దేశంలోని అనేక ప్రాంతాల్లో చేతికొచ్చిన పంటను ధ్వంసం చేసిన మిడతలు... ఇప్పుడు నాట్ల సమయంలోనూ పొలాలపై విరుచుకుపడుతున్నాయి. రాజస్థాన్ బాడ్మేర్ జిల్లాలోని అనేక గ్రామాలపై దండెత్తాయి.
రుతుపవనాల రాకతో కొత్త పంట వేసేందుకు సిద్ధమైన రైతులు... ఆ పనులు ఆపి, మిడతల్ని తరిమికొట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వంట పాత్రలు మోగిస్తూ పెద్ద శబ్దాలు చేస్తున్నారు.
![WATCH: Locals clang utensils to scare away locusts in Rajasthan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7510189_112_7510189_1591501534580.png)
"వర్షాలు పడుతున్నందున మేము విత్తనాలను నాటుతున్నాము. అదే సమయంలో మిడతల దండు ఈ ప్రాంతానికి వచ్చింది. పదే పదే ఈ సమస్యను మేము ఎదుర్కొంటున్నాం. ఈ కీటకాల వల్ల మాకు అపారనష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వమే మాకు సాయం చేసి ఆదుకోవాలి."
- ఓ రైతు.
ఇదీ చూడండి:'గ్యాస్ లీక్' కలకలం- భయాందోళనలో ప్రజలు