ETV Bharat / bharat

'మన్రేగా అమలులో ఆయన పాత్ర చిరస్మరణీయం'

author img

By

Published : Sep 13, 2020, 4:46 PM IST

కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్​ ప్రసాద్​ సింగ్​ మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ సహా.. కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ఆయనకు నివాళులర్పించారు.

Vice President Venkaiah Naidu and PM Modi condoles Raghuvansh's death
మన్రేగా అమలులో ఆయన పాత్ర చిరకాలం నిలిచిపోతుంది

మన్రేగా రూపశిల్పి, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్​ ప్రసాద్​ మృతిపట్ల రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా.. పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం బిహార్​ రాజకీయాల్లో తీరని లోటుగా మోదీ అభివర్ణించారు.

రఘువంశ్​కు నివాళులర్పించిన వెంకయ్యనాయుడు.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్​ఎన్​ఆర్​ఈజీఎస్​)ను అమలు చేయడంలో ఆయన పాత్ర చిరకాలం నిలిచిపోతుందని కొనియాడారు.

'రఘువంశ్​ ఆకస్మిక మరణం తీవ్ర విచారం కలిగించింది. అట్టడుగు స్థాయి నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్​గా ఎదిగిన గొప్ప నేత ఆయన.​ పేద, గ్రామీణ ప్రజల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిది.'

- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి

Vice President Secretariant tweet
ఉపరాష్ట్రపతి సచివాలయం ట్వీట్​

అమిత్​ షా..

రఘువంశ్​ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. పేద, అణగారిన వర్గాల ప్రజలకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని ట్వీట్​ చేశారు.

కాంగ్రెస్​ తీవ్ర దిగ్భ్రాంతి..

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాలు.. కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్​కు ఘన నివాళులర్పించారు. ఆయన మరణంతో బలమైన గళాన్ని వినిపించే గొప్ప నాయకుడ్ని రైతులు కోల్పోయారన్నారు రాహుల్​. రఘువంశ్​ మరణం దేశ రాజకీయాల్లో తీరని లోటని పేర్కొన్న ప్రియాంక.. ఆయన కృషి ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు.

'బిహార్​కు ప్రియ కుమారుడు రఘువంశ్' అని కాంగ్రెస్​ పేర్కొంది. రాజకీయాల్లో ఆయన నైతిక విలువలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కాంగ్రెస్​ వెల్లడించింది.

ఇదీ చదవండి: కేంద్ర మాజీమంత్రి రఘువంశ్​ ప్రసాద్​ కన్నుమూత

మన్రేగా రూపశిల్పి, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్​ ప్రసాద్​ మృతిపట్ల రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా.. పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం బిహార్​ రాజకీయాల్లో తీరని లోటుగా మోదీ అభివర్ణించారు.

రఘువంశ్​కు నివాళులర్పించిన వెంకయ్యనాయుడు.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్​ఎన్​ఆర్​ఈజీఎస్​)ను అమలు చేయడంలో ఆయన పాత్ర చిరకాలం నిలిచిపోతుందని కొనియాడారు.

'రఘువంశ్​ ఆకస్మిక మరణం తీవ్ర విచారం కలిగించింది. అట్టడుగు స్థాయి నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్​గా ఎదిగిన గొప్ప నేత ఆయన.​ పేద, గ్రామీణ ప్రజల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిది.'

- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి

Vice President Secretariant tweet
ఉపరాష్ట్రపతి సచివాలయం ట్వీట్​

అమిత్​ షా..

రఘువంశ్​ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. పేద, అణగారిన వర్గాల ప్రజలకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని ట్వీట్​ చేశారు.

కాంగ్రెస్​ తీవ్ర దిగ్భ్రాంతి..

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాలు.. కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్​కు ఘన నివాళులర్పించారు. ఆయన మరణంతో బలమైన గళాన్ని వినిపించే గొప్ప నాయకుడ్ని రైతులు కోల్పోయారన్నారు రాహుల్​. రఘువంశ్​ మరణం దేశ రాజకీయాల్లో తీరని లోటని పేర్కొన్న ప్రియాంక.. ఆయన కృషి ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు.

'బిహార్​కు ప్రియ కుమారుడు రఘువంశ్' అని కాంగ్రెస్​ పేర్కొంది. రాజకీయాల్లో ఆయన నైతిక విలువలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కాంగ్రెస్​ వెల్లడించింది.

ఇదీ చదవండి: కేంద్ర మాజీమంత్రి రఘువంశ్​ ప్రసాద్​ కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.