ETV Bharat / bharat

'దుబేకు బెయిల్​ రావడం వ్యవస్థ వైఫల్యమే'

author img

By

Published : Jul 20, 2020, 3:39 PM IST

వికాస్​ దుబే వంటి నేరస్థులకు బెయిల్​ రావడాన్ని వ్యవస్థ వైఫల్యంగా అభివర్ణించింది భారత అత్యున్నత న్యాయస్థానం. ఎన్​కౌంటర్​పై దర్యాప్తు చేస్తున్న కమిటీలో మాజీ న్యాయమూర్తి సహా విశ్రాంత పోలీస్ అధికారిని నియమించే అంశాన్ని పరిశీలించాలని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వానికి సూచించింది. చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Vikas Dubey encounter
'విచారణ కమిటీలో మాజీ న్యాయమూర్తిని నియమించండి'

కరుడుగట్టిన గ్యాంగ్​స్టర్ వికాస్ దుబేకు బెయిల్ రావడం పట్ల సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలాంటి నేరస్థులకు బెయిల్​ రావడాన్ని వ్యవస్థ వైఫల్యంగా అభివర్ణించింది. చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ​ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించింది.

దుబే సహా అతని అనుచరుల ఎన్​కౌంటర్​పై విచారణలో కోర్టు పర్యవేక్షణ ఉండాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు ఆలకించింది. ఎన్​కౌంటర్​పై దర్యాప్తు చేస్తున్న కమిటీలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, విశ్రాంత పోలీసు అధికారిని నియమించే అంశాన్ని పరిశీలించాలని ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ కమిటీలో సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిని నియమించలేమని స్పష్టం చేసింది.

"హైదరాబాద్(దిశా కేసు)​ ఘటనకు, దీనికి తేడా ఉంది. కానీ ఓ ప్రభుత్వంగా చట్టాన్ని పరిరక్షించాలి. ఇది వారి బాధ్యత. దీనికి అరెస్టులు, విచారణ, శిక్ష విధించడం వంటి ప్రక్రియ అవసరం. చాలా కేసులు ఉన్నప్పటికీ వికాస్ దుబే లాంటి వ్యక్తికి బెయిల్ లభించడం ఆశ్చర్యకరం. జైల్లో ఉండాల్సిన వ్యక్తికి బెయిల్​ లభించింది. ఇది వ్యవస్థ వైఫల్యం."

-సుప్రీంకోర్టు

విచారణ కమిటీలో మార్పులకు సంబంధించి ముసాయిదా తీర్మానాన్ని జులై 22లోపు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

యూపీ సర్కార్​ అఫిడవిట్

ఈ కేసుకు సంబంధించి ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దుబే, అతని అనుచరుల ఎన్​కౌంటర్ విషయంలో దర్యాప్తు చేయడానికి విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శశికాంత్ అగర్వాల్​ను నియమించినట్లు ధర్మాసనానికి తెలిపింది.

అంతకుముందు.. వాదనల సందర్భంగా విచారణ ప్యానెల్​లో సుప్రీంకోర్టు సూచించిన మార్పులకు సంబంధించి జులై 22లోగా ముసాయిదా నోటిఫికేషన్​ను రూపొందిస్తామని మెహతా తెలిపారు. దుబేపై 65 ఎఫ్ఐఆర్​లు నమోదయ్యాయని.. నిందితుడు పెరోల్​పై బయటకు వచ్చాడని వెల్లడించారు. 8 మంది పోలీసులను చంపి వారి శరీరాలను ఛిద్రం చేశారని మెహతా పేర్కొన్నారు. అయితే దుబే ఎన్​కౌంటర్​ను సమర్థించడం లేదని తెలిపారు.

ఇవే మానుకోండి!

