ETV Bharat / bharat

మహాబలిపురం: మోదీ-జిన్​పింగ్​ భేటీ ముఖ్య ఉద్దేశమిదేనా? - what is the intention behind the meet between modi And xi jinping

భారత్​-చైనా దేశాధినేతల మధ్య రెండో అనధికారిక సమావేశానికి సర్వం సిద్ధమయింది. గతేడాది జరిగిన వుహాన్​ సదస్సు తర్వాత జరుగుతున్న ఈ భేటీపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న సదస్సులో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎలాంటి అజెండా లేని ఈ భేటీలో రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు, ప్రాంతీయ, ప్రాదేశిక, అంతర్జాతీయ అంశాలే ముఖ్య ఉద్దేశమని విశ్లేషకుల అంచనా..

మహాబలిపురం: మోదీ-జిన్​పింగ్​ భేటీ ముఖ్య ఉద్దేశమిదేనా?
author img

By

Published : Oct 10, 2019, 8:44 PM IST

Updated : Oct 10, 2019, 10:55 PM IST

మహాబలిపురం: మోదీ-జిన్​పింగ్​ భేటీ ముఖ్య ఉద్దేశమిదేనా?

అందరి దృష్టి మహాబలిపురం వైపే. రెండు రోజుల పాటు జరగనున్న కీలక భేటీపైనే అందరి చర్చ. ప్రపంచంలోనే బలమైన శక్తులుగా ఎదుగుతున్న రెండు దేశాల అధినేతలు సమావేశం కావటమే కాదు... ఇటీవల చోటుచేసుకున్న అనేక పరిణామాలు వీరి మాటామంతీపై అంచనాలు అమాంతం పెంచేశాయి. అధికారికంగా ఎలాంటి అజెండా లేకపోయినా.. ఈ చారిత్రక ఇష్టాగోష్ఠిలో చాలా విషయాలే చర్చకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ ఉన్నతస్థాయి సమావేశం గతేడాది జరిగిన వుహాన్​ భేటీ తరహాలోనే ప్రశాంతంగా ఫలవంతంగా సాగిపోవాలని ఇరుపక్షాలు కోరుకుంటున్నాయి. ఇరువురి నేతల అనధికార అజెండాపై దౌత్య వర్గాలు ఏం అభిప్రాయ పడుతున్నాయి? చర్చలు ఎలా సాగే అవకాశాలు ఉన్నాయి?

సర్వం సిద్ధం

భారత్‌ - చైనా దేశాధినేతల మధ్య కీలకమైన రెండవ ఇష్టాగోష్ఠికి సర్వం సిద్ధమైంది. దిల్లీ-బీజింగ్​ మధ్య మైత్రిబంధం కోసం మహాబలిపురం వేదికగా రెండు రోజుల పాటు ఈ సంప్రదింపులు జరగనున్నాయి. ఇరుదేశాల మధ్య సంబంధాలను పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభించటం, పరస్పర సహకారమే లక్ష్యంగా 2018 ఏప్రిల్‌లో వూహాన్‌లో మొదటి వ్యూహాత్మక భేటీ జరిగింది.

అదే స్ఫూర్తితో మలివిడత సమావేశానికి ఇరుదేశాల అధినేతలు సిద్ధమైనట్లు దౌత్యవర్గాలు చెబుతున్నాయి. కొంతకాలంగా ముఖ్య అంశాలపై ఇరుదేశాల మధ్య నెలకొన్న స్తబ్దతపైనా ఇక్కడ స్పష్టత రావొచ్చని చాలామంది ఆశిస్తున్నారు.

చర్చలో ఇవే ప్రధానాంశాలు!

