుగురు పిల్లలు(ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు) ఉన్నారు. తాను నర్సునని నమ్మించి జితేంద్రను పెళ్లి చేసుకుంది ఆ మహిళ. అలా అతడి కుటుంబంలోకి ప్రవేశించిన ఆమె.. పిల్లలను మత్తు పదార్థాలకు బానిస చేసింది. అనంతరం వారు అపస్మార స్థితిలోకి జారుకున్నాక.. పెద్దమ్మాయిని పలుమార్లు వేధింపులకు గురిచేసేది.

బాధితురాలు(పెద్ద కూతురు) పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల.. అసలు విషయం బయటపడింది. నిందితురాలిని అరెస్ట్​ చేసి పోలీసులు విచారణ చేపట్టగా.. ఆమెకు గతంలోనే ముగ్గురితో వివాహమైందని తేలింది. మైనర్​పై లైంగిక దాడులకు పాల్పడిన ఆ మహిళపై ఐపీసీ సెక్షన్​-354, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇదీ చదవండి: మురికి కాలువలో 25 ఆవుల మృతదేహాలు- ఏమైంది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.