ETV Bharat / bharat

గ్వాలియర్ రాజా X డిగ్గీ రాజా: ఎవరు పులి?

author img

By

Published : Jul 3, 2020, 7:08 PM IST

Updated : Jul 3, 2020, 8:00 PM IST

జోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్... ఇద్దరూ రాజకీయాల్లో సీనియర్లు. ఒకప్పుడు ఒకే పార్టీలో కలిసి పనిచేసినవారు. ఇప్పుడు ప్రత్యర్థులు. అందుకే పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు. పంచ్ డైలాగులు పేల్చుకుంటూ రాజకీయాల్ని రసవత్తరంగా మార్చుతున్నారు.

mp politics
గ్వాలియర్ రాజా X డిగ్గీ రాజా: ఎవరు పులి?

మధ్యప్రదేశ్​ రాజకీయం 'పులి' చుట్టూ తిరుగుతోంది. పులి ఇతివృత్తంగా పంచ్​ డైలాగులతో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

జులై 2న రాష్ట్ర కేబినెట్ విస్తరణ సందర్భంగా భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియా 'పులి ఇంకా బతికే ఉంది' అని వ్యాఖ్యానించడం ఈ డైలాగ్​ వార్​కు దారితీసింది. ఇందుకు ప్రతిగా తమదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్​నాథ్.

ఇదీ జరిగింది..

మధ్యప్రదేశ్​ మంత్రివర్గ విస్తరణలో సింధియా వర్గానికి విశేష ప్రాధాన్యం లభించింది. ఆయన వర్గానికి చెందిన 12మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన సింధియా... కమల్​నాథ్, దిగ్విజయ్ సింగ్​పై తీవ్ర విమర్శలు చేశారు. 'పులి ఇంకా బతికే ఉంది' అని గుర్తుంచుకోవాలని వారిద్దరికీ సూచించారు.

  • मध्य प्रदेश के विकास, प्रगति, उन्नति और मेरे प्रदेशवासियों की रक्षा के लिए टाइगर अभी ज़िंदा है। pic.twitter.com/PEIi2vH7mj

    — Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'పులుల స్వభావం ఏమిటో తెలుసా'

సింధియా వ్యాఖ్యలపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. 'నీకు పులి స్వభావం తెలుసా? ఒక అడవిలో ఒకే పులి జీవిస్తుంది' అని ట్వీట్ చేశారు.

'జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా బతికి ఉండగా పులివేటపై నిషేధం లేదు. నాడు ఆయనతో కలిసి పులులను వేటాడే వాడిని. ఇందిరాగాంధీ ప్రభుత్వం పులుల వేటను నిషేధించాక కేవలం కెమెరాల్లోనే వాటిని బంధిస్తున్నా' అని వ్యాఖ్యానించారు డిగ్గీరాజా.

शेर का सही चरित्र आप जानते हैं? एक जंगल में एक ही शेर रहता है!! pic.twitter.com/i7PJzmPFAJ

— digvijaya singh (@digvijaya_28) July 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ఏ పులి.. కాగితమా, సర్కసా?'

సింధియా వ్యాఖ్యలపై స్పందించారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్. 'ఏ పులి బతికుంది? కాగితంతో చేసినదా? సర్కస్​లో ఫీట్లు చేసేదా?' అని ప్రశ్నించారు.

'కొంతమంది తమను తాము పులులుగా అభివర్ణించుకుంటారు. నేను పులిని కాదు. కాగితం పులిని అసలే కాదు. నేను మహారాజును కాదు. మామనూ కాదు' అని వ్యాఖ్యానించారు కమల్​నాథ్​.

మధ్యప్రదేశ్​ రాజకీయాల్లో సింధియాను మహారాజుగా, సీఎం చౌహాన్​ను మామ అని పిలుస్తారు.