అధికారికంగా ఇదీ అని అజెండా లేకపోవచ్చు. కానీ ప్రపంచంలోనే తిరుగులేని శక్తులుగా ఎదుగుతున్న రెండు దేశాల అధినేతలు భేటీ అంటే ఏమీ చర్చకు రాకుండా ఎందుకు ఉంటాయి? దౌత్య వర్గాల నుంచి ఉన్న సమాచారం ప్రకారమైతే... ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలపై ఇరువురి మధ్య ఏకాభిప్రాయ సాధనే మహాబలిపురం సమావేశం ముఖ్య ఉద్దేశం.

అభివృద్ధి కోణంలో రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటంపై పరస్పర సంప్రదింపులు జరగనున్నాయి. భారత్‌, చైనా విదేశాంగ మంత్రిత్వశాఖల ప్రకటనల సారాంశం కూడా అదే. కాకపోతే వూహాన్‌లానే ఇక్కడా ఎలాంటి ఒప్పందాలు, నిర్ణయాలైతే ఉండవు.

సమస్యలు.. పరిష్కారాలు

ద్వైపాక్షిక అంశాలతో పాటు వాణిజ్య సమతూకం, సరిహద్దు వివాదాల పరిష్కారం, పరస్పర విశ్వాసం పెంపొందించేందుకు కార్యాచరణ, అఫ్గానిస్థాన్, ఇండో-పసిఫిక్‌ విధానం, ఉగ్రవాదం, ఇతర అంతర్జాతీయ వాణిజ్యాంశాలు మోదీ - జిన్​పింగ్‌ భేటీలో ప్రధానంగా చర్చకు వస్తాయని సమాచారం. వీటికి సంబంధించి దేశాధినేతలతో పాటు ఉన్నత స్థాయి బృందం మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. అయితే ఇదంతా సాఫీగానే సాగిపోతుందా? ఒకరు చెప్పిన వాదనకు మరొకరు వెంటనే సరే అని తలూపుతారా అనేది వేచి చూడాల్సిన విషయం.

నిజానికి మిగిలినవి ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ మోదీ - జిన్​పింగ్​ భేటీ సందర్భంగా కశ్మీర్‌పై ఎవరి వైఖరి ఎలా ఉంటుందనే విషయంపై ఇంకాస్త ఎక్కువ ఆసక్తి నెలకొంది. కశ్మీర్‌పై ఆగస్టులో మోదీ సర్కారు తీసుకున్న చారిత్రక నిర్ణయంపై చైనా బహిరంగంగానే ప్రతికూల వైఖరి ప్రదర్శిస్తోంది.

ఆ నేపథ్యంలోనే దేశంలో అంతర్గతంగా తీసుకున్న నిర్ణయం ప్రభావం పొరుగు దేశంతో సంబంధాలపై పడకుండా చూసేందుకు ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని ప్రయత్నాలు జరిగాయి. విదేశీ వ్యవహారాల మంత్రి జయ్​శంకర్‌ చైనా పర్యటన చేపట్టారు. లద్దాఖ్‌లో పాలన నియంత్రణ భారత్​ చేతిలోనే ఉండాలనేది శాసన పరమైన నిర్ణయ లక్ష్యమని జయశంకర్‌ పేర్కొన్నారు.

మారని వైఖరి..

అయితే జయ్​శంకర్‌ చైనా పర్యటన, వివరణల తర్వాత కూడా కశ్మీర్‌ విషయంలో చైనా తన వైఖరి మార్చుకోలేదు. భారత్‌ చర్య ఆమోదనీయం కాదని, ఏకపక్షంగా దేశీయ చట్టంలో మార్పులు చేసుకోవడం ద్వారా తమ భౌగోళిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారని చైనా విదేశాంగ కార్యాలయం విమర్శించింది. తన చిరకాల స్నేహితుడు పాక్‌ కోసం ఐరాస భద్రతా మండలిలో కశ్మీర్‌ అంశాన్ని చర్చకు ప్రతిపాదించింది.

కాకపోతే బహిరంగ చర్చ కాకుండా, అంతర్గత సంప్రదింపులకే అనుమతి లభించింది. ఇటీవల చైనా స్టేట్‌ కౌన్సిలర్‌, విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ భారత్‌ను విస్మరించి మరీ పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడి రాజకీయ, సైనిక నేతలను కలిశారు.

