ETV Bharat / bharat

పిడుగు పడిందని పేడలో మహిళ సజీవ సమాధి! - indian superstitions

ఛత్తీస్​గఢ్​లో పిడుగుపాటుకు గాయపడిన ముగ్గురిని ఆవుపేడలో కప్పేసి 'ప్రాథమిక చికిత్స' చేశారు గ్రామస్థులు. క్షతగాత్రులను.. పేడలో పూడ్చితే చేస్తే పిడుగు దోషం తొలగిపోయి, గాయాలు తగ్గిపోతాయనుకున్నారు. కానీ, ఎంత సేపటికీ గాయాలు తగ్గకపోయేసరికి.. ఎట్టకేలకు ఆసుపత్రికి తరలించారు.

villagers-covered-injured-people-of-lightning-with-cow-dung-in-raigarh
పిడుగు పడితే.. పేడలో సజీవ సమాధి చేశారు!
author img

By

Published : Jun 29, 2020, 4:23 PM IST

Updated : Jun 29, 2020, 4:45 PM IST

ఛత్తీస్​గఢ్​లో వర్షాకాల ఆరంభంలోనే పిడుగులు విరుచుకుపడుతున్నాయి. తాజాగా జష్పూర్ జిల్లాలో పిడుగుపాటుతో ఓ మహిళ, ఇద్దరు పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించకుండా 'ప్రాథమిక చికిత్స' పేరిట గంటల పాటు పేడలో కప్పి పెట్టారు గ్రామస్థులు.

villagers-covered-injured-people-of-lightning-with-cow-dung-in-raigarh
బాధితురాలికి చికిత్స ఇలా...

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగు పడి గాయపడినవారిని ఆవుపేడలో కప్పితే గాయాలు వాటంతటవే తగ్గిపోతాయని, దోషాలు తొలిగిపోతాయని వారి నమ్మకం. కానీ, గంటల తరబడి పేడలో కప్పి ఉంచినా క్షతగాత్రులకు గాయాలు తగ్గకపోగా.. నొప్పి తీవ్రమైంది. దీంతో, బాధితులను దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, ఆ ఆసుపత్రిలో వైద్యుడికి కరోనా సోకిందని ఆ దవాఖానా మూతపడింది.

గత్యంతరం లేక రాయ్​గఢ్ జిల్లా​లోని లైలుంగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురు బాధితులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి: 80సార్లు ఉతికినా వైరస్​ను అడ్డుకునే పీపీఈ కిట్!

ఛత్తీస్​గఢ్​లో వర్షాకాల ఆరంభంలోనే పిడుగులు విరుచుకుపడుతున్నాయి. తాజాగా జష్పూర్ జిల్లాలో పిడుగుపాటుతో ఓ మహిళ, ఇద్దరు పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించకుండా 'ప్రాథమిక చికిత్స' పేరిట గంటల పాటు పేడలో కప్పి పెట్టారు గ్రామస్థులు.

villagers-covered-injured-people-of-lightning-with-cow-dung-in-raigarh
బాధితురాలికి చికిత్స ఇలా...

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగు పడి గాయపడినవారిని ఆవుపేడలో కప్పితే గాయాలు వాటంతటవే తగ్గిపోతాయని, దోషాలు తొలిగిపోతాయని వారి నమ్మకం. కానీ, గంటల తరబడి పేడలో కప్పి ఉంచినా క్షతగాత్రులకు గాయాలు తగ్గకపోగా.. నొప్పి తీవ్రమైంది. దీంతో, బాధితులను దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, ఆ ఆసుపత్రిలో వైద్యుడికి కరోనా సోకిందని ఆ దవాఖానా మూతపడింది.

గత్యంతరం లేక రాయ్​గఢ్ జిల్లా​లోని లైలుంగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురు బాధితులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి: 80సార్లు ఉతికినా వైరస్​ను అడ్డుకునే పీపీఈ కిట్!

Last Updated : Jun 29, 2020, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.