  • मैं महाराजा नहीं हूं ,मैं मामा नहीं हूं , मैंने कभी चाय नहीं बेची , मैं तो बस कमलनाथ हूँ।

    कई लोग कहते हैं कि मैं टाइगर हूं।
    मैं तो ना टाइगर हूं , ना पेपर टाइगर हूं , अब यह तो प्रदेश की जनता तय करेगी , कौन क्या है ? pic.twitter.com/vv4Ldg1iDE

    — Office Of Kamal Nath (@OfficeOfKNath) July 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: 'ఆ మాటలు 130 కోట్ల మంది భారతీయులకు ధైర్యం'

మధ్యప్రదేశ్​ రాజకీయం 'పులి' చుట్టూ తిరుగుతోంది. పులి ఇతివృత్తంగా పంచ్​ డైలాగులతో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

జులై 2న రాష్ట్ర కేబినెట్ విస్తరణ సందర్భంగా భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియా 'పులి ఇంకా బతికే ఉంది' అని వ్యాఖ్యానించడం ఈ డైలాగ్​ వార్​కు దారితీసింది. ఇందుకు ప్రతిగా తమదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్​నాథ్.

ఇదీ జరిగింది..

మధ్యప్రదేశ్​ మంత్రివర్గ విస్తరణలో సింధియా వర్గానికి విశేష ప్రాధాన్యం లభించింది. ఆయన వర్గానికి చెందిన 12మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన సింధియా... కమల్​నాథ్, దిగ్విజయ్ సింగ్​పై తీవ్ర విమర్శలు చేశారు. 'పులి ఇంకా బతికే ఉంది' అని గుర్తుంచుకోవాలని వారిద్దరికీ సూచించారు.

  • मध्य प्रदेश के विकास, प्रगति, उन्नति और मेरे प्रदेशवासियों की रक्षा के लिए टाइगर अभी ज़िंदा है। pic.twitter.com/PEIi2vH7mj

    — Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'పులుల స్వభావం ఏమిటో తెలుసా'

సింధియా వ్యాఖ్యలపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. 'నీకు పులి స్వభావం తెలుసా? ఒక అడవిలో ఒకే పులి జీవిస్తుంది' అని ట్వీట్ చేశారు.

'జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా బతికి ఉండగా పులివేటపై నిషేధం లేదు. నాడు ఆయనతో కలిసి పులులను వేటాడే వాడిని. ఇందిరాగాంధీ ప్రభుత్వం పులుల వేటను నిషేధించాక కేవలం కెమెరాల్లోనే వాటిని బంధిస్తున్నా' అని వ్యాఖ్యానించారు డిగ్గీరాజా.

  • शेर का सही चरित्र आप जानते हैं? एक जंगल में एक ही शेर रहता है!! pic.twitter.com/i7PJzmPFAJ

    — digvijaya singh (@digvijaya_28) July 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ఏ పులి.. కాగితమా, సర్కసా?'

సింధియా వ్యాఖ్యలపై స్పందించారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్. 'ఏ పులి బతికుంది? కాగితంతో చేసినదా? సర్కస్​లో ఫీట్లు చేసేదా?' అని ప్రశ్నించారు.

'కొంతమంది తమను తాము పులులుగా అభివర్ణించుకుంటారు. నేను పులిని కాదు. కాగితం పులిని అసలే కాదు. నేను మహారాజును కాదు. మామనూ కాదు' అని వ్యాఖ్యానించారు కమల్​నాథ్​.

మధ్యప్రదేశ్​ రాజకీయాల్లో సింధియాను మహారాజుగా, సీఎం చౌహాన్​ను మామ అని పిలుస్తారు.

  • मैं महाराजा नहीं हूं ,मैं मामा नहीं हूं , मैंने कभी चाय नहीं बेची , मैं तो बस कमलनाथ हूँ।

    कई लोग कहते हैं कि मैं टाइगर हूं।
    मैं तो ना टाइगर हूं , ना पेपर टाइगर हूं , अब यह तो प्रदेश की जनता तय करेगी , कौन क्या है ? pic.twitter.com/vv4Ldg1iDE

    — Office Of Kamal Nath (@OfficeOfKNath) July 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: 'ఆ మాటలు 130 కోట్ల మంది భారతీయులకు ధైర్యం'

Last Updated : Jul 3, 2020, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.