విచారణ కమిటీలో నియమించే సభ్యులను ఎంపిక చేసుకునే అధికారాన్ని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వానికి ఇవ్వకూడదన్న ఓ పిటిషనర్ వాదనను ధర్మాసనం తప్పుబట్టింది. సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటారా? అని ప్రశ్నించింది. ఇలాంటి వైఖరిని మానుకోవాలని పిటిషనర్​కు హితవు పలికింది.

ఇదీ చదవండి- ''మోదీ-బలమైన వ్యక్తి' కల్పితమే.. దేశ అతిపెద్ద బలహీనత'

కరుడుగట్టిన గ్యాంగ్​స్టర్ వికాస్ దుబేకు బెయిల్ రావడం పట్ల సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలాంటి నేరస్థులకు బెయిల్​ రావడాన్ని వ్యవస్థ వైఫల్యంగా అభివర్ణించింది. చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ​ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించింది.

దుబే సహా అతని అనుచరుల ఎన్​కౌంటర్​పై విచారణలో కోర్టు పర్యవేక్షణ ఉండాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు ఆలకించింది. ఎన్​కౌంటర్​పై దర్యాప్తు చేస్తున్న కమిటీలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, విశ్రాంత పోలీసు అధికారిని నియమించే అంశాన్ని పరిశీలించాలని ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ కమిటీలో సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిని నియమించలేమని స్పష్టం చేసింది.

"హైదరాబాద్(దిశా కేసు)​ ఘటనకు, దీనికి తేడా ఉంది. కానీ ఓ ప్రభుత్వంగా చట్టాన్ని పరిరక్షించాలి. ఇది వారి బాధ్యత. దీనికి అరెస్టులు, విచారణ, శిక్ష విధించడం వంటి ప్రక్రియ అవసరం. చాలా కేసులు ఉన్నప్పటికీ వికాస్ దుబే లాంటి వ్యక్తికి బెయిల్ లభించడం ఆశ్చర్యకరం. జైల్లో ఉండాల్సిన వ్యక్తికి బెయిల్​ లభించింది. ఇది వ్యవస్థ వైఫల్యం."

-సుప్రీంకోర్టు

విచారణ కమిటీలో మార్పులకు సంబంధించి ముసాయిదా తీర్మానాన్ని జులై 22లోపు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

యూపీ సర్కార్​ అఫిడవిట్

ఈ కేసుకు సంబంధించి ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దుబే, అతని అనుచరుల ఎన్​కౌంటర్ విషయంలో దర్యాప్తు చేయడానికి విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శశికాంత్ అగర్వాల్​ను నియమించినట్లు ధర్మాసనానికి తెలిపింది.

అంతకుముందు.. వాదనల సందర్భంగా విచారణ ప్యానెల్​లో సుప్రీంకోర్టు సూచించిన మార్పులకు సంబంధించి జులై 22లోగా ముసాయిదా నోటిఫికేషన్​ను రూపొందిస్తామని మెహతా తెలిపారు. దుబేపై 65 ఎఫ్ఐఆర్​లు నమోదయ్యాయని.. నిందితుడు పెరోల్​పై బయటకు వచ్చాడని వెల్లడించారు. 8 మంది పోలీసులను చంపి వారి శరీరాలను ఛిద్రం చేశారని మెహతా పేర్కొన్నారు. అయితే దుబే ఎన్​కౌంటర్​ను సమర్థించడం లేదని తెలిపారు.

ఇవే మానుకోండి!

విచారణ కమిటీలో నియమించే సభ్యులను ఎంపిక చేసుకునే అధికారాన్ని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వానికి ఇవ్వకూడదన్న ఓ పిటిషనర్ వాదనను ధర్మాసనం తప్పుబట్టింది. సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటారా? అని ప్రశ్నించింది. ఇలాంటి వైఖరిని మానుకోవాలని పిటిషనర్​కు హితవు పలికింది.

ఇదీ చదవండి- ''మోదీ-బలమైన వ్యక్తి' కల్పితమే.. దేశ అతిపెద్ద బలహీనత'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.