ETV Bharat / bharat

చైనా ఆర్మీనే కాల్పులు జరిపింది: భారత సైన్యం

author img

By

Published : Sep 8, 2020, 11:05 AM IST

Updated : Sep 8, 2020, 12:01 PM IST

indian army
భారత సైన్యం

11:50 September 08

సొంత సైన్యాన్ని బెదిరించేందుకు కాల్పులు..

సరిహద్దు వెంబడి చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని భారత సైన్యం తెలిపింది. వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులపై దౌత్య, సైనిక స్థాయి చర్చలు జరుగుతున్న వేళ.. పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ కాల్పులకు పాల్పడుతోందని పేర్కొంది. 

వాస్తవాధీన రేఖ వెంబడి సెప్టెంబర్​ 7న చైనా ముందుకు వచ్చే ప్రయత్నం చేసిందని భారత సైన్యం వెల్లడించింది. అయితే, మరింత ముందుకు వెళ్లేందుకు సొంత దళాలే నిరాకరించగా.. వారిని బెదిరించేందుకు గాల్లోకి కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారని స్పష్టం చేసింది. ఓ వైపు దుందుడుకు చర్యలకు పాల్పడుతూ ప్రపంచానికి అసత్యాలు వల్లివేస్తుందని భారత ఆర్మీ తెలిపింది.    

సరిహద్దుల్లో శాంతి, సామరస్యానికి కట్టుబడి ఉన్నట్లు భారత సైన్యం ప్రకటించింది. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని రక్షించుకుంటామని స్పష్టం చేసింది.  

11:19 September 08

  • సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా రెచ్చగొట్టే చర్యలు కొనసాగిస్తోంది: రక్షణ శాఖ
  • గత ఒప్పందం ప్రకారం భారత్‌ శాంతి, సామరస్యంగా ఉంటోంది: రక్షణ శాఖ
  • ఏ దశలోనూ భారత సైన్యం ఎల్‌ఏసీని అతిక్రమించలేదు: రక్షణ శాఖ
  • కాల్పులతో సహా ఎలాంటి దూకుడు ప్రదర్శించలేదు: రక్షణ శాఖ
  • చర్చల తరుణంలో ఒప్పందాలను చైనా ఉల్లంఘిస్తోంది: రక్షణ శాఖ
  • చైనా బలగాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి: రక్షణ శాఖ
  • భారత సైన్యాన్ని బెదిరించే ధోరణితో నిన్న చైనా కాల్పులకు తెగబడింది: రక్షణ శాఖ
  • చైనా సైన్యం రెచ్చగొట్టినా భారత సైన్యం సంయమనం పాటిస్తోంది: రక్షణ శాఖ
    భారత సైన్యం శాంతి, ప్రశాంతతను కాపాడటానికి కట్టుబడి ఉంది: రక్షణ శాఖ
  • జాతీయ సమగ్రత, సార్వభౌమత్వం విషయంలో ఉపేక్షించేది లేదు: రక్షణ శాఖ
    దుందుడుకు చర్యలకు పాల్పడుతూ ప్రపంచానికి చైనా అసత్యాలు చెబుతోంది: రక్షణ శాఖ
  • లద్దాఖ్‌, ఎల్ఏసీలో పరిస్థితులపై అధికారిక ప్రకటన విడుదల చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ

10:56 September 08

చైనా ఆర్మీనే కాల్పులు జరిపింది: భారత సైన్యం

సరిహద్దు వెంబడి చైనా దూకుడైన చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది భారత సైన్యం. వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులపై దౌత్య, సైనిక స్థాయి చర్చలు జరుగుతున్న వేళ.. పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ కాల్పులకు పాల్పడుతోందని తెలిపింది. 

భారత దళాలు సంయమనం పాటించాయని, చైనానే గాల్లో కాల్పులు జరిపినట్లు స్పష్టం చేసింది. సెప్టెంబర్​ 7న ఈ ఘటన జరిగినట్లు తెలిపింది.  

11:50 September 08

సొంత సైన్యాన్ని బెదిరించేందుకు కాల్పులు..

సరిహద్దు వెంబడి చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని భారత సైన్యం తెలిపింది. వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులపై దౌత్య, సైనిక స్థాయి చర్చలు జరుగుతున్న వేళ.. పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ కాల్పులకు పాల్పడుతోందని పేర్కొంది. 

వాస్తవాధీన రేఖ వెంబడి సెప్టెంబర్​ 7న చైనా ముందుకు వచ్చే ప్రయత్నం చేసిందని భారత సైన్యం వెల్లడించింది. అయితే, మరింత ముందుకు వెళ్లేందుకు సొంత దళాలే నిరాకరించగా.. వారిని బెదిరించేందుకు గాల్లోకి కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారని స్పష్టం చేసింది. ఓ వైపు దుందుడుకు చర్యలకు పాల్పడుతూ ప్రపంచానికి అసత్యాలు వల్లివేస్తుందని భారత ఆర్మీ తెలిపింది.    

సరిహద్దుల్లో శాంతి, సామరస్యానికి కట్టుబడి ఉన్నట్లు భారత సైన్యం ప్రకటించింది. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని రక్షించుకుంటామని స్పష్టం చేసింది.  

11:19 September 08

  • సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా రెచ్చగొట్టే చర్యలు కొనసాగిస్తోంది: రక్షణ శాఖ
  • గత ఒప్పందం ప్రకారం భారత్‌ శాంతి, సామరస్యంగా ఉంటోంది: రక్షణ శాఖ
  • ఏ దశలోనూ భారత సైన్యం ఎల్‌ఏసీని అతిక్రమించలేదు: రక్షణ శాఖ
  • కాల్పులతో సహా ఎలాంటి దూకుడు ప్రదర్శించలేదు: రక్షణ శాఖ
  • చర్చల తరుణంలో ఒప్పందాలను చైనా ఉల్లంఘిస్తోంది: రక్షణ శాఖ
  • చైనా బలగాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి: రక్షణ శాఖ
  • భారత సైన్యాన్ని బెదిరించే ధోరణితో నిన్న చైనా కాల్పులకు తెగబడింది: రక్షణ శాఖ
  • చైనా సైన్యం రెచ్చగొట్టినా భారత సైన్యం సంయమనం పాటిస్తోంది: రక్షణ శాఖ
    భారత సైన్యం శాంతి, ప్రశాంతతను కాపాడటానికి కట్టుబడి ఉంది: రక్షణ శాఖ
  • జాతీయ సమగ్రత, సార్వభౌమత్వం విషయంలో ఉపేక్షించేది లేదు: రక్షణ శాఖ
    దుందుడుకు చర్యలకు పాల్పడుతూ ప్రపంచానికి చైనా అసత్యాలు చెబుతోంది: రక్షణ శాఖ
  • లద్దాఖ్‌, ఎల్ఏసీలో పరిస్థితులపై అధికారిక ప్రకటన విడుదల చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ

10:56 September 08

చైనా ఆర్మీనే కాల్పులు జరిపింది: భారత సైన్యం

సరిహద్దు వెంబడి చైనా దూకుడైన చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది భారత సైన్యం. వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులపై దౌత్య, సైనిక స్థాయి చర్చలు జరుగుతున్న వేళ.. పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ కాల్పులకు పాల్పడుతోందని తెలిపింది. 

భారత దళాలు సంయమనం పాటించాయని, చైనానే గాల్లో కాల్పులు జరిపినట్లు స్పష్టం చేసింది. సెప్టెంబర్​ 7న ఈ ఘటన జరిగినట్లు తెలిపింది.  

Last Updated : Sep 8, 2020, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.