ETV Bharat / bharat

మహాత్ముడి స్మరణలో ట్రంప్.. రాజ్​ఘాట్​లో నివాళి

author img

By

Published : Feb 25, 2020, 10:49 AM IST

Updated : Mar 2, 2020, 12:18 PM IST

దిల్లీ రాజ్​ఘాట్​లో మహాత్మా గాంధీ సమాధికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ నివాళులర్పించారు. మహాత్ముడి సేవలను ట్రంప్​ దంపతులు స్మరించుకున్నారు.

US President Donald Trump & First Lady Melania Trump pay tribute to Mahatma Gandhi at Raj Ghat.
మహాత్ముడి స్మరణలో ట్రంప్ దంపతులు.. రాజ్​ఘాట్​లో నివాళి
మహాత్ముడి స్మరణలో ట్రంప్.. రాజ్​ఘాట్​లో నివాళి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. రాజ్​ఘాట్​లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. సతీమణి మెలానియాతో కలిసి బాపూను స్మరించుకున్నారు ట్రంప్​.

అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు హైదరాబాద్​ హౌస్​కు బయలుదేరారు. అక్కడే దాదాపు గంటకుపైగా ప్రధానితో పలు ఒప్పందాలపై చర్చించి ఇరువురు నేతలు సంతకాలు చేసే అవకాశముంది.

అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, ఆయన సతీమణి మెలానియాకు​ దిల్లీలోని రాజ్​భవన్​లో ఘన స్వాగతం లభించింది. ట్రంప్​ దంపతులకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. భారత త్రివిధ దళాల గౌరవ వందనాన్ని అమెరికా అధ్యక్షుడు స్వీకరించారు.

ఇదీ చూడండి:- అమెరికా అధ్యక్షుడి పేరుతో భారత్​లో ఓ గ్రామం!

మహాత్ముడి స్మరణలో ట్రంప్.. రాజ్​ఘాట్​లో నివాళి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. రాజ్​ఘాట్​లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. సతీమణి మెలానియాతో కలిసి బాపూను స్మరించుకున్నారు ట్రంప్​.

అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు హైదరాబాద్​ హౌస్​కు బయలుదేరారు. అక్కడే దాదాపు గంటకుపైగా ప్రధానితో పలు ఒప్పందాలపై చర్చించి ఇరువురు నేతలు సంతకాలు చేసే అవకాశముంది.

అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, ఆయన సతీమణి మెలానియాకు​ దిల్లీలోని రాజ్​భవన్​లో ఘన స్వాగతం లభించింది. ట్రంప్​ దంపతులకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. భారత త్రివిధ దళాల గౌరవ వందనాన్ని అమెరికా అధ్యక్షుడు స్వీకరించారు.

ఇదీ చూడండి:- అమెరికా అధ్యక్షుడి పేరుతో భారత్​లో ఓ గ్రామం!

Last Updated : Mar 2, 2020, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.