ETV Bharat / bharat

కరోనా: పంజాబ్​లో 6 నెలల చిన్నారి మృతి

author img

By

Published : Apr 23, 2020, 8:46 PM IST

Updated : Apr 24, 2020, 7:13 AM IST

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. మహారాష్ట్ర పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. ఇవాళ ఒక్కరోజే 778 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, దిల్లీ, గుజరాత్​, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​లోనూ కేసులు వృద్ధి చెందుతున్నాయి. గుజరాత్​లో ఇవాళ ఒక్కరోజే 217 కేసులు బయటపడ్డాయి. అయితే అటు ఉత్తరాఖండ్​లో మాత్రం గతకొద్ది రోజులుగా కేసులు తగ్గుముఖం పట్టాయి.

దేశంలో ఆగని కరోనా వ్యాప్తి.. గుజరాత్​లో 217 కొత్త కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. దేశంలో కొవిడ్​-19 కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే 778 కొత్త కేసులు బయటపడ్డాయి. మరో 14 మంది మృతి చెందారు. కొత్తవాటితో కలిపి రాష్ట్రంలో కొవిడ్​-19 కేసుల సంఖ్య 6427కు చేరింది. రాజస్థాన్​, తమిళనాడు, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల్లోనూ వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది.

గుజరాత్​లో 217 కేసులు

గుజరాత్​లో ఇవాళ మరో 217 కేసులు బయటపడ్డాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2624కు చేరింది. 112 మంది మరణించారు.

మధ్యప్రదేశ్​లో​ 24 గంటల్లో 100

మధ్యప్రదేశ్​లో గడిచిన 24 గంటల్లో 100 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 1,687కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 83 మంది మృతి చెందారు. 203 మంది డిశ్చార్జ్​ అయ్యారు.

కర్ణాటకలో మరో 16 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది.

తమిళనాడులో..

తమిళనాడులో ఇవాళ కొత్తగా 54 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఆ రాష్ట్రంలో మొత్తం కొవిడ్​-19 కేసుల సంఖ్య 1683కు చేరింది. తాజాగా మరో ఇద్దరు మృతిచెందగా రాష్ట్రంలో మొత్తం 20 మంది బలయ్యారు. 750 మంది కోలుకున్నారు.

యూపీలో 1507 మందికి వైరస్​

ఉత్తరప్రదేశ్​లో ఇవాళ ఒక్కరోజే 58 మందికి వైరస్ సోకినట్లు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,507 మంది మహమ్మారి బాధితులు ఉన్నారు. ఇందులో 1,299 యాక్టివ్​ కేసులు కాగా, 187 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల్లో 938 మందికి మర్కజ్​కు వెళ్లి వచ్చిన వారి కారణంగా వైరస్​ సోకినట్లు పేర్కొన్నారు.

కేరళలో వైద్యపరిశీలనలో 23వేల మంది

కేరళలో మరో 10 మంది వైరస్​ బారిన పడినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య వర్గాలు తెలిపాయి. మొత్తం 23 వేల మంది వైద్య పరిశీలనలో ఉన్నట్లు ​ వెల్లడించారు. గత రెండు రోజుల నుంచి గ్రీన్​జోన్​లో ఉన్న కొట్టాయం​ ప్రాంతంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు.

పంజాబ్​లో 6నెలల చిన్నారి మృతి

పంజాబ్​లో కరోనా బారిన పడి 6 నెలల చిన్నారి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 16 మంది మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 277 మందికి వైరస్​ సోకగా, వీరిలో 65 మంది కోలుకున్నారు.

దిల్లీలో..

దేశ రాజధానిలో మొత్తం 2,248 మంది వైరస్​ బారిన పడగా, 724 మంది కోలుకున్నారు. మరో 48 మంది మృతి చెందారు.

ఇతర రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే..

ఉత్తరాఖండ్​లో ఇప్పటి వరకు 46 మందికి వైరస్​ సోకగా 23 మంది కోలుకున్నారు. అలాగే బిహార్​లో 153 మంది వైరస్​ సోకింది. జమ్ముకశ్మీర్​లో 407 మంది కరోనా బాధితులు ఉన్నారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. దేశంలో కొవిడ్​-19 కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే 778 కొత్త కేసులు బయటపడ్డాయి. మరో 14 మంది మృతి చెందారు. కొత్తవాటితో కలిపి రాష్ట్రంలో కొవిడ్​-19 కేసుల సంఖ్య 6427కు చేరింది. రాజస్థాన్​, తమిళనాడు, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల్లోనూ వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది.

గుజరాత్​లో 217 కేసులు

గుజరాత్​లో ఇవాళ మరో 217 కేసులు బయటపడ్డాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2624కు చేరింది. 112 మంది మరణించారు.

మధ్యప్రదేశ్​లో​ 24 గంటల్లో 100

మధ్యప్రదేశ్​లో గడిచిన 24 గంటల్లో 100 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 1,687కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 83 మంది మృతి చెందారు. 203 మంది డిశ్చార్జ్​ అయ్యారు.

కర్ణాటకలో మరో 16 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది.

తమిళనాడులో..

తమిళనాడులో ఇవాళ కొత్తగా 54 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఆ రాష్ట్రంలో మొత్తం కొవిడ్​-19 కేసుల సంఖ్య 1683కు చేరింది. తాజాగా మరో ఇద్దరు మృతిచెందగా రాష్ట్రంలో మొత్తం 20 మంది బలయ్యారు. 750 మంది కోలుకున్నారు.

యూపీలో 1507 మందికి వైరస్​

ఉత్తరప్రదేశ్​లో ఇవాళ ఒక్కరోజే 58 మందికి వైరస్ సోకినట్లు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,507 మంది మహమ్మారి బాధితులు ఉన్నారు. ఇందులో 1,299 యాక్టివ్​ కేసులు కాగా, 187 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల్లో 938 మందికి మర్కజ్​కు వెళ్లి వచ్చిన వారి కారణంగా వైరస్​ సోకినట్లు పేర్కొన్నారు.

కేరళలో వైద్యపరిశీలనలో 23వేల మంది

కేరళలో మరో 10 మంది వైరస్​ బారిన పడినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య వర్గాలు తెలిపాయి. మొత్తం 23 వేల మంది వైద్య పరిశీలనలో ఉన్నట్లు ​ వెల్లడించారు. గత రెండు రోజుల నుంచి గ్రీన్​జోన్​లో ఉన్న కొట్టాయం​ ప్రాంతంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు.

పంజాబ్​లో 6నెలల చిన్నారి మృతి

పంజాబ్​లో కరోనా బారిన పడి 6 నెలల చిన్నారి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 16 మంది మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 277 మందికి వైరస్​ సోకగా, వీరిలో 65 మంది కోలుకున్నారు.

దిల్లీలో..

దేశ రాజధానిలో మొత్తం 2,248 మంది వైరస్​ బారిన పడగా, 724 మంది కోలుకున్నారు. మరో 48 మంది మృతి చెందారు.

ఇతర రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే..

ఉత్తరాఖండ్​లో ఇప్పటి వరకు 46 మందికి వైరస్​ సోకగా 23 మంది కోలుకున్నారు. అలాగే బిహార్​లో 153 మంది వైరస్​ సోకింది. జమ్ముకశ్మీర్​లో 407 మంది కరోనా బాధితులు ఉన్నారు.

Last Updated : Apr 24, 2020, 7:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.