అడ్డంకులను దాటుకుని...

ఈ తరుణంలోనే అసలు మహాబలిపురం భేటీ జరుగుతుందా లేదా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. కానీ అవన్నీ అధిగమించి సమావేశానికే మొగ్గుచూపారంటే వాటిని మించి... చర్చించాల్సిన విషయాలు ఉన్నాయనే అర్థం చేసుకోవచ్చు.

ఇదే సమయంలో కశ్మీర్‌ సమస్య భారత్‌, పాకిస్థాన్‌లే పరిష్కరించుకోవాలంటూ జిన్‌పింగ్‌ పర్యటనకు ముందుగా చైనా ప్రకటించింది. ఇటీవల ఐరాసలో ప్రస్తావించిన అంశాల జోలికి వెళ్లలేదు. అందుకే... కశ్మీర్‌ అంశంపై నెలకొన్న అనుమానపు నీడల్ని దాటుకుంటూ.. పాకిస్థాన్‌, సీమాంతర ఉగ్రవాదం అంశాలపై భిన్నాభిప్రాయాల్ని దాటి భారత్‌, చైనా సంబంధాల్లో ముందడుగేయటం ఇరుదేశాల ముందున్న అతిపెద్ద సవాల్‌.

ఇదీ చూడండి: మోదీ-జిన్​పింగ్ భేటీ కోసం అందంగా ముస్తాబైన మహాబలిపురం

మహాబలిపురం: మోదీ-జిన్​పింగ్​ భేటీ ముఖ్య ఉద్దేశమిదేనా?

అందరి దృష్టి మహాబలిపురం వైపే. రెండు రోజుల పాటు జరగనున్న కీలక భేటీపైనే అందరి చర్చ. ప్రపంచంలోనే బలమైన శక్తులుగా ఎదుగుతున్న రెండు దేశాల అధినేతలు సమావేశం కావటమే కాదు... ఇటీవల చోటుచేసుకున్న అనేక పరిణామాలు వీరి మాటామంతీపై అంచనాలు అమాంతం పెంచేశాయి. అధికారికంగా ఎలాంటి అజెండా లేకపోయినా.. ఈ చారిత్రక ఇష్టాగోష్ఠిలో చాలా విషయాలే చర్చకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ ఉన్నతస్థాయి సమావేశం గతేడాది జరిగిన వుహాన్​ భేటీ తరహాలోనే ప్రశాంతంగా ఫలవంతంగా సాగిపోవాలని ఇరుపక్షాలు కోరుకుంటున్నాయి. ఇరువురి నేతల అనధికార అజెండాపై దౌత్య వర్గాలు ఏం అభిప్రాయ పడుతున్నాయి? చర్చలు ఎలా సాగే అవకాశాలు ఉన్నాయి?

సర్వం సిద్ధం

భారత్‌ - చైనా దేశాధినేతల మధ్య కీలకమైన రెండవ ఇష్టాగోష్ఠికి సర్వం సిద్ధమైంది. దిల్లీ-బీజింగ్​ మధ్య మైత్రిబంధం కోసం మహాబలిపురం వేదికగా రెండు రోజుల పాటు ఈ సంప్రదింపులు జరగనున్నాయి. ఇరుదేశాల మధ్య సంబంధాలను పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభించటం, పరస్పర సహకారమే లక్ష్యంగా 2018 ఏప్రిల్‌లో వూహాన్‌లో మొదటి వ్యూహాత్మక భేటీ జరిగింది.

అదే స్ఫూర్తితో మలివిడత సమావేశానికి ఇరుదేశాల అధినేతలు సిద్ధమైనట్లు దౌత్యవర్గాలు చెబుతున్నాయి. కొంతకాలంగా ముఖ్య అంశాలపై ఇరుదేశాల మధ్య నెలకొన్న స్తబ్దతపైనా ఇక్కడ స్పష్టత రావొచ్చని చాలామంది ఆశిస్తున్నారు.

