ETV Bharat / bharat

అది కూటమిలో కూటమి: పాసవాన్​

author img

By

Published : Sep 13, 2020, 8:28 AM IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో కూటముల్లోని పార్టీల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. కూటములు అంటే అర్థాలు మారుతున్నాయి. కూటమిలో ఉంటూనే ఒకపార్టీకి మద్దతుగా, మరో పార్టీకి వ్యతిరేకించే విధానం అమలవుతోంది. ఎన్​డీఏలో ఇదే పరిస్థితి ఉందని లోక్​జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్​ పాసవాన్​ ఆరోపించారు. అది కూటమిలో కూటమి అని అభివర్ణించారు.

chirag-paswan
అది కూటమిలో కూటమి: పాసవాన్​

బిహార్​లో పార్టీల కూటములకు అర్థాలు మారుతున్నాయి. సాధారణంగా కూటమి అంటే అందులో ఉన్న అన్ని పార్టీలతో మిగిలిన పక్షాలన్నింటికీ సంబంధాలు ఉండడం. అయితే ఇక్కడ మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. కూటమిలో ఉంటూనే ఒక పార్టీకి మద్దతుగా ఉండడం, మరో పార్టీని వ్యతిరేకించటమనే విధానం అమలవుతోంది. ప్రస్తుతం ఎన్​డీఏలో ఇదే పరిస్థితి ఉందని లోక్​జనశక్తి పార్టీ(ఎల్​జేపీ) అధ్యకుడు, లోక్​సభ సభ్యుడు చిరాగ్​​ పాసవాన్​ చెప్పారు. ఇది కూటమిలో కూటమి అని అభివర్ణించారు.

అది కూటమిలో కూటమి: పాసవాన్​

ఎన్​డీఏలో జేడీ(యూ), భాజపా, ఎల్​జేపీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ కూటమే అధికారంలో కొనసాగుతోంది. అయితే జేడీ(యూ), ఎల్​జేపీల మధ్య సంబంధాలు లేవు. ఎల్​జేపీతో తాము ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదని జేడీ(యూ) చెబుతోంది. మరోవైపు నితీశ్​ ప్రభుత్వంపై ఎల్​జేపీ విమర్శలు చేస్తూనే ఉంది.

"రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతునే ఉంటాం. ప్రభుత్వం పని తీరు బాగాలేదు. ఎక్కడ శ్రద్ధ పెట్టాలో చెబుతూనే ఉంటాం. ఎన్​డీఏ కూటమిలో తమ పార్టీ అయిన ఎల్​జేపీ లేదని జేడీ(యూ) ప్రచారం చేస్తోంది. దీనిపై ఈనెల 16న జరిగే పార్టీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం."

- చిరాగ్​ పాసవాన్​, ఎల్​జేపీ అధ్యక్షుడు

చిరాగ్​ తండ్రి రాంవిలాస్​ పాసవాన్​ ప్రస్తుతం కేంద్ర మంత్రి కావడం గమనార్హం. భాజపా, ఎల్​జేపీల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. జేడీ(యూ)కు వ్యతిరేకంగా 143 స్థానాల్లో పోటీ చేయాలన్న వాదన కూడా పార్టీలో వినిపిస్తోంది.

నితీశ్​, నడ్డా చర్చలు

బిహార్​ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉండగా, సీట్ల సర్దుబాటుపై శనివారం జేడీ(యూ) భాజపాల మధ్య చర్చలు జరిగాయి. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలువురు ప్రముఖ నాయకులతో కలిసి పట్నా వెళ్లి ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​తో చర్చలు జరిపారు. జేడీ(యూ), ఎల్​జేపీల మధ్య ఉన్న విభేదాలు సమసిపోతాయని భాజపా నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: 'బిహార్​లో ఎన్​డీఏ పక్షాలన్నీ కలిసే పోటీ'

బిహార్​ పొత్తులపై ఎటూ తేల్చని ఎల్​జేపీ

బిహార్​లో పార్టీల కూటములకు అర్థాలు మారుతున్నాయి. సాధారణంగా కూటమి అంటే అందులో ఉన్న అన్ని పార్టీలతో మిగిలిన పక్షాలన్నింటికీ సంబంధాలు ఉండడం. అయితే ఇక్కడ మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. కూటమిలో ఉంటూనే ఒక పార్టీకి మద్దతుగా ఉండడం, మరో పార్టీని వ్యతిరేకించటమనే విధానం అమలవుతోంది. ప్రస్తుతం ఎన్​డీఏలో ఇదే పరిస్థితి ఉందని లోక్​జనశక్తి పార్టీ(ఎల్​జేపీ) అధ్యకుడు, లోక్​సభ సభ్యుడు చిరాగ్​​ పాసవాన్​ చెప్పారు. ఇది కూటమిలో కూటమి అని అభివర్ణించారు.

అది కూటమిలో కూటమి: పాసవాన్​

ఎన్​డీఏలో జేడీ(యూ), భాజపా, ఎల్​జేపీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ కూటమే అధికారంలో కొనసాగుతోంది. అయితే జేడీ(యూ), ఎల్​జేపీల మధ్య సంబంధాలు లేవు. ఎల్​జేపీతో తాము ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదని జేడీ(యూ) చెబుతోంది. మరోవైపు నితీశ్​ ప్రభుత్వంపై ఎల్​జేపీ విమర్శలు చేస్తూనే ఉంది.

"రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతునే ఉంటాం. ప్రభుత్వం పని తీరు బాగాలేదు. ఎక్కడ శ్రద్ధ పెట్టాలో చెబుతూనే ఉంటాం. ఎన్​డీఏ కూటమిలో తమ పార్టీ అయిన ఎల్​జేపీ లేదని జేడీ(యూ) ప్రచారం చేస్తోంది. దీనిపై ఈనెల 16న జరిగే పార్టీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం."

- చిరాగ్​ పాసవాన్​, ఎల్​జేపీ అధ్యక్షుడు

చిరాగ్​ తండ్రి రాంవిలాస్​ పాసవాన్​ ప్రస్తుతం కేంద్ర మంత్రి కావడం గమనార్హం. భాజపా, ఎల్​జేపీల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. జేడీ(యూ)కు వ్యతిరేకంగా 143 స్థానాల్లో పోటీ చేయాలన్న వాదన కూడా పార్టీలో వినిపిస్తోంది.

నితీశ్​, నడ్డా చర్చలు

బిహార్​ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉండగా, సీట్ల సర్దుబాటుపై శనివారం జేడీ(యూ) భాజపాల మధ్య చర్చలు జరిగాయి. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలువురు ప్రముఖ నాయకులతో కలిసి పట్నా వెళ్లి ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​తో చర్చలు జరిపారు. జేడీ(యూ), ఎల్​జేపీల మధ్య ఉన్న విభేదాలు సమసిపోతాయని భాజపా నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: 'బిహార్​లో ఎన్​డీఏ పక్షాలన్నీ కలిసే పోటీ'

బిహార్​ పొత్తులపై ఎటూ తేల్చని ఎల్​జేపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.