ETV Bharat / bharat

'వర్చువల్​ సిమ్​'లతో కశ్మీర్​లో కొత్త సవాళ్లు

author img

By

Published : Oct 4, 2020, 5:47 PM IST

వర్చువల్​ సిమ్​కార్డులు.. జమ్ముకశ్మీర్​లోని భద్రతా బలగాలకు తలనొప్పిగా మారాయి. లోయలోని ఉగ్రవాద సంస్థలు వాటిని ఉపయోగించి.. పాకిస్థానీయులతో చర్చలు జరుపుతున్నాయని అధికారులు వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనతో ఈ తరహా సాంకేతికత ఉపయోగం బయటపడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం లోయలో 40కిపైగా వర్చువల్​ సిమ్​లు ఉండే అవకాశముందని తెలిపారు.

Virtual SIM cards a new headache for security agencies in Kashmir
కశ్మీర్​లో 'వర్చువల్​ సిమ్​కార్డుల' పంజా

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేతలో నిత్యం తీరిక లేకుండా గడిపే భద్రతా బలగాలకు 'వర్చువల్​ సిమ్​కార్డ్​'లు తలనొప్పిగా మారాయి. వీటిని ఉపయోగించుకుని.. లోయలోని ఉగ్రవాద సంస్థలు పాకిస్థానీయులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు.

పుల్వామా ఘటనతో...

లోయలో ఈ కొత్త సాంకేతికతకు సంబంధించిన ఆనవాళ్లను 2019లోనే గుర్తించారు అధికారులు. పుల్వామా ఉగ్రదాడిలో జైషే మహ్మద్​ ఉగ్రవాది ఉపయోగించిన వర్చువల్​ సిమ్​కార్డులపై దర్యాప్తు చేపట్టారు. అమెరికాకు చెందిన ఓ సర్వీస్​ ప్రొవైడర్​ను వివరాల కోసం అభ్యర్థించారు.

ఇదీ చూడండి:- ఉగ్రకుట్ర భగ్నం- ఇద్దరు ముష్కరులు అరెస్ట్​

అనంతరం దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ)తో పాటు ఇతర భద్రతా సంస్థలు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టాయి. ఒక్క పుల్వామా ఉగ్రదాడిలో 40కిపైగా వర్చువల్​ సిమ్​లను ఉపయోగించినట్టు తేలింది. అయితే ప్రస్తుతం అంతకు మించి సిమ్​కార్డులు లోయలో ఉండే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎందుకు ఈ వర్చువల్​ సిమ్​?

ఈ తరహా సిమ్​లను విదేశాల్లో సర్వీస్​ ప్రొవైడర్లు అందిస్తాయి. ఈ సాంకేతికతలో.. కంప్యూటర్​ ఓ టెలిఫోన్​ నెంబర్​ను సృష్టిస్తుంది. ఈ సిమ్​ను ఉపయోగించాలనుకునే వారు.. స్మార్ట్​ఫోన్​లో సర్వీస్​ ప్రొవైడర్​కు చెందిన యాప్​ను డౌన్​లోడ్​ చేసుకుంటారు. అనంతరం వివిధ సామాజిక మాధ్యమాలతో ఈ నెంబర్​ను జోడిస్తారు. సర్వీస్​ను యాక్టివేట్​ చేసేందుకు.. ఈ సామాజిక మాధ్యమాలే వెరిఫికేషన్​ కోడ్​ను సృష్టిస్తాయి. అనంతరం స్మార్ట్​ఫోన్​కు అందిస్తాయి.

ఇదీ చూడండి:- భారత్​ను ఎదుర్కొనేందుకు చైనాకు పాక్​ సాయం!

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేతలో నిత్యం తీరిక లేకుండా గడిపే భద్రతా బలగాలకు 'వర్చువల్​ సిమ్​కార్డ్​'లు తలనొప్పిగా మారాయి. వీటిని ఉపయోగించుకుని.. లోయలోని ఉగ్రవాద సంస్థలు పాకిస్థానీయులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు.

పుల్వామా ఘటనతో...

లోయలో ఈ కొత్త సాంకేతికతకు సంబంధించిన ఆనవాళ్లను 2019లోనే గుర్తించారు అధికారులు. పుల్వామా ఉగ్రదాడిలో జైషే మహ్మద్​ ఉగ్రవాది ఉపయోగించిన వర్చువల్​ సిమ్​కార్డులపై దర్యాప్తు చేపట్టారు. అమెరికాకు చెందిన ఓ సర్వీస్​ ప్రొవైడర్​ను వివరాల కోసం అభ్యర్థించారు.

ఇదీ చూడండి:- ఉగ్రకుట్ర భగ్నం- ఇద్దరు ముష్కరులు అరెస్ట్​

అనంతరం దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ)తో పాటు ఇతర భద్రతా సంస్థలు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టాయి. ఒక్క పుల్వామా ఉగ్రదాడిలో 40కిపైగా వర్చువల్​ సిమ్​లను ఉపయోగించినట్టు తేలింది. అయితే ప్రస్తుతం అంతకు మించి సిమ్​కార్డులు లోయలో ఉండే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎందుకు ఈ వర్చువల్​ సిమ్​?

ఈ తరహా సిమ్​లను విదేశాల్లో సర్వీస్​ ప్రొవైడర్లు అందిస్తాయి. ఈ సాంకేతికతలో.. కంప్యూటర్​ ఓ టెలిఫోన్​ నెంబర్​ను సృష్టిస్తుంది. ఈ సిమ్​ను ఉపయోగించాలనుకునే వారు.. స్మార్ట్​ఫోన్​లో సర్వీస్​ ప్రొవైడర్​కు చెందిన యాప్​ను డౌన్​లోడ్​ చేసుకుంటారు. అనంతరం వివిధ సామాజిక మాధ్యమాలతో ఈ నెంబర్​ను జోడిస్తారు. సర్వీస్​ను యాక్టివేట్​ చేసేందుకు.. ఈ సామాజిక మాధ్యమాలే వెరిఫికేషన్​ కోడ్​ను సృష్టిస్తాయి. అనంతరం స్మార్ట్​ఫోన్​కు అందిస్తాయి.

ఇదీ చూడండి:- భారత్​ను ఎదుర్కొనేందుకు చైనాకు పాక్​ సాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.