ETV Bharat / bharat

నమస్తే ట్రంప్​: గుజరాత్​కు మరో కార్గో విమానం

author img

By

Published : Feb 22, 2020, 8:17 PM IST

Updated : Mar 2, 2020, 5:22 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా... ఆయన భద్రతకు అవసరమైన పరికరాలను కార్గో విమానాల్లో భారత్​కు తరలిస్తున్నారు. తాజాగా గుజరాత్​లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సీ-17 గ్లోబ్​ మాస్టర్ కార్గో విమానం వచ్చింది. ​ఇందులో భద్రతా పరికరాలు, ప్రత్యేక వాహనాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.

trump visit  Forth cargo plane lands at Ahd airport
నమస్తే ట్రంప్ ​- గుజరాత్​కు మరో కార్గో విమానం

అమెరికా నుంచి మరో కార్గో విమానం గుజరాత్​లోని అహ్మదాబాద్​ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ఫిబ్రవరి 24న భారత​ సందర్శనకు రానున్న నేపథ్యంలో... ప్రత్యేక వాహనాన్ని, భద్రత పరికరాలను సీ-17 గ్లోబ్​ మాస్టర్​ కార్గో విమానంలో తీసుకువచ్చారు.

కార్గో విమానంలో తెచ్చిన ఈ ప్రత్యేక వాహనం ట్రంప్ కాన్వాయ్​లో భాగమేనని అధికారులు తెలిపారు. తొలిసారి భారత్​లో పర్యటించనున్న ట్రంప్​ కోసం ఇప్పటికే మూడు కార్గో విమానాలు భారత్​కు చేరుకున్నాయి.

36 గంటలు మాత్రమే

ఫిబ్రవరి 24న యూఎస్​ అధ్యక్షుడు ట్రంప్ తన సతీమణి మెలానియా ట్రంప్​తో కలిసి భారత్​కు రానున్నారు. అలాగే ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో పాటు ట్రంప్ కుమార్తె ఇవాంకా​, అల్లుడు జారెడ్​ కుష్నర్​, పలువురు ఉన్నతాధికారులు రానున్నారు. కేవలం 36 గంటలపాటే ఆయన భారత్​లో గడపనున్నారు.

పటిష్ట భద్రత కోసం..

అమెరికా అధ్యక్షుడి భద్రత కోసం భారత్​తో పాటు.. యూఎస్ కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేస్తోంది. అందులో భాగంగా అవసరమైన భద్రతా పరికరాలు, వాహనాలను తీసుకువెళ్లడం సాధారణంగా జరిగేదే.

కొద్ది రోజుల క్రితం యూఎస్​ 'మెరైన్ వన్'​ హెలికాప్టర్ భారత్​కు చేరుకుంది. ఇది కూడా యూఎస్​ కార్గోలో భాగమేనని అధికారులు స్పష్టం చేశారు.​

గత సోమవారం భారత్​కు చేరుకున్న మొదటి సీ-17 గ్లోబ్​మాస్టర్... వివిధ పరికరాలు, ఒక ఎస్​యూవీని తీసుకొచ్చింది. దీని తరువాత వచ్చిన మరో రెండు కార్గో విమానాల్లో ఒకటి ఒక పెద్ద ఎస్​యూవీ... కమ్యూనికేషన్ ఏజెన్సీ (డబ్ల్యూహెచ్​సీఏ) రోడ్​ రన్నర్ తీసుకొచ్చింది. వీటిని ఫిబ్రవరి 24న ఆశ్వికదళంతో ట్రంప్​ చేసే 22 కి.మీ. రోడ్​షోలో ఉపయోగించవచ్చు.

నమస్తే ట్రంప్​..

ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి 'నమస్తే ట్రంప్' కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం అహ్మదాబాద్​లో కొత్తగా నిర్మించిన మోటేరా స్టేడియంలో జరగనుంది. ఈ మైదానంలో ఒకేసారి 1.10 లక్షల మంది కూర్చోవచ్చు. ఈ భారీ కార్యక్రమానికి 10 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ట్రంప్​కు దిల్లీలో ప్రత్యేక విందు- మెనూ చాలా స్పెషల్​

అమెరికా నుంచి మరో కార్గో విమానం గుజరాత్​లోని అహ్మదాబాద్​ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ఫిబ్రవరి 24న భారత​ సందర్శనకు రానున్న నేపథ్యంలో... ప్రత్యేక వాహనాన్ని, భద్రత పరికరాలను సీ-17 గ్లోబ్​ మాస్టర్​ కార్గో విమానంలో తీసుకువచ్చారు.

కార్గో విమానంలో తెచ్చిన ఈ ప్రత్యేక వాహనం ట్రంప్ కాన్వాయ్​లో భాగమేనని అధికారులు తెలిపారు. తొలిసారి భారత్​లో పర్యటించనున్న ట్రంప్​ కోసం ఇప్పటికే మూడు కార్గో విమానాలు భారత్​కు చేరుకున్నాయి.

36 గంటలు మాత్రమే

ఫిబ్రవరి 24న యూఎస్​ అధ్యక్షుడు ట్రంప్ తన సతీమణి మెలానియా ట్రంప్​తో కలిసి భారత్​కు రానున్నారు. అలాగే ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో పాటు ట్రంప్ కుమార్తె ఇవాంకా​, అల్లుడు జారెడ్​ కుష్నర్​, పలువురు ఉన్నతాధికారులు రానున్నారు. కేవలం 36 గంటలపాటే ఆయన భారత్​లో గడపనున్నారు.

పటిష్ట భద్రత కోసం..

అమెరికా అధ్యక్షుడి భద్రత కోసం భారత్​తో పాటు.. యూఎస్ కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేస్తోంది. అందులో భాగంగా అవసరమైన భద్రతా పరికరాలు, వాహనాలను తీసుకువెళ్లడం సాధారణంగా జరిగేదే.

కొద్ది రోజుల క్రితం యూఎస్​ 'మెరైన్ వన్'​ హెలికాప్టర్ భారత్​కు చేరుకుంది. ఇది కూడా యూఎస్​ కార్గోలో భాగమేనని అధికారులు స్పష్టం చేశారు.​

గత సోమవారం భారత్​కు చేరుకున్న మొదటి సీ-17 గ్లోబ్​మాస్టర్... వివిధ పరికరాలు, ఒక ఎస్​యూవీని తీసుకొచ్చింది. దీని తరువాత వచ్చిన మరో రెండు కార్గో విమానాల్లో ఒకటి ఒక పెద్ద ఎస్​యూవీ... కమ్యూనికేషన్ ఏజెన్సీ (డబ్ల్యూహెచ్​సీఏ) రోడ్​ రన్నర్ తీసుకొచ్చింది. వీటిని ఫిబ్రవరి 24న ఆశ్వికదళంతో ట్రంప్​ చేసే 22 కి.మీ. రోడ్​షోలో ఉపయోగించవచ్చు.

నమస్తే ట్రంప్​..

ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి 'నమస్తే ట్రంప్' కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం అహ్మదాబాద్​లో కొత్తగా నిర్మించిన మోటేరా స్టేడియంలో జరగనుంది. ఈ మైదానంలో ఒకేసారి 1.10 లక్షల మంది కూర్చోవచ్చు. ఈ భారీ కార్యక్రమానికి 10 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ట్రంప్​కు దిల్లీలో ప్రత్యేక విందు- మెనూ చాలా స్పెషల్​

Last Updated : Mar 2, 2020, 5:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.