చర్చలో ఇవే ప్రధానాంశాలు!

అధికారికంగా ఇదీ అని అజెండా లేకపోవచ్చు. కానీ ప్రపంచంలోనే తిరుగులేని శక్తులుగా ఎదుగుతున్న రెండు దేశాల అధినేతలు భేటీ అంటే ఏమీ చర్చకు రాకుండా ఎందుకు ఉంటాయి? దౌత్య వర్గాల నుంచి ఉన్న సమాచారం ప్రకారమైతే... ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలపై ఇరువురి మధ్య ఏకాభిప్రాయ సాధనే మహాబలిపురం సమావేశం ముఖ్య ఉద్దేశం.

అభివృద్ధి కోణంలో రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటంపై పరస్పర సంప్రదింపులు జరగనున్నాయి. భారత్‌, చైనా విదేశాంగ మంత్రిత్వశాఖల ప్రకటనల సారాంశం కూడా అదే. కాకపోతే వూహాన్‌లానే ఇక్కడా ఎలాంటి ఒప్పందాలు, నిర్ణయాలైతే ఉండవు.

సమస్యలు.. పరిష్కారాలు

ద్వైపాక్షిక అంశాలతో పాటు వాణిజ్య సమతూకం, సరిహద్దు వివాదాల పరిష్కారం, పరస్పర విశ్వాసం పెంపొందించేందుకు కార్యాచరణ, అఫ్గానిస్థాన్, ఇండో-పసిఫిక్‌ విధానం, ఉగ్రవాదం, ఇతర అంతర్జాతీయ వాణిజ్యాంశాలు మోదీ - జిన్​పింగ్‌ భేటీలో ప్రధానంగా చర్చకు వస్తాయని సమాచారం. వీటికి సంబంధించి దేశాధినేతలతో పాటు ఉన్నత స్థాయి బృందం మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. అయితే ఇదంతా సాఫీగానే సాగిపోతుందా? ఒకరు చెప్పిన వాదనకు మరొకరు వెంటనే సరే అని తలూపుతారా అనేది వేచి చూడాల్సిన విషయం.

నిజానికి మిగిలినవి ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ మోదీ - జిన్​పింగ్​ భేటీ సందర్భంగా కశ్మీర్‌పై ఎవరి వైఖరి ఎలా ఉంటుందనే విషయంపై ఇంకాస్త ఎక్కువ ఆసక్తి నెలకొంది. కశ్మీర్‌పై ఆగస్టులో మోదీ సర్కారు తీసుకున్న చారిత్రక నిర్ణయంపై చైనా బహిరంగంగానే ప్రతికూల వైఖరి ప్రదర్శిస్తోంది.

ఆ నేపథ్యంలోనే దేశంలో అంతర్గతంగా తీసుకున్న నిర్ణయం ప్రభావం పొరుగు దేశంతో సంబంధాలపై పడకుండా చూసేందుకు ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని ప్రయత్నాలు జరిగాయి. విదేశీ వ్యవహారాల మంత్రి జయ్​శంకర్‌ చైనా పర్యటన చేపట్టారు. లద్దాఖ్‌లో పాలన నియంత్రణ భారత్​ చేతిలోనే ఉండాలనేది శాసన పరమైన నిర్ణయ లక్ష్యమని జయశంకర్‌ పేర్కొన్నారు.

మారని వైఖరి..

అయితే జయ్​శంకర్‌ చైనా పర్యటన, వివరణల తర్వాత కూడా కశ్మీర్‌ విషయంలో చైనా తన వైఖరి మార్చుకోలేదు. భారత్‌ చర్య ఆమోదనీయం కాదని, ఏకపక్షంగా దేశీయ చట్టంలో మార్పులు చేసుకోవడం ద్వారా తమ భౌగోళిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారని చైనా విదేశాంగ కార్యాలయం విమర్శించింది. తన చిరకాల స్నేహితుడు పాక్‌ కోసం ఐరాస భద్రతా మండలిలో కశ్మీర్‌ అంశాన్ని చర్చకు ప్రతిపాదించింది.

