ETV Bharat / bharat

మంత్రి కుమార్తె వివాహం ఖర్చు అన్ని వందల కోట్లా?

కర్ణాటక మంత్రి బి. శ్రీరాములు కుమార్తె వివాహం మార్చి 5న అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బెంగళూరులో ప్యాలెస్ గ్రౌండ్స్ వేదికగా జరగనున్న ఈ భారీ వివాహ వేడుకకు ఏకంగా రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్​షా సహా రాజకీయ, సినీ ప్రముఖులు హాజరుకానున్న ఈ పెళ్లికి సంబంధించిన మరిన్ని విశేషాలు..

author img

By

Published : Mar 3, 2020, 3:30 PM IST

Updated : Mar 3, 2020, 10:37 PM IST

sriramulu
మంత్రి కుమార్తె వివాహం ఖర్చు ఎన్ని వందల కోట్లంటే..!
మంత్రి కుమార్తె వివాహం ఖర్చు ఎన్ని వందల కోట్లంటే..!

కర్ణాటక మంత్రి బి. శ్రీరాములు కుమార్తె వివాహం మార్చి 5న జరగనుంది. ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

హైదరాబాద్​కు చెందిన పారిశ్రామికవేత్త రవికుమార్​ను శ్రీరాములు కుమార్తె రక్షిత పెళ్లి చేసుకోనున్నారు. ఫిబ్రవరి 27నుంచి 9 రోజులపాటు నిర్వహిస్తున్న ఈ వివాహ వేడుకలో నేడు మెహందీ కార్యక్రమం జరుగుతోంది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ భారీ పెళ్లికి మంత్రి రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్​షా, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప వంటి రాజకీయ, సినీ ప్రముఖులు సహా లక్షమందికి పైగా ఈ వివాహానికి హాజరుకానున్నారు. అట్టహాసంగా.. భూమిపైనే స్వర్గముందా అన్న రీతిలో జరుగుతున్న ఈ వివాహానికి ఉన్న ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు.

పెళ్లి కార్డు ప్రత్యేక ఆకర్షణ

వివాహ ఆహ్వాన పత్రికను ఎంతో ప్రత్యేకంగా రూపొందించారు. 'ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలి' అనే ఇతివృత్తంతో ఈ పెళ్లికార్డును తీర్చిదిద్దారు. పసుపు కుంకుమ, సింధూరం, యాలకులతో ఆహ్వాన పత్రికను అలంకరించారు.

40 ఎకరాల విస్తీర్ణం..

బెంగళూరులోని 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్యాలెస్ గ్రౌండ్స్​లో ఈ వివాహం జరగనుంది. హంపీలోని విరుపాక్ష ఆలయాన్ని పోలిన సెట్​ను ఈ తంతు కోసం ప్రత్యేకంగా వేస్తున్నారు. ఇది నాలుగు ఎకరాల మేర ఉండనుంది. దేశ, విదేశాల నుంచి తెప్పించిన పువ్వులతో వివాహ ప్రాంగణాన్ని అలంకరిస్తున్నారు. ఇందుకోసం 2వందల మంది నిపుణులు శ్రమిస్తున్నారు. బాలీవుడ్​, కర్ణాటకకు చెందిన కళాదర్శకుల నేతృత్వంలో పెళ్లి సెట్​ను ఏర్పాటు చేస్తున్నారు.

అంబానీ ఫొటోగ్రాఫర్లు..

దీపిక పదుకొణె పెళ్లికి పనిచేసిన ఆర్టిస్టులు పెళ్లికుమార్తెకు మేకప్​ చేయనున్నారు. ప్రముఖ డిజైనర్ సానియా సర్దారియా పెళ్లికుమార్తె దుస్తులను రూపొందించారు. ముఖేశ్ అంబానీ కుమార్తె వివాహానికి ఫొటోగ్రాఫర్లుగా పనిచేసిన జయరామన్ పిళ్లై టీమ్ వీడియోలు తీయనున్నారు.

పెళ్లి కుమారుడిని తీసుకొచ్చే వరపూజ కార్యక్రమానికి పాలెస్ గ్రౌండ్స్​లో ప్రత్యేక సెట్​ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కన్నడ డాన్స్ మాస్టర్లు గురుకిరణ్, అఖిల పాజిమన్ను, సుహానా సయీద్ నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు.

వంటవాళ్లు వెయ్యిమంది..

