ETV Bharat / bharat

నమస్తే ట్రంప్​: యమునా నదిలోకి 500 క్యూసెక్కుల నీరు

author img

By

Published : Feb 19, 2020, 5:32 AM IST

Updated : Mar 1, 2020, 7:22 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా ఆగ్రాలో పర్యటించనున్న నేపథ్యంలో.. యమునా నది పర్యావరణ పరిస్థితిని మెరుగుపరిచేందుకు నీటి మట్టాన్ని పెంచుతోంది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. ఇందుకోసం ఇప్పటికే 500 క్యూసెక్కుల నీటిని బులంద్​షహర్​లోని గంగానహర్​ నుంచి యమునా నదిలోకి వదిలారు నీటిపారుదల అధికారులు.

trump india trip
ట్రంప్ పర్యటనకు భారీ ఏర్పాట్లు
నమస్తే ట్రంప్​: యమునా నదిలోకి 500 క్యూసెక్కుల నీరు

అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ముఖ్యంగా ట్రంప్​ పర్యటించే ప్రాంతాలను ఆహ్లాదకరంగా మార్చేందుకు చర్యలు చేపట్టింది.

ట్రంప్​ ఈ నెల 24, 25 తేదీల్లో భారత్​లో పర్యటించనున్నారు. తొలుత దిల్లీలో.. ఆ తర్వాత ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రా, గుజరాత్​లోని అహ్మదాబాద్​లను ఆయన సందర్శిస్తారు.

ఈ నేపథ్యంలో బులంద్​షహర్​లోని గంగానహర్​ నుంచి యమునా నదిలోకి 500 క్యూసెక్కుల నీటిని వదిలింది ఉత్తర్​ప్రదేశ్​ నీటిపారుదల శాఖ.

ట్రంప్​ ఆగ్రా సందర్శనను దృష్టిలో ఉంచుకుని యమునా నది పర్యావరణ పరిస్థితులను మెరుగుపరిచేందుకు నీటిని వదిలినట్లు అధికారులు తెలిపారు. ఈ నీరు ఫిబ్రవరి 20 నాటికి మథురాలోని యమునా నదిలోకి ప్రవేశించి ఫిబ్రవరి 21లోగా ఆగ్రాకు చేరుతుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 24 వరకు ఓ స్థాయిలో నీటి మట్టం ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

ఈ నీటి విడుదలతో యమునా నది నుంచి వచ్చే దుర్వాసన, ఇతర కాలుష్యాన్ని నివారించే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:ట్రంప్​కు సబర్మతీ ఆశ్రమ బహుమతులు!

నమస్తే ట్రంప్​: యమునా నదిలోకి 500 క్యూసెక్కుల నీరు

అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ముఖ్యంగా ట్రంప్​ పర్యటించే ప్రాంతాలను ఆహ్లాదకరంగా మార్చేందుకు చర్యలు చేపట్టింది.

ట్రంప్​ ఈ నెల 24, 25 తేదీల్లో భారత్​లో పర్యటించనున్నారు. తొలుత దిల్లీలో.. ఆ తర్వాత ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రా, గుజరాత్​లోని అహ్మదాబాద్​లను ఆయన సందర్శిస్తారు.

ఈ నేపథ్యంలో బులంద్​షహర్​లోని గంగానహర్​ నుంచి యమునా నదిలోకి 500 క్యూసెక్కుల నీటిని వదిలింది ఉత్తర్​ప్రదేశ్​ నీటిపారుదల శాఖ.

ట్రంప్​ ఆగ్రా సందర్శనను దృష్టిలో ఉంచుకుని యమునా నది పర్యావరణ పరిస్థితులను మెరుగుపరిచేందుకు నీటిని వదిలినట్లు అధికారులు తెలిపారు. ఈ నీరు ఫిబ్రవరి 20 నాటికి మథురాలోని యమునా నదిలోకి ప్రవేశించి ఫిబ్రవరి 21లోగా ఆగ్రాకు చేరుతుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 24 వరకు ఓ స్థాయిలో నీటి మట్టం ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

ఈ నీటి విడుదలతో యమునా నది నుంచి వచ్చే దుర్వాసన, ఇతర కాలుష్యాన్ని నివారించే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:ట్రంప్​కు సబర్మతీ ఆశ్రమ బహుమతులు!

Last Updated : Mar 1, 2020, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.