కాకపోతే బహిరంగ చర్చ కాకుండా, అంతర్గత సంప్రదింపులకే అనుమతి లభించింది. ఇటీవల చైనా స్టేట్‌ కౌన్సిలర్‌, విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ భారత్‌ను విస్మరించి మరీ పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడి రాజకీయ, సైనిక నేతలను కలిశారు.

అడ్డంకులను దాటుకుని...

ఈ తరుణంలోనే అసలు మహాబలిపురం భేటీ జరుగుతుందా లేదా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. కానీ అవన్నీ అధిగమించి సమావేశానికే మొగ్గుచూపారంటే వాటిని మించి... చర్చించాల్సిన విషయాలు ఉన్నాయనే అర్థం చేసుకోవచ్చు.

ఇదే సమయంలో కశ్మీర్‌ సమస్య భారత్‌, పాకిస్థాన్‌లే పరిష్కరించుకోవాలంటూ జిన్‌పింగ్‌ పర్యటనకు ముందుగా చైనా ప్రకటించింది. ఇటీవల ఐరాసలో ప్రస్తావించిన అంశాల జోలికి వెళ్లలేదు. అందుకే... కశ్మీర్‌ అంశంపై నెలకొన్న అనుమానపు నీడల్ని దాటుకుంటూ.. పాకిస్థాన్‌, సీమాంతర ఉగ్రవాదం అంశాలపై భిన్నాభిప్రాయాల్ని దాటి భారత్‌, చైనా సంబంధాల్లో ముందడుగేయటం ఇరుదేశాల ముందున్న అతిపెద్ద సవాల్‌.

ఇదీ చూడండి: మోదీ-జిన్​పింగ్ భేటీ కోసం అందంగా ముస్తాబైన మహాబలిపురం

RESTRICTION SUMMARY:  AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Besancon - 10 October 2019
1.  Besancon state prosecutor Etienne Manteaux arriving
2. SOUNDBITE (French) Etienne Manteaux, state prosecutor in Besancon:
"I, the Besancon prosecutor, transmitted to the General Prosecutor (in France) this extradition request, which was delivered today to the Justice Ministry, which will be passed along to the Foreign Ministry that will transfer it to the Chilean Foreign Ministry, and then on down to the Chilean Justice authorities, who will be responsible for deciding whether Mr Zepeda (Chilean national Nicolas Zepeda) can be extradited to France to go on trial."
3. Cutaway of old clock
4. SOUNDBITE (French) Etienne Manteaux, state prosecutor in Besancon:
"To go on trial for what? So for the killing of Narumi Kurosaki. The investigation at the start was opened on charges of murder, but also for kidnapping and sequestration. But in the end, these two charges were dropped because only the charge for murder is included in this request for extradition of Nicolas Zepeda."
5. Cutaway of books
SOUNDBITE (French) Etienne Manteaux, state prosecutor in Besancon:
"Chilean judicial authorities are bound by no international convention with France to determine whether this extradition request, this examination, can be honoured. So the Chileans have full latitude in the application of their rights to consider the opportunity, or not, to hand over Mr Zepeda to French judicial authorities, specifically the Besancon prosecutor's office."
STORYLINE:
A French prosecutor said he has formally sent an extradition request to Chilean authorities with regard to Chilean national Nicolas Zepeda who is accused of murder in France.  
Zepeda is the sole suspect in the killing of Japanese student Narumi Kurosaki, his ex-girlfriend, who vanished from her university residence in Besancon, France in 2016.
During a press conference in Bescancon, France on Thursday, the prosecutor said the request for extradition was for the charge of murder and the charges of kidnap and sequestration had been dropped.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 10, 2019, 10:55 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.