పెళ్లిలో వంటలు చేసేందుకు వెయ్యిమంది నిపుణులను పిలిపిస్తున్నారు. ఇప్పటికే 7వేలమంది కూర్చునే సామర్థ్యమున్న డైనింగ్​ హాల్​ను సిద్ధం చేశారు. ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన ప్రత్యేక వంటలను ఈ భారీ వివాహ వేడుకలో వడ్డించనున్నారు.

ఇదీ చూడండి: దిల్లీలో బయటపడ్డ నకిలీ జీఎస్టీ బిల్లుల రాకెట్​

మంత్రి కుమార్తె వివాహం ఖర్చు ఎన్ని వందల కోట్లంటే..!

కర్ణాటక మంత్రి బి. శ్రీరాములు కుమార్తె వివాహం మార్చి 5న జరగనుంది. ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

హైదరాబాద్​కు చెందిన పారిశ్రామికవేత్త రవికుమార్​ను శ్రీరాములు కుమార్తె రక్షిత పెళ్లి చేసుకోనున్నారు. ఫిబ్రవరి 27నుంచి 9 రోజులపాటు నిర్వహిస్తున్న ఈ వివాహ వేడుకలో నేడు మెహందీ కార్యక్రమం జరుగుతోంది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ భారీ పెళ్లికి మంత్రి రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్​షా, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప వంటి రాజకీయ, సినీ ప్రముఖులు సహా లక్షమందికి పైగా ఈ వివాహానికి హాజరుకానున్నారు. అట్టహాసంగా.. భూమిపైనే స్వర్గముందా అన్న రీతిలో జరుగుతున్న ఈ వివాహానికి ఉన్న ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు.

పెళ్లి కార్డు ప్రత్యేక ఆకర్షణ

వివాహ ఆహ్వాన పత్రికను ఎంతో ప్రత్యేకంగా రూపొందించారు. 'ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలి' అనే ఇతివృత్తంతో ఈ పెళ్లికార్డును తీర్చిదిద్దారు. పసుపు కుంకుమ, సింధూరం, యాలకులతో ఆహ్వాన పత్రికను అలంకరించారు.

40 ఎకరాల విస్తీర్ణం..

బెంగళూరులోని 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్యాలెస్ గ్రౌండ్స్​లో ఈ వివాహం జరగనుంది. హంపీలోని విరుపాక్ష ఆలయాన్ని పోలిన సెట్​ను ఈ తంతు కోసం ప్రత్యేకంగా వేస్తున్నారు. ఇది నాలుగు ఎకరాల మేర ఉండనుంది. దేశ, విదేశాల నుంచి తెప్పించిన పువ్వులతో వివాహ ప్రాంగణాన్ని అలంకరిస్తున్నారు. ఇందుకోసం 2వందల మంది నిపుణులు శ్రమిస్తున్నారు. బాలీవుడ్​, కర్ణాటకకు చెందిన కళాదర్శకుల నేతృత్వంలో పెళ్లి సెట్​ను ఏర్పాటు చేస్తున్నారు.

అంబానీ ఫొటోగ్రాఫర్లు..

దీపిక పదుకొణె పెళ్లికి పనిచేసిన ఆర్టిస్టులు పెళ్లికుమార్తెకు మేకప్​ చేయనున్నారు. ప్రముఖ డిజైనర్ సానియా సర్దారియా పెళ్లికుమార్తె దుస్తులను రూపొందించారు. ముఖేశ్ అంబానీ కుమార్తె వివాహానికి ఫొటోగ్రాఫర్లుగా పనిచేసిన జయరామన్ పిళ్లై టీమ్ వీడియోలు తీయనున్నారు.

పెళ్లి కుమారుడిని తీసుకొచ్చే వరపూజ కార్యక్రమానికి పాలెస్ గ్రౌండ్స్​లో ప్రత్యేక సెట్​ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కన్నడ డాన్స్ మాస్టర్లు గురుకిరణ్, అఖిల పాజిమన్ను, సుహానా సయీద్ నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు.

వంటవాళ్లు వెయ్యిమంది..

పెళ్లిలో వంటలు చేసేందుకు వెయ్యిమంది నిపుణులను పిలిపిస్తున్నారు. ఇప్పటికే 7వేలమంది కూర్చునే సామర్థ్యమున్న డైనింగ్​ హాల్​ను సిద్ధం చేశారు. ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన ప్రత్యేక వంటలను ఈ భారీ వివాహ వేడుకలో వడ్డించనున్నారు.

ఇదీ చూడండి: దిల్లీలో బయటపడ్డ నకిలీ జీఎస్టీ బిల్లుల రాకెట్​

Last Updated : Mar 3, 2020, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.