ETV Bharat / bharat

అత్యంత ఎత్తైన గ్రామానికి కుళాయి అనుసంధానం

హిమాచల్ ప్రదేశ్​లోని అత్యంత ఎత్తులో ఉన్న గ్రామంలో తొలిసారిగా తాగునీటి కుళాయి ఏర్పాటు చేసినట్లు కేంద్ర జల్​శక్తి మంత్రి గజేంద్ర షెకావత్​ తెలిపారు. జల్​ జీవన్ మిషన్​లో భాగంగా దీనిని అందుబాటులోకి తెచ్చినట్టు వివరించారు.

author img

By

Published : Sep 25, 2020, 6:55 AM IST

Village with highest altitude polling station gets first tap water connection: Shekhawat
అత్యంత ఎత్తైన గ్రామానికి కుళాయి అనుసంధానం!

హిమాచల్​ప్రదేశ్​లోని స్పితి లోయలో సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉన్న తాషిగాంగ్ అనే చిన్న గ్రామంలో తొలిసారిగా కుళాయి ద్వారా తాగు నీరు సౌకర్యాన్ని కల్పించారు. దీంతో జల్​ జీవన్ మిషన్​లో భాగంగా.. అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న గ్రామానికి తాగు నీటి సౌకర్యం కల్పించినట్టు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు.

భారత్-చైనా సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. శీతాకాలంలో మంచు కురవడం వల్ల ఆరు నెలల పాటు ఈ గ్రామానికి ఇతర ప్రాంతాలతో సంబంధం తెగిపోతుంది. మంచును కరిగించి నీరు తాగాల్సిన పరిస్థితి ఇక్కడ ఉండేదని షేకావత్​ వెల్లడించారు. తాషిగాంగ్​, చిచామ్లలో భౌగోళిక పరిస్థితుల కారణంగా పంపు నీటిని ఇంత ఎత్తుకు తీసుకెళ్లడం పెద్ద సవాలు అని​ పేర్కొన్నారు.

'ప్రపంచంలో అత్యధిక ఎత్తులో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లోని తాషిగాంగ్ గ్రామంలో మొదటి ట్యాప్ కనెక్షన్ స్థాపించాం. ఈ ఘనత సాధించిన హిమాచల్ ప్రదేశ్ బృందానికి హృదయపూర్వక అభినందనలు' అని ట్వీట్​ చేశారు షెకావత్​.

అయితే స్పితి లోయ జనాభా 31,564. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోలింగ్​ స్టేషన్​ కూడా ఇక్కడే ఉంది.

ఇదీ చూడండి: దిల్లీలో తీవ్రస్థాయికి రెండో దశ కరోనా: కేజ్రీవాల్​

హిమాచల్​ప్రదేశ్​లోని స్పితి లోయలో సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉన్న తాషిగాంగ్ అనే చిన్న గ్రామంలో తొలిసారిగా కుళాయి ద్వారా తాగు నీరు సౌకర్యాన్ని కల్పించారు. దీంతో జల్​ జీవన్ మిషన్​లో భాగంగా.. అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న గ్రామానికి తాగు నీటి సౌకర్యం కల్పించినట్టు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు.

భారత్-చైనా సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. శీతాకాలంలో మంచు కురవడం వల్ల ఆరు నెలల పాటు ఈ గ్రామానికి ఇతర ప్రాంతాలతో సంబంధం తెగిపోతుంది. మంచును కరిగించి నీరు తాగాల్సిన పరిస్థితి ఇక్కడ ఉండేదని షేకావత్​ వెల్లడించారు. తాషిగాంగ్​, చిచామ్లలో భౌగోళిక పరిస్థితుల కారణంగా పంపు నీటిని ఇంత ఎత్తుకు తీసుకెళ్లడం పెద్ద సవాలు అని​ పేర్కొన్నారు.

'ప్రపంచంలో అత్యధిక ఎత్తులో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లోని తాషిగాంగ్ గ్రామంలో మొదటి ట్యాప్ కనెక్షన్ స్థాపించాం. ఈ ఘనత సాధించిన హిమాచల్ ప్రదేశ్ బృందానికి హృదయపూర్వక అభినందనలు' అని ట్వీట్​ చేశారు షెకావత్​.

అయితే స్పితి లోయ జనాభా 31,564. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోలింగ్​ స్టేషన్​ కూడా ఇక్కడే ఉంది.

ఇదీ చూడండి: దిల్లీలో తీవ్రస్థాయికి రెండో దశ కరోనా: కేజ్రీవాల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.