ETV Bharat / bharat

భాజపాకే వ్యతిరేకం.. భారత్​కు కాదు: ఫరూక్​

author img

By

Published : Oct 24, 2020, 6:42 PM IST

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి లక్ష్యంగా అక్కడి పార్టీలు ఏకతాటిపైకి వస్తున్నాయి. గతేడాది ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్​ 370ని పునరుద్ధరించాలని అందరూ పోరాటం చేయనున్నారు. ప్రజాకూటమిగా ఏర్పడి, భేటీ అయిన అనంతరం నేషనల్​ కాన్ఫరెన్స్​ అధ్యక్షుడు ఫరూక్​ అబ్దుల్లా.. సమావేశం గురించి మాట్లాడారు. తాము భాజపాకే వ్యతిరేకం తప్ప భారత్​కు కాదని స్పష్టం చేశారు.

farooq abdullah latestnews
భాజపాకే వ్యతిరేకం.. భారత్​కు కాదు: ఫరూక్​

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్‌ 370 పునరుద్ధరణకు పోరాటం చేయాలని భాజపాయేతర పార్టీలు నిర్ణయించాయి. పీపుల్స్​ అలయన్స్​ ఫర్​ గుప్కర్​ డిక్లరేషన్​(పీఏజీడీ) పేరిట ప్రజా కూటమిగా ఏర్పడిన నేతలు.. తొలిసారి శ్రీనగర్‌లోని జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ నివాసంలో సమావేశమయ్యారు. ఆర్టికల్‌ 370 రద్దుకు సంబంధించి భాజపా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు.. నెలరోజుల్లో ఓ పత్రం‌ విడుదల చేయాలని నిర్ణయించారు.

తమ కూటమి భాజపాకు వ్యతిరేకమే తప్ప భారత్​కు కాదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా స్పష్టంచేశారు.

"ప్రజాకూటమిపై భాజపా తప్పుడు ప్రచారం చేస్తోంది. జాతి వ్యతిరేకం అంటూ మాట్లాడుతోంది. అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా. వారి ఆరోపణలు అవాస్తవం. ఈ ప్రజాకూటమి దేశానికి వ్యతిరేకం కాదు కానీ భాజపాకు మాత్రం తప్పకుండా వ్యతిరేకమే. అందులో అనుమానమే లేదు. ఈ ప్రాంత రాజ్యాంగాన్ని రద్దుచేశారు. గత ఏడాది ఆగస్టు 5న దేశ విభజనకు, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు ప్రయత్నం చేశారు. జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రజలు కోల్పోయిన హక్కులు తిరిగి దక్కాలన్నదే మా లక్ష్యం. అందుకోసం పోరాడతాం."

-- ఫరూక్‌ అబ్దుల్లా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు

కూటమి నేతలంతా నవంబర్​ 17న మరోసారి శ్రీనగర్​లో సమావేశం కానున్నారు.

ఆలయంలో ఫరూక్​

సమావేశానికి ముందు శ్రీనగర్​లోని 'దుర్గా నాగ్'​ ఆలయాన్ని సందర్శించారు ఫరూక్​. అక్కడ ఉన్న స్థానికులతో కలిసి కాసేపు మాట్లాడారు.

Farooq Abdullah after meeting of PAGD
ఆలయం బయట స్థానికులతో ఫరూక్​
Farooq Abdullah after meeting of PAGD
ఫరూక్​ అబ్దుల్లా

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్‌ 370 పునరుద్ధరణకు పోరాటం చేయాలని భాజపాయేతర పార్టీలు నిర్ణయించాయి. పీపుల్స్​ అలయన్స్​ ఫర్​ గుప్కర్​ డిక్లరేషన్​(పీఏజీడీ) పేరిట ప్రజా కూటమిగా ఏర్పడిన నేతలు.. తొలిసారి శ్రీనగర్‌లోని జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ నివాసంలో సమావేశమయ్యారు. ఆర్టికల్‌ 370 రద్దుకు సంబంధించి భాజపా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు.. నెలరోజుల్లో ఓ పత్రం‌ విడుదల చేయాలని నిర్ణయించారు.

తమ కూటమి భాజపాకు వ్యతిరేకమే తప్ప భారత్​కు కాదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా స్పష్టంచేశారు.

"ప్రజాకూటమిపై భాజపా తప్పుడు ప్రచారం చేస్తోంది. జాతి వ్యతిరేకం అంటూ మాట్లాడుతోంది. అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా. వారి ఆరోపణలు అవాస్తవం. ఈ ప్రజాకూటమి దేశానికి వ్యతిరేకం కాదు కానీ భాజపాకు మాత్రం తప్పకుండా వ్యతిరేకమే. అందులో అనుమానమే లేదు. ఈ ప్రాంత రాజ్యాంగాన్ని రద్దుచేశారు. గత ఏడాది ఆగస్టు 5న దేశ విభజనకు, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు ప్రయత్నం చేశారు. జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రజలు కోల్పోయిన హక్కులు తిరిగి దక్కాలన్నదే మా లక్ష్యం. అందుకోసం పోరాడతాం."

-- ఫరూక్‌ అబ్దుల్లా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు

కూటమి నేతలంతా నవంబర్​ 17న మరోసారి శ్రీనగర్​లో సమావేశం కానున్నారు.

ఆలయంలో ఫరూక్​

సమావేశానికి ముందు శ్రీనగర్​లోని 'దుర్గా నాగ్'​ ఆలయాన్ని సందర్శించారు ఫరూక్​. అక్కడ ఉన్న స్థానికులతో కలిసి కాసేపు మాట్లాడారు.

Farooq Abdullah after meeting of PAGD
ఆలయం బయట స్థానికులతో ఫరూక్​
Farooq Abdullah after meeting of PAGD
ఫరూక్​ అబ